విద్యుత్ శాఖకు రూ. 56 కోట్లు ఆదా
Published Monday, 13 April 2020అమరావతి, ఏప్రిల్ 13: సంక్షోభ కాలంలోనూ ప్రజాధనం ఆదా చేయడంపై దృష్టి పెట్టినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ తెలిపింది. మార్చి నెలలో చౌకగా లభించే విద్యుత్ కొనుగోలు చేసి 56కోట్ల రూపాయల మేర మిగిల్చినట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మార్చిలో సంస్థ పరిస్థితిపై ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ సోమవారం సమీక్ష జరిపారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖరరెడ్డి సోమవారం విలేఖరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యుత్ ధరలు తగ్గడాన్ని గుర్తించి మార్కెట్లో లభించే చౌక విద్యుత్ను కొనుగోలు చేశారు. మార్చిలో 357.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేశారు.