-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఫ్రెండ్స్ ఎలెవన్తో జరిగిన టి-20 మ్యాచ్లో కేవలం 72 బంతుల్లో 300 పరుగులు చేసిన మావి ఎలెవన్ వికెట్ కీపర్ మోహిత్ అల్వాత్కు ఐపిఎల్లో చోటు దక్కడం ఖాయంగా కని పిస్తున్నది. అతనిని జట్టులోకి తీసుకోవడానికి ఢిల్లీ డేర్డెవిల్స్ ముందు కొచ్చింది. ఈనెల నాలుగో తేదీన జరగాల్సిన ఐపిఎల్ వేలం 20వ తేదీకి వాయదా పడిన విషయం తెలిసిందే.
మెల్బోర్న్, ఫిబ్రవరి 8: టెస్టు క్రికెట్లో అసాధారణ ప్రతిభావంతుడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ను పేర్కొంటారు. సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, బ్రియాన్ లారా వంటి క్రికెటర్లు ఎన్ని రికార్డులు నెలకొల్పినా, టెస్టు క్రికెట్లో తిరుగులేని వీరుడిగా బ్రాడ్మన్కే అందరూ ముక్తకంఠంతో జేజేలు పలుకుతారు. కెరీర్లో 52 టెస్టులు (80 ఇన్నింగ్స్) ఆడిన అతను 6,996 పరుగులు చేశాడు.
కొలంబో, ఫిబ్రవరి 8: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్షిప్ క్వాలిఫయర్స్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో థాయిలాండ్ చిత్తుచిత్తుగా ఓడింది. భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్కు దిగిన థాయిలాండ్ 29.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ 12.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి విజయం సాధించింది.
దుబాయ్, ఫిబ్రవరి 7: హైదరాబాద్లో గురువారం నుంచి బంగ్లాదేశ్తో టెస్టు క్రికెట్ మ్యాచ్ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు అంతర్జాతీయ ర్యాంకింగ్స్ విషయంలో తన సహచర సభ్యుడు రవీంద్ర జడేజా నుంచి తీవ్రమైన పోటీ ఎదురుకానుంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 7: హైదరాబాద్ హైకోర్టు ఆదేశాలతో గురువారంనుంచి నగరంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే టెస్టు మ్యాచ్కి పరిశీలకుడిగా రత్నాకర్ శెట్టిని బిసిసిఐ మంగళవారం నియమించింది. ఈ మ్యాచ్ కోసం హైదరబాద్ క్రికెట్ సంఘం చేసే ఏర్పాట్లను పరిశీలించి, పర్యవేక్షించే బాధ్యతను బిసిసిఐ గేమ్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్ అయిన రత్నాకర్ శెట్టికి అప్పగించినట్లు బిసిసిఐ ఒక ప్రకటనలో తెలిపింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 7: సొంత గడ్డపై ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో సాధించిన విజయాల ఊపును అలాగే కొనసాగించాలని అనుకుంటున్నామని టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పష్టం చేశాడు. గురువారంనుంచి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరగనున్న టెస్టు సందర్భంగా మంగళవారం కుంబ్లే విలేఖరులతో మాట్లాడాడు. ‘ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కనబరిచిన ఊపును అలాగే కొనసాగించాలని మేము అనుకుంటున్నాం.
హైదరాబాద్, ఫిబ్రవరి 7: హైదరాబాద్లో ఈ నెల 9వ తేదీ నుంచి బంగ్లాదేశ్తో జరుగనున్న ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్కు టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా దూరమయ్యాడు. స్వదేశంలో ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల ట్వంటీ-20 సిరీస్ సందర్భంగా మోకాలికి గాయమైన అమిత్ మిశ్రా ఇంకా ఆ గాయం నుంచి కోలుకోలేకపోవడమే ఇందుకు కారణం.
అనంతపురం అర్బన్, ఫిబ్రవరి 7 : అంధుల టి-20 క్రికెట్ ప్రపంచ్ కప్ పోటీల్లో భాగంగా మంగళవారం అనంతపురంలోని అనంత క్రీడా గ్రామంలోని మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికా జట్టుపై 66 పరుగులతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన దక్షిణాప్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఆసియా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్స్లో సోమవారం తొలి రోజే టీమ్ స్ప్రింట్ ఈవెంట్లో భారత్కు కాంస్య పతకాన్ని అందించిన కేరళ బాలిక అలీనా రెజీ మంగళవారం మరో పతకాన్ని కైవసం చేసుకోవడంతో పాటు సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పి స్టార్ పెర్ఫార్మర్గా ఆవిర్భవించింది.
కొలంబో, ఫిబ్రవరి 7: శ్రీలంకలో ప్రారంభమైన మహిళల ప్రపంచ కప్ క్రికెట్ క్వాలిఫయర్స్లో భారత జట్టు అద్భుతమైన విజయంతో శుభారంభాన్ని సాధించింది. కొలంబోలోని పి.సరా స్టేడియంలో మంగళవారం గ్రూప్-ఏలో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు 114 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంక జట్టును మట్టికరిపించి సత్తా చాటుకుంది.