S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంపాదకీయం
రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికరణం రద్దయిపోవడం జమ్మూ కశ్మీర్ సమగ్రతా సాధనకు శ్రీకారం మాత్రమే. భౌగోళిక సర్వసమగ్రతా సాకారం ఇంకా సిద్ధించవలసి ఉంది. అఖండ భారత్ ముక్కలు చెక్కలు కావడం, భారత్లో అవిభాజ్యమైన జమ్మూ కశ్మీర్ ముక్కలు చెక్కలు కావడం సమాంతర పరిణామాలు. ఈ ఉభయ విపరిణామాలకు ప్రధాన కారకుడు 1946 నుంచి 1964 వరకు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ ‘అధి నాయకుడు’ జవహర్లాల్ నెహ్రూ.
విజయం ఇది, కశ్మీరీ
జాగృత జన మనోరథం,
విజయం ఇది, మాతృదేశ
భక్తికి మంగళ శిఖరం,
విజయం ఇది, మహోదధీ
మథన జనిత మధుకలశం,
భరత మాతృ నయనాంచల
స్ఫురిత హర్షవర్ష జలం....
బీభత్సకాండను నియంత్రించడానికి, నిరోధించడానికి, నిర్మూలించడానికి ప్రభుత్వం సాగిస్తున్న భద్రతాప్రస్థానంలో ఇది మరో ముందడుగు, ఉగ్రమూకల పాలిట ‘పిడుగు’.. వివిధ రకాల బీభత్సకాండను కొనసాగిస్తున్న హంతకులను వ్యక్తిగత స్థాయిలో ‘బీభత్సకారుడు’గా నిర్ధారించడానికి శుక్రవారం రాజ్యసభ ఆమోదించిన ‘బిల్లు’ వీలు కల్పిస్తుండడం ఈ ముందడుగు.
వేనకువేల పూజతలు వేకువతో వికసించె చూడుమీ రాగిణి!
నేల పాలగుచు రాలెడి ఇంకొక వేయి పూలు..
భారత జాతీయ జీవన ప్రస్థానంలో ఇది మంచి వైపు మలుపు. ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థకు మరో గెలుపు. మహిళా సాధికార సూత్రం మరింత బలపడింది, వివాహిత ముస్లిం మహిళల జీవన భద్రత మరింత పటిష్ఠమైంది. ముమ్మారు ‘తలాక్’ను ఎలాపడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చెప్పడం- అన్న ‘రుగ్మత’ ఇకపై నేరం. ఈ నేరానికి పాలుపడే ఇస్లాం మతస్థులైన పురుషులు శిక్షను అనుభవించవలసి ఉంటుంది.
విద్యార్థులు సౌశీల్యవంతులా? కాదా? అన్నది వౌలికమైన మహా విషయం. పరీక్షల ద్వారా విద్యార్థుల నిజాయితీని, సత్యనిష్ఠను, నియమ నిబద్ధతను సౌశీల్యాన్ని నిగ్గుతేల్చడానికి రాజస్థాన్ ప్రభుత్వం నడుం బిగించడం మరో బౌద్ధిక విప్లవం. అధ్యాపకుల పర్యవేక్షణ కాని ‘నిఘా’కాని లేకుండా రాజస్థాన్లోని రెండువందల ముప్పయి ఏడు ప్రభుత్వ కళాశాలలలో ఇరవై తొమ్మిదవ తేదీన పరీక్షలను నిర్వహించారట.
నాలుగేళ్లలో దేశంలోని పులుల సంఖ్య ముప్పయి మూడు శాతం పెరగడం మనకు గర్వకారణమన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం చెప్పిన మాట. తొమ్మిది ఏళ్లలో దేశంలోని పులుల సంఖ్య రెట్టింపు కావడం ‘పర్యావరణ పరిరక్షణ’కు దోహదం చేస్తున్న మరో అద్భుతం. అటవీ పరిరక్షణ, అటవీ విస్తరణ కేవలం వృక్షజాలంతో ముడివడి ఉన్నదని భావించడం ప్రాకృతిక వాస్తవానికి విరుద్ధం. అడవి అంటే కేవలం వృక్షజాలం కాదు. అడవి జీవజాలం!
మనకు దాపురించి ఉన్న చైనా బెడద గురించి పదే పదే చర్చలు విశేషణలు జరుగుతుండడం అంతర్జాతీయంగా ప్రచారం అవుతున్న వ్యవహారం. మన దేశంలోకంటె ఇతర దేశాలలో ఈ చర్చకు ప్రాధాన్యం ఎక్కువగా ఉండడం మన దేశంలో ప్రచారం కాని వ్యవహారం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా సైనిక వ్యూహ విస్తరణ గురించి ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతోంది.
సరిహద్దుల రేఖ దాటి
దురాక్రమణ దూకువేళ,
‘కార్గిల్’ కంఠం చుట్టూ
ఉరి బిగించి ఉన్నవేళ..
నిగమాగమ స్వర విపంచి
నిప్పుల రాగం పలికెను,
వరములిచ్చు కరములందు
శత శతఘ్ని చెలరేగెను..
తథాకథిత- సోకాల్డ్- కశ్మీర్ సమస్య పరిష్కారానికి వీలుగా మన దేశానికీ పాకిస్తాన్కూ మధ్య ‘పంచాయతీ’ చేయడానికి అమెరికా అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న డొనాల్డ్ ట్రంప్ అనే దురహంకారి ఉవ్విళ్లూరుతుండడం దశాబ్దుల వ్యూహాత్మక దురాక్రమణ ప్రృవత్తికి అనుగుణం.. శతాబ్దుల తరబడి ఇతర దేశాలను దోపిడీ చేసి, ఆ అక్రమ ఆర్జనతో తెగబలిసిన ఐరోపా జాతులు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకొనడం ఈ ప్రవృత్తి.