-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూకాజిల్, డిసెంబర్ 28: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మాంచెస్టర్ సిటీ జట్టు దూకుడును కొనసాగిస్తున్నది. రహీం స్టెర్లింగ్ సూపర్ గోల్తో రాణించడంతో, న్యూకాజిల్ జట్టుపై 1-0 తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో సిటీకి ఇది వరుసగా 18వ విజయం కావడం విశేషం. తన సమీప ప్రత్యర్థి మాంచెస్టర్ యునైటెడ్ కంటే 15 పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది.
వెల్లింగ్టన్, డిసెంబర్ 28: న్యూజిలాండ్లో పర్యటిస్తున్న వెస్టిండీస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆల్రౌండర్ కీరన్ పోలార్డ్ టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్కు అందుబాటులో లేకపోవడం విండీస్కు ఆందోళనకు గురి చేస్తున్నది. ఇప్పటికే రాన్స్ఫోర్డ్ బీటన్ గాయం కారణంగా వైదొలగ్గా, పొలార్డ్ వ్యక్తిగత కారణాల వల్ల టీ-20 సిరీస్లో ఆడడం లేదని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) ప్రకటించింది.
ముంబయి, డిసెంబర్ 27: ముంబయి మహానగరం సెయింట్ రెగిస్ హోటల్లో మంగళవారం రాత్రి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు ఇచ్చిన విందుకు చాలా మంది ప్రముఖులు హాజరైనప్పటికీ, మాజీ స్పిన్నర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే రావడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. భార్య చేతనతో కలిసి కోహ్లీ దంపతుల విందుకు వెళ్లిన ఫొటోను కుంబ్లే ట్వీట్ చేశాడు.
ముంబయి, డిసెంబర్ 27: తన దృష్టిలో క్రికెట్ సిరీస్ కంటే పెళ్లే చాలా ముఖ్యమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత, వనే్డ, టీ-20 ఇంటర్నేషనల్స్ సిరీస్ల నుంచి కోహ్లీ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 11న అతను తన చిరకాల స్నేహితురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మను ఇటలీలో వివాహం చేసుకున్నాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత, మొదట న్యూఢిల్లీలో విందునిచ్చాడు.
ముంబయి, డిసెంబర్ 27: వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హార్దిక్ పాండ్య ఏ విధంగా ఎదిగాడో, అతనిని ఆదర్శంగా తీసుకొని యువ క్రికెటర్లు కూడా తాము అనుకున్న లక్ష్యాలను చేరాలని భారత మాజీ క్రికెటర్, అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు.
పోర్ట్ ఎలిజబెత్, డిసెంబర్ 27: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక డే/నైట్ టెస్టుపై దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. ఈ జట్టు మొదటి ఇన్నింగ్స్ను 78.3 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 309 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసింది. అయిదన్ మర్క్రామ్ 204 బంతులు ఎదుర్కొని, 14 ఫోర్లు, రెండు సిక్సర్లతో 125 పరుగులు చేయగా, ఏబీ డివిలియర్స్ 53, టెంబా బవూమా 44 పరుగులతో రాణించారు.
మెల్బోర్న్, డిసెంబర్ 27: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ను ఇప్పటికే 0-3 తేడాతో కోల్పోయినప్పటికీ, చివరి రెండు మ్యాచ్ల్లో గెలిచి, పరువు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో ఎదురుదాడికి దిగింది. మాజీ కెప్టెన్ అలస్టర్ కుక్ అజేయ శతకాన్ని నమోదు చేయడంతో, రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 192 పరుగులు సాధించగలిగింది.
మెల్బోర్న్, డిసెంబర్ 27: ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు హూ జాక్మన్ కొత్త అవతారంలో కనిపించి, అందరినీ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు సందర్భంగా జాక్మన్ కొద్దిసేపు కామెంటరీ చెప్పి అభిమానులను అలరించారు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టమున్న జాక్మన్కు యాషెస్ సిరీస్ అంటే ఇంకా ఇష్టం. 2010 యాషెస్లో తను ఒక ఓవర్ బ్యాటింగ్ చేశాడు.
ముంబయి, డిసెంబర్ 27: భారత క్రికెటర్లు విందుల్లో తీరికలేకుండా ఉన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ముంబయిలో ఇచ్చిన విందుకు చాలా మంది క్రికెటర్లు హాజరయ్యారు. భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య సోదరుడు, ఫస్ట్క్లాస్ క్రికెటర్ కృణాల్ పాండ్య మెహిందీ కూడా అట్టహాసంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు పంఖురీ శర్మతో కృణాల్ వివాహం మరో అట్రాక్షన్గా మారింది.
ముత్తుకూరు, డిసెంబర్ 27: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో బుధవారం తెలంగాణ డీజీపీ కృష్ణప్రసాద్ (రైల్వే అండ్ రోడ్స్ భద్రతా విభాగం అధికారి) ముఖ్య అతిథిగా విచ్చేసి సెయలింగ్ పోటీలను ప్రారంభించారు. బుధవారం ఓడరేవులో జరిగిన అంతర్జాతీయ సెయలింగ్ పోటీలను కృష్ణప్రసాద్, పోర్టు సీఈఓ అనిల్ యండ్లూరి జెండా ఊపి ప్రారంభించారు.