S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/08/2017 - 01:53

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: టెస్టుల్లో త్రిశతకం చేయడం ఎంతో కష్టమైన పని. వనే్డల్లో అయితే ద్విశతకం చేయడమంటే మాటలు కాదు.. ఇక టి-20 మ్యాచ్‌లలో సెంచరీ చేస్తే అద్భుతం అంటూ ఆకాశానికెత్తేస్తారు. అలాంటిది ఢిల్లీకి చెందిన ఓ కుర్రాడు టి-20 మ్యాచ్‌లో ఏకంగా 300 పరుగులు చేశాడు. ఢిల్లీలోని లలితా పార్కులో ఫ్రెండ్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం మావి ఎలెవన్, ఫ్రెండ్స్ ఎలెవన్ జట్ల మధ్య టి-20 మ్యాచ్ జరిగింది.

02/07/2017 - 01:03

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: వియత్నాంలో ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్న తొలి ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్స్ బాడ్మింటన్ పోటీల్లో పాల్గొనే భారత జట్టులో ‘తెలుగు తేజం’, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి.సింధుతో పాటు లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు చోటు కల్పించారు.

02/07/2017 - 01:02

లండన్, ఫిబ్రవరి 6: ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతలకు ఆలిస్టర్ కుక్ గుడ్‌బై చెప్పాడు. రికార్డు స్థాయిలో ఇంగ్లాండ్‌కు 59 టెస్టుల్లో సారథ్యం వహించిన తర్వాత అతను కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇది చాలా విచారకరమైన రోజని, అయినప్పటికీ ఈ నిర్ణయం వలన వ్యక్తిగతంగా తనతో పాటు జట్టుకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని అతను చెప్పాడు.

02/07/2017 - 01:04

హైదరాబాద్, ఫిబ్రవరి 6: భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును రెండు రోజుల సన్నాహక మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు గడగడలాడించింది. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ఆదివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల నష్టానికి 224 పరుగుల స్కోరు వద్ద బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-ఏ ఒక వికెట్ నష్టానికి 91 పరుగులు సాధించిన విషయం విదితమే.

02/07/2017 - 00:59

ముంబయి, ఫిబ్రవరి 6: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల అండర్-19 యూత్ ఇంటర్నేషనల్ వనే్డ క్రికెట్ సిరీస్‌లో భారత్ మరోమారు సత్తా చాటింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు 230 పరుగుల భారీ తేడాతో పర్యాటక జట్టును మట్టికరిపించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

02/07/2017 - 00:58

హైదరాబాద్, ఫిబ్రవరి 6: హైదరాబాదీ టెన్నిస్ తార సానియా మీర్జా మూడునుంచి ఎనిమిదేళ్ల మధ్య వయసుండే చిన్నరుల కోసం ఒక టెన్నిస్ అకాడమీని సోమవారం ప్రారంభించింది. ‘ఎస్‌ఎంటిఏ గ్రాస్‌రూట్ టెన్నిస్ అకాడమీ’ పేరుతో ప్రారంభించిన ఈ అకాడమీ ఆలోచన వాస్తవానికి తన తల్లి, స్నేసితుల ఆలోచన అని ఈ సందర్భంగా సానియా చెప్పింది.

02/07/2017 - 00:56

హైదరాబాద్, ఫిబ్రవరి 6: బంగ్లాదేశ్‌తో జరగబోయే ఒక టెస్టులో కూడా భారత జట్టు తన గెలుపు జోరును అలాగే కొనసాగించాలని అనుకుంటోందని జట్టు సభ్యుడు, బ్యాట్స్‌మన్ అయిన చతేశ్వర్ పుజారా చెప్పాడు. అయితే బంగ్లాదేశ్ జట్టును తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని కూడా ఆయన హెచ్చరించాడు.

02/07/2017 - 00:56

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: న్యూఢిల్లీలో జరుగుతున్న ఆసియా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ మహిళల టీమ్ స్ప్రింట్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుని తొలి రోజే ఖాతా తెరిచింది.

02/07/2017 - 00:55

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఓసం జరిగే ఆటగాళ్ల వేలంలో రూ.2 కోట్ల అత్యధిక బేస్ ధర కలిగిన ఏడుగురు ఆటగాళ్ల జాబితాలో మన దేశానికి ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ, ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఉన్నారు.

02/07/2017 - 00:54

హైదరాబాద్, ఫిబ్రవరి 6: టీమిండియాతో ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే బంగ్లాదేశ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌కి ముందు ఇక్కడ ఇండియా-ఏ జట్టుతో సోమవారం ముగిసిన రెండు రోజుల సన్నాహక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ ఇమ్రుల్ కరుూస్‌కు తొడ గాయం తిరగబెట్టడంతో అతను అసలు మ్యాచ్‌కు దూరమయ్యాడు.

Pages