-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: హైదరాబాద్ విద్యార్థికి కరాటే పోటీల్లో జాతీయ స్థాయిలో రజత పతకం లభించింది. ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జూనియర్, 30 కేజీల విభాగంలో 11 ఏళ్ల డి.దుర్గాసాయి తనిష్క రజత పతకం సాధించాడు. హైదరాబాద్ బర్కత్పురాలోని శ్రీ చైతన్య స్కూల్లో 7వ తరగతి చదువుతున్న సాయి తనిష్క, కోచ్ కీర్తన్ కోండ్రు నేతృత్వంలో శిక్షణ పొందాడు.
ముంబయి, ఏప్రిల్ 23: ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచ్లలో కేవలం ఒకదాన్లో విజయం సాధించి, మిగిలిన మ్యాచ్లలో ఓటమిపాలైన ముంబయి ఇండియన్స్ స్వంత గడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్లో మంగళవారం జరిగే మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని ఆరాటపడుతోంది. ముంబయి టీమ్ ఒకే ఒక మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 23: మోచేతి గాయంతో గత కొన్ని రోజుల నుండి ఐపీఎల్ మ్యాచ్లకు దూరంగా ఉన్న టీమిండియా క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్మన్ శిఖర్ ధావన్ త్వరలో మైదానంలో అడుగుపెట్టనున్నట్లు స్పష్టం చేశాడు. కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ధావన్ గాయంతో రిటైర్డ్ హట్గా పెవిలియన్ పట్టిన సంగతి తెలిసిందే.
బ్యాంకాక్, ఏప్రిల్ 23: అర్జెంటీనాలో జరుగుతున్న యూత్ ఒలింపిక్ గేమ్స్లో ఐదుగురు మహిళా బాక్సర్లు క్వాలిఫై అయ్యారు. వీరిలో అనామిక 51 కేజీల విభాగం, ఆస్తా పహ్వా 75 కేజీల విభాగంలో ఆసియా చాంపియన్లుగా పోటీపడేందుకు సెమీఫైనల్కు చేరుకున్నారు. మిగిలిన భారత మహిళా బాక్సర్లు 51 కేజీలు, 57 కేజీలు, 75 కేజీలు, 60 కేజీల విభాగంలో పోటీని ఎదుర్కోనున్నారు.
జోహానె్సస్బర్గ్, ఏప్రిల్ 23: ఈ ఏడాది, వచ్చే ఏడాది వేసవి సీజన్లో పాకిస్తాన్, శ్రీలంక దేశాలతో ఐదు టెస్టు టెస్టు మ్యాచ్లు ఆడాలని దక్షిణాఫ్రికా నిర్ణయించింది. ఇందులో మూడు మ్యాచ్లు పాక్తో, రెండు శ్రీలంకతో జరుగనున్నాయని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది.
జైపూర్, ఏప్రిల్ 23: రాజస్తాన్లోని జైపూర్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో 11 బంతుల్లో 33 పరుగులతో చెలరేగి ఆడి రాజస్థాన్ విజయానికి ప్రధాన కారకుడుగా నిలిచిన కృష్ణప్ప గౌతంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 29 ఏళ్ల గౌతం ఆటతీరును మెచ్చుకున్న అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. జైపూర్లో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టును రాజస్థాన్ ఓడించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 23: హైదరాబాద్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తల్లి కాబోతున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించింది. తమ జీవితంలోకి ఓ బేబీ రాబోతున్నట్లు పేర్కొంది. సానియా 2010లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
బెంగళూరు, ఏప్రిల్ 23: కన్నడ నటి తనిష్కా కపూర్, తాను మంచి స్నేహితులమని, తమ పెళ్లి జరుగుతున్నట్లు వస్తున్న వార్తలు అసత్యమని టీమిండియా యువ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ స్పష్టం చేశాడు. తనిష్కాతో తన పెళ్లి అని ప్రచారమవుతున్న కథనాలపై యువ క్రికెటర్ స్పందించాడు.
భారత ప్రజలు క్రికెట్ దేవుడిగా ఆరాధించే సచిన్ టెండూల్కర్ మంగళవారం 44వ ఏట అడుగుపెడుతున్నారు. సోమవారం ముంబయలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సతీసమేతంగా వచ్చిన సచిన్ను ఆశ్చర్యానికి గురిచేస్తూ నిర్వాహకులు పుట్టిన రోజు కేక్ను అమర్చి కట్ చేయంచారు. కేకును చూసి కళ్లెగరేస్తున్న సచిన్
ఢాకా : మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఢాకా ప్రిమియర్ లీగ్లో ఆడే క్రికెటర్ నజ్రీన్ ఖాన్ ముక్తా ఆదివారం కాక్స్ బజార్ సిటీలో ఓ మ్యాచ్ ఆడి జట్టు సభ్యులతో బస్సులో తిరిగివస్తోంది.