S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

09/05/2016 - 04:55

భూమి విస్తీర్ణం పెరగదన్నది జనమెరిగిన వాస్తవం. జనం పెరుగుతున్న కొద్దీ దేశంలో కాని ప్రపంచంలో కాని జనాభాలోని ఒక్కొక్క వ్యక్తికి లభిస్తున్న సగటు భూమి వాటా తగ్గిపోతోంది. అంతేకాదు, ప్రతి చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభా సాంద్రత పెరిగిపోతోంది.

09/03/2016 - 07:12

ప్రచ్ఛన్న జిహాదీ ఉగ్రవాది ఝకీర్ నాయక్ అనే వాడికి ‘‘సహాయం చేసిన’’ నలుగురు ఉన్నత అధికారులను కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో అధికార యంత్రాంగాన్ని ఆవహించిన ఘోరమైన నిర్లక్ష్య ధోరణులు మరోసారి రచ్చకెక్కాయి. ఈ నలుగురు అధికారులు దుర్భుద్ధి పూర్వకంగానే ఝకీర్ నాయక్‌కు సంబంధించిన ‘స్వచ్ఛంద సంస్థ’-ఎన్‌జిఒ-కు సహకరించారని దేశ వ్యవహారాల మం త్రిత్వశాఖ వారు భావిస్తున్నారట.

09/01/2016 - 23:41

పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్ ప్రాంతంలో సేకరించిన భూమిని తిరిగి యజమానులకు అప్పగించాలని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం చెప్పిన తీర్పు వ్యవసాయానికి లభించిన చారిత్రక విజయం. హరిత శోభకు ప్రతీక అయిన వ్యవసాయానికి, హరిత హననానికి దోహదం చేస్తున్న అక్రమ పారిశ్రామిక విస్తరణకు దేశమంతటా కొనసాగుతున్న పోరాటాల గతిని ప్రభావితం చేయగల ఈ సర్వోన్నత సంచలన న్యాయ నిర్ణయం అధికాధిక ప్రజలకు హర్షం కలిగిస్తున్న పరిణామం.

09/01/2016 - 00:18

మన దేశానికి అమెరికాకు మధ్య రక్షణ రంగంలో సహకారం పెరుగుతుండడం అనివార్యమైన ద్వైపాక్షిక పరిణామం! ఉభయ దేశాల మధ్య మంగళవారం ఢిల్లీలో కుదిరిన ఒప్పందం ఈ అనివార్య పరిణామ క్రమానికి మరో ధ్రువీకరణ మాత్రమే. సైనిక సిబ్బంది ఉపకరణాల తరలింపు సదుపాయాల పరస్పర వినిమయ అంగీకార పత్రం-ఎల్‌ఇఎమ్‌ఓఏ-పేరుతో కుదిరిన ఈ ఒప్పందం ఉభయ దేశాలనూ వ్యూహాత్మకంగా మరింత సన్నిహితం చేసింది.

08/31/2016 - 00:09

పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్-పిఓకె- నుంచి జమ్మూకశ్మీర్‌లోకి పారిపోయి వచ్చిన శరణార్థుల పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం రెండువేల కోట్ల రూపాయల పథకాన్ని రూపొందించిందట. 1947లో పాకిస్తాన్ మనదేశంపై దాడి చేసిన సందర్భంగా ప్రాణాలు కోల్పోకుండా బతికి బట్టకట్టిన వారు ఈ శరణార్థులు. 1948 తరువాత పాకిస్తాన్ అక్రమ ఆధీనంలో మిగిలిఉన్న కశ్మీర్‌లో మూడు ప్రపధాన కేంద్రాలున్నా యి.

08/30/2016 - 00:02

కాలుష్య భారత్‌ను స్వచ్ఛ భారత్‌గా పునర్ నిర్మించడానికి ప్రధాని నరేంద్ర మోదీ పడుతున్న ఆరాటం మరోసారి ఆవిష్కృతమైంది. ఆదివారం తన మనసులోని మాటల-మన్‌కీ బాత్-ను దేశప్రజలకు వెల్లడించిన మోదీ పర్యావరణ పరిశుభ్రతను పరిరక్షించవలసిన బాధ్యతను మరోసారి గుర్తు చేశారు.

08/29/2016 - 00:34

చైనాలో రాజకీయ, అధికార అవినీతికి వ్యతిరేకంగా భారీ ఎత్తున చర్యలు కొనసాగుతున్నాయన్నది ఇటీవల ప్రముఖంగా ప్రచారవౌతున్న సమాచారం. అవినీతి దశాబ్దులపాటు విస్తరించిపోయిందని వ్యవస్థీకృతమయిందని దీనివల్ల ధ్రువపడిన సంగతి మాత్రం చైనా ప్రభుత్వం వారు, దేశ విదేశాలలోని చైనా ప్రశంసకులు దాటవేస్తున్నారు. ఈ ప్రశంసకులు, చైనా ప్రగతిని అనుకరించాలని ప్రచారం చేస్తున్నవారు మన దేశంలో సైతం దండిగా ఉన్నారు.

08/27/2016 - 07:20

విభిన్న స్వరాలు వైరుధ్య భావాలను వినిపిస్తుండడం దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జమ్మూకశ్మీర్‌లో జరిపిన రెండు రోజుల పర్యటన నేపథ్యం. తథాకథిత-సోకాల్డ్- సమస్య గురించి సమస్యను పరిష్కరించడానికి వీలైన ఊహాత్మక ప్రత్యామ్నాయాల గురించి దేశ ప్రజలకు, దేశ వ్యతిరేకులకు మధ్య వైరుధ్యాలు నెలకొని ఉన్నాయి. ఈ దేశ వ్యతిరేకులు జిహాదీ బీభత్సకారులు, పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న ఉగ్రమృగాలు.

08/25/2016 - 23:55

మన భద్రతా కుడ్యంలో కనిపించిన మరో కన్నం ఇది. క న్నం ఇప్పుడు కనిపించింది కాని రంధ్రాన్ని ఏళ్లక్రితమే ఏర్పాటుచేసారు. ఏర్పాటు చేసిన వారు మన దేశంవారు కాదన్న ది మన నౌకాదళం వారు చేసిన మహా నిర్ధారణ. విదేశీయులు ఈ మన భద్రత గోడను తవ్వి రంధ్రం ఏర్పాటు చేశారట! ఈ రం ధ్రం చిన్నది కాదు, ఇరవై రెండు వేల నాలుగు వందల పేజీల రక్ష ణ రహస్యాలను విదేశీయులు మోసుకెళ్లగలిగినంత పెద్దది.

08/24/2016 - 23:53

దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో నివసిస్తున్నాడన్న వాస్తవాన్ని ఐక్యరాజ్యసమితి కూడ నిర్ధారించడం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనదేశం జరుపుతున్న పోరాటానికి బలం చేకూర్చిన పరిణామం. ఈ వాస్తవాన్ని మన ప్రభుత్వం 1993నుంచీ పదే పదే చెబుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం పదే పదే నిరాకరిస్తోంది.

Pages