S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/12/2018 - 07:06

అలోర్ సెటార్ (ఇండోనేషియా), ఫిబ్రవరి 11: ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్స్ పురుషుల విభాగంలో ఇండోనేషియా, మహిళల విభాగంలో జపాన్ టైటిళ్లను దక్కించుకున్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ చైనానే రన్నరప్‌గా నిలిచింది. పురుషుల ఫైనల్‌లో ఇండోనేషియా 3-1 తేడాతో చైనాపై విజయం సాధించింది. మొదటి సింగిల్స్ మ్యాచ్‌లో జొనథాన్ క్రిస్టీ 16-21, 21-17, 21-18 తేడాతో షి యుకీని ఓడించి, ఇండోనేషియాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.

02/12/2018 - 07:05

పయాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా), ఫిబ్రవరి 11: ఈసారి వింటర్ ఒలింపిక్స్‌లో టీనేజర్ రెడ్ గెరార్డ్ అమెరికాకు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. 17 ఏళ్ల ఈ యువకుడు పురుషుల స్నోబోర్డింగ్ స్లోప్ స్టయిల్ విభాగంలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించి 87.16 పాయింట్లు సంపాదించి, టైటిల్ సాధించాడు.

02/11/2018 - 01:51

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 10: ఈసారి వింటర్ ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణ పతకం స్వీడన్‌కు చెందిన చార్లొట్ కల్లాకు లభించింది. మహిళల 7.5+7.5 కిలోమీటర్ల స్కియాథ్లాన్ క్రాస్ కంట్రీ ఈవెంట్‌లో ఆమె విజేతగా నిలిచింది. నార్వే స్కీయర్ మారిట్ జోర్గెన్ రజత పతకంతో సంతృప్తి చెందడం గమనార్హం. 11 వింటర్ ఒలింపిక్ పతకాలు సాధించి, మరోసారి సత్తా చాటుదామనుకున్న జోర్గెన్‌కు కల్లా షాకిచ్చింది.

02/11/2018 - 01:50

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 10: ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు ద్వైపాక్షిక చర్చలకు వింటర్ ఒలింపిక్స్‌ను వేదికగా ఎంచుకున్నట్టు కనిపిస్తున్నది. ఈ పోటీలను తిలకించడానికి వచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ చాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్, బృందానికి నాయకత్వం వహించిన కిమ్ యాంగ్ నమ్‌తో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జయే ఇన్ చర్చలు జరిపాడు.

02/11/2018 - 01:48

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 10: వింటర్ ఒలింపిక్స్‌లో శనివారం మహిళల ఐస్ హాకీ ఆసక్తి రేపింది. ఈ విభాగంలో ఉభయ కొరియా దేశాలు ఒకే జట్టుగా బరిలోకి దిగడమే అందుకు కారణం. ఈ సంయుక్త జట్టును ప్రేక్షకులు జేజేలు పలికారు. ఆ జట్టు సభ్యులు రింక్‌లోకి వచ్చిన వెంటనే పెద్దఎత్తున హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.

02/11/2018 - 01:47

పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 10: వింటర్ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే చోట కనిపించడంతో ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలతో నోళ్లు తెరిచారు. ఇంతకీ వీరు అసలైన నేతలుకారని, వారి డూప్‌లు అని తెలుసుకొని నవ్వుకున్నారు. రంగస్థలంపై హోవర్డ్ ఎక్స్ అని పేరుపెట్టుకున్న నటుడు అచ్చుగుద్దినట్టు కిమ్‌ను పోలి ఉంటాడు.

02/11/2018 - 01:44

పోచెస్ట్రూమ్, ఫిబ్రవరి 10: భారత్, దక్షిణాఫ్రికా మహిళా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ శనివారం ముగిసింది. మొదటిమూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు గెల్చుకొని, సిరీస్‌ను సొంతం చేసుకున్న మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టుకు క్లీన్‌స్వీప్ దక్కలేదు. చివరిదైన మూడో వనే్డలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.

02/11/2018 - 01:43

జొహానె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 10: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం నాటి నాలుగో వనే్డని వర్షం వెంటాడుతున్నది. భారత్ ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు ఒకసారి ఆటకు అంతరాయం కల గ్గా, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఉరుములు, మెరుపు లు, వర్షం జల్లు కారణంగా మరోసారి ఆట నిలిచింది. 290 పరు గుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 7.2 ఓవ ర్లలో ఒక వికెట్ కోల్పోయ 43 పరుగులు చేసింది.

02/11/2018 - 01:43

యాష్‌విల్లి, ఫిబ్రవరి 10: గడిచిన ఏడాది పాల్గొన్న వివిధ టోర్నీలలో ఎదురైన చేదు అనుభవాలు, ఒడిదుడుకుల నేపథ్యంలో మళ్లీ ఇపుడు ఆటపై దృష్టి సారించి బరిలోకి దిగనున్నానని ప్రఖ్యాత టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తెలిపింది. నార్త్ కరోలినాలో యాష్‌వెల్లిలో త్వరలో నిర్వహించే ఫెడ్ కప్ ద్వారా మళ్లీ తన ఉనికిని చాటుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది.

02/11/2018 - 01:40

ఢాకా, ఫిబ్రవరి 10: శ్రీలంకతో జరిగిన చివరి, రెండో టెస్టులో బంగ్లాదేశ్ చిత్తయింది. భారీ స్కోర్లు నమోదైన మొదటి టెస్టు డ్రాకాగా, రెండో టెస్టులో శ్రీలంక మొదటి నుంచి చివరి వరకూ ఆధిపత్యాన్ని కొనసాగించి, 215 పరుగుల భారీ తేడాతో విజయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 65.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (68), రోషన్ సిల్వ (56) అర్ధ శతకాలతో రాణించారు.

Pages