S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

07/13/2016 - 06:51

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదకొండవ తేదీ వరకు నాలుగు ఆఫ్రికా దేశాలలో జరిపిన ఐదురోజుల పర్యటనకు విస్తరిస్తున్న ఉగ్రవాదం ప్రధాన నేపథ్యం.

07/11/2016 - 23:47

హిజ్‌బుల్ ముజాహిదీన్ జిహాదీ ముఠాకు చెందిన మొదటి ఉగ్రవాది బుర్హన్ వానీకి పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో సంస్మరణ సభలు జరగడం విస్మయకరం కాదు. ఈ సంస్మరణ సభలను జరిపించడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం తన బీభత్స స్వరూపాన్ని మరోసారి ప్రదర్శించింది. తద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశాన్ని మరోసారి కవ్వించింది.

07/11/2016 - 04:56

బంగ్లాదేశ్‌లో జూలై ఒకటవ తేదీన భయంకర బీభత్స కాండ జరిపిన జిహాదీ ఉగ్రవాదులను ఉసిగొల్పిన జాకిర్ నాయిక్‌ను తక్షణం నిర్బంధించకపోవడం మన ప్రభుత్వ వైఫల్యం. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక భోజన శాలపై దాడి చేసిన జిహాదీలు అనేకమందిని బందీలుగా పట్టుకున్నారు, ఆ తరువాత 28 మందిని చంపేశారు. ఢాకాలో ఈ ఘోరం జరిగిన నాలుగు రోజుల తరువాత ఈ జిహాదీ హంతకులను ఉసిగొల్పినవాడు జాకిర్ నాయిక్ అన్న వాస్తవం ధ్రువపడింది.

07/09/2016 - 07:45

నమామి గంగే-గంగానదీ నీకు నమస్కరిస్తున్నాను- అన్నది నినాదం కాదు, సనాతన భారత జాతీయ జీవన స్వభావం! నమామి గంగే అన్న విస్తృత ప్రక్షాళన కార్యక్రమం గురువారం ఆరంభం కావడం గ్రహణగ్రస్తమై ఉన్న ఈ స్వభావ విముక్తికి మరో శ్రీకారం.

07/08/2016 - 03:13

దేశంలోని దాదాపు మూడవ వంతు భూభాగం నిర్జీవమై పోయిందని, పోతోందని నిగ్గుతేలడం పాలకులకు పాలితులకు ఆందోళన కలిగించవలసిన విపరిణామం! దేశంలోని కనీసం మూడవ వంతు భూభాగం అడవులతో ఆకుపచ్చని అందాలతో, ప్రాకృతిక పరిమళాలతో పరిపుష్టం కావాలన్నది అంతర్జాతీయ ఆదర్శం! ఈ ఆదర్శం మనదేశంలో దశాబ్దులకు పూర్వమే వమ్మయిపోయింది. మొత్తం భూమిలో నాలుగవ వంతు కూడ అటవీ మయమయి లేదు.

07/07/2016 - 07:07

రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆఫ్రికా దేశాల్లో పర్యటించటం ఇదే మొదటిసారి. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మోదీ తన విదేశాంగ విధానాన్ని వ్యూహాత్మకంగా అమలు పరుస్తూ వచ్చారు. ప్రమాణస్వీకారానికి సార్క్ సభ్యదేశాధినేతలందరినీ ఆహ్వానించటంతో ప్రారంభమైన మోదీ ప్రస్థానం వివిధ దేశాల్లో ఒకదాని వెంట ఒకటిగా చేసిన పర్యటనలు సత్ఫలితాలనే ఇచ్చాయి.

07/06/2016 - 01:07

ఆశయంతో కార్యాచరణ పోటీ పడింది. సాధించాల్సిన లక్ష్యానికి లంగరేసే రీతిలోనే ప్రధాని మోదీ రెండో మంత్రివర్గ విస్తరణ సాగింది. కుల, మత ప్రాంతాల అనివార్యతలకూ అనేక కోణాల్లో అద్దంపట్టింది. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికలను పరిగణనలోకి తీసుకునే కొత్త మంత్రులను మోదీ ఎంపిక చేసుకున్నారని చెప్పాలి. మంత్రివర్గ సహచరులను ఎంచుకోవడంలో ప్రధాని భారీ కసరత్తే చేశారు.

07/05/2016 - 04:37

వర్షాలు రాలేదన్న ఆందోళన ఎంత తీవ్రంగా యావద్భారతాన్ని కుదిపేస్తుందో..తీరా వర్షాలు పడితే దాని బీభత్సం కూడా అంతగానూ కకావికలం చేస్తుంది. చినుకు పడితే చాలు చిత్తడైపోయే రాష్ట్రాల్లో ప్రథమస్థానం ఉత్తరాఖండ్‌ది. ఇప్పుడా చిరు రాష్ట్రం తల్లడిల్లిపోతోంది. వర్షాలు లేక కాదు, కురిసిన వాన కుంభవృష్టిని తలపించడం వల్ల..

07/04/2016 - 04:40

అంతర్జాతీయ ఉగ్రవాదం వెర్రితలలు వేస్తోంది. ఓర్లాండో, ప్యారిస్ నుంచి ఇస్తాంబుల్, ఢాకా వరకూ ఏ నగరానికీ నిర్భయంగా మనుగడ సాగించగలిగే పరిస్థితులు కనుమరుగే! ఎప్పుడు ఏ ప్రాంతంలో, ఏ పట్టణంపై, ఎలాంటి నగరంపై ఉగ్రవాదులు విరుచుకు పడతారో తెలియని పరిస్థితి మరింతగా కలవర పెట్టేదే..నిన్న అల్ ఖైదా, నేడు ఐసిస్..పేరేదైనా వాటి వాదం ఉగ్రవాదం. అరాచక వాదం. శాంతిని కబళించి మానవత్వానికి పాతరేసే అమానుష, అనాగరిక విధానం.

07/02/2016 - 02:41

ఎట్టకేలకు ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుకు మార్గం సుగమమైంది. గత కొన్ని నెలలుగా ఎడతెగని వివాదాలకు, ఉత్కంఠకు దారితీసిన జీతాల పెంపు వ్యవహారం ఓ కొలిక్కి రావడం ఆనందకరమైనదే అయినప్పటికీ దీని పర్యవసానాలను, ఆర్థిక వ్యవస్థపై దీని వల్ల పడే భారాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాదాపు లక్ష కోట్ల రూపాయలకు వేతన సంఘం సిఫార్సుల అమలు వల్ల ఖజానాపై భారం పడుతుంది.

Pages