-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఢిల్లీ వనే్డ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్పై వేటు పడింది. అతనిని కెప్టెన్సీ నుంచి తొలగించిన ఢిల్లీ సెలక్షన్ కమిటీ ఆ స్థానాన్ని యువ వికెట్కీపర్-బ్యాట్స్మన్ రిషభ్ పంత్కు అప్పగించింది. కమిటీ చైర్మన్, మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ స్వయంగా గంభీర్కు ఈ మార్పు గురించి తెలియచేసినట్టు సమాచారం.
హైదరాబాద్, ఫిబ్రవరి 9: ఓపెనర్ మురళీ విజయ్ విజృంభణ కొనసాగితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో, బంగ్లాదేశ్తో గురువారం మొదలైన ఏకైక టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్లకు 356 పరుగులు సాధించి, భారీ స్కోరు దిశగా సాగుతున్నది. ఓపెనర్ విజయ్ కెరీర్లో తొమ్మిదో టెస్టు సెంచరీని సాధిస్తే, 15వ టెస్టు శతకాన్ని పూర్తి చేసిన కోహ్లీ నాటౌట్గా ఉన్నాడు.
హైదరాబాద్: చటేశ్వర్ పుజారా ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 83 పరుగులు చేశాడు. ఈ ఫస్ట్క్లాస్ సీజన్లో అతను మొత్తం 1,605 పరుగులు పరుగులు చేసి, 1964-65 సీజన్లో చందూ బోర్డే 1,604 పరుగులతో నెలకొల్పిన రికార్డును బద్దలు చేశాడు. బోర్డే 28 ఇన్నింగ్స్లో ఈ స్కోరును చేస్తే, పుజారా 21 ఇన్నింగ్స్లోనే అతనిని అధిగమించాడు.
కరాచీ, ఫిబ్రవరి 9: పాకిస్తాన్ వనే్డ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి అజర్ అలీ వైదొలిగాడు. కాగా, అతని స్థానంలో సర్ఫ్రాజ్ ఖాన్కు పగ్గాలు అప్ప గించినట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్య క్షుడు షహర్యార్ ఖాన్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా టూర్లో పాక్ వైఫల్యాల నేపథ్యంలో అజర్కు ఉ ద్వాసన పలకాలన్న డిమాండ్ పెరిగింది. దాదాపు గా ఈ విషయాన్ని షహర్యార్ ఖాన్ ఇది వరకే తెలి పాడు.
సిడ్నీ, ఫిబ్రవరి 9: ఆస్ట్రేలియా క్రికెటర్ నిక్ మాడిన్సన్కు కోపం వచ్చింది. కేవలం మూడు టెస్టుల్లో అవకాశం ఇచ్చిన తర్వాత ఆసీస్ క్రికెట్ జాతీయ సెలక్టర్లు అతనికి మొండి చేయి చూపించారు. దీనితో మనస్తాపం చెందిన 25 ఏళ్ల మాడిన్సన్ తాను కొంతకాలం క్రికెట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించాడు. అయితే, ఎంతకాలం విశ్రాంతి తీసుకుంటాడనే విషయంపై అతను స్పష్టత ఇవ్వలేదు.
సిడ్నీ, ఫిబ్రవరి 9: హార్డ్ హిట్టర్గా పేరు సంపాదించిన బిగ్ బాష్ లీగ్ (బిబిఎల్) టాప్ టాపర్ బెన్ డంక్కు ఆస్ట్రేలియా టి-20 జట్టులో చోటు దక్కింది. మరో పించ్ హిట్టర్ క్రిస్ లిన్ గాయం కారణంగా శ్రీలంకతో జరిగే టి-20 సిరీస్కు దూరమయ్యాడు. అతని స్థానంలో బెన్ డక్ను జట్టులోకి తీసుకున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ప్రకటించింది. ఈ ఏడాది తాను ఆడిన బిబిఎల్ మ్యాచ్ల్లో అతను 222 బంతులు ఎదుర్కొన్నాడు.
ముంబయి, ఫిబ్రవరి 8: ఇంగ్లాండ్, భారత్ అండర్-19 జట్ల మధ్య బుధవారం జరిగిన చివరి, ఐదో వనే్డ టైగా ముగిసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్, చివరి బంతిలో ఇషాన్ పొరెల్ అవుట్కావడంతో, విజయానికి అవసరమైన చివరి పరుగును సంపాదించడంలో విఫలమైన భారత్ మ్యాచ్ని టైగా ముగింది. అయితే, సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: బలమైన, బలహీనమైన జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు గురువారం నుంచి ఇక్కడి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆరంభం కానుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియా, తొమ్మిదో స్థానంలోని బంగ్లాదేశ్ మధ్య జరిగే టెస్టులో ఫలితం ఏ విధంగా ఉండబోతుందో ఎవరైనా సులభంగానే ఊహించుకోవచ్చు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ విజయం ఖాయంగా కనిపిస్తున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: రహానే సుమారు రెండేళ్ల కష్టాన్ని విస్మరించడం తప్పని, ఒకటిరెండు మ్యాచ్లను పరిగణలోకి తీసుకొని అతనిపై విమర్శలు చేయడం తగదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: టెస్టు ఫార్మాట్లో తమను తక్కువ చేస్తూ చూపించడం తప్పని, ఎక్కువ టెస్టులు ఆడితే తమ సత్తా ఏమిటో చూపిస్తామని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ రహీం వ్యాఖ్యానించాడు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరు సమావేశంలో అతను మాట్లాడుతూ తమతో ఏ జట్టూ తరచుగా టెస్టు సిరీస్లు ఆడడం లేదని, అంతేగాక ద్వైపాక్షిక టెస్టు సిరీస్లపై ఆసక్తి చూపడం లేదని అన్నాడు.