కరోనాపై కాంగ్రెస్ అఖిలపక్షం
Published Tuesday, 14 April 2020హైదరాబాద్, ఏప్రిల్ 13: కరోనా పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యంపై అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ వివరాలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటించారు. అన్నపూర్ణ కేంద్రాలపై సమాచారం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. వలస కూలీల పరిస్థితుల పై అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డులు లేని వారికి బియ్యం, డబ్బులు ఇవ్వాలన్నారు. టీపీసీసీ కరోనా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.