ఆదరిస్తున్న అయ్యప్ప సేవా సమితి
Published Tuesday, 14 April 2020సైదాబాద్, మార్చి13: లాక్డౌన్ పరిస్థితులలో నిరాశ్రయులు ఆకలికి అలమటించకుండా అయ్యప్ప పాదయాత్ర సేవాసమితి ఆదరించటం అభినందనీయమని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మలక్పేట, యాకత్పురా, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలోని పలుప్రాంతాలకు చెందిన దినసరి కూలీలు నిరుపేదలు 500 మందికి 17 రోజులుగా సేవాసమితి ప్రతినిధులు ఆహార ప్యాకెట్లను అందజేస్తున్నారు. సోమవారం ఐఎస్సదన్ డివిజన్ లక్ష్మీనగర్లో అయ్యప్ప పాదయాత్ర సేవాసమితి ప్రతినిధి అబ్బగోని బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య సైదాబాద్ పోలీసులు, పారిశుద్యకార్మికులు, ట్రాన్స్కో ఆరోగ్యశాఖ సిబ్బందిని సన్మానించారు.