S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/05/2017 - 03:40

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ‘క్రికెట్ బైబిల్’ విజ్‌డెన్ పత్రిక 2017 ఇయర్ బుక్‌పై అతని ఫొటో దర్శనం ఇవ్వనుంది. 2016లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించిన కోహ్లీ అన్ని ఫార్మాట్స్‌లో కలిపి మొత్తం 2,517 పరుగులు సాధించి, మిగతా ఆటగాళ్ల కంటే ముందున్నాడు. ఈ ఘనత వల్లే అతను ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో విడుదలయ్యే విజ్‌డెన్ ఇయర్ బుక్ కవర్ పేజీకి ఎంపికయ్యాడు.

02/05/2017 - 03:38

దుబాయ్, ఫిబ్రవరి 4: అత్యధిక ఆదాయ వనరులతో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి ఎదురుదెబ్బ తగిలినట్టు సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆదాయంలో సింహ భాగాన్ని తీసుకుంటున్న బిసిసిఐకు దిమ్మతిరిగేలా ఇక్కడి సమావేశంలో సభ్య దేశాలు తీర్మానాన్ని ఆమోదించినట్టు తెలుస్తున్నది.

02/05/2017 - 03:34

పుణే, ఫిబ్రవరి 4: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆసియా ఓషియానియా గ్రూప్ డేవిస్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం విష్ణు వర్ధన్‌తో కలిసి బరిలోకి దిగిన భారత వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌కు నిరాశే మిగిలింది. డేవిస్ పోటీల్లో ఇప్పటి వరకూ 42 డబుల్స్ మ్యాచ్‌లను గెలిచిన పేస్ మరో విజయాన్ని సాధిస్తే, అత్యధిక విజయాలను అందుకున్న ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించి ఉండేవాడు.

02/05/2017 - 03:32

హైదరాబాద్, ఫిబ్రవరి 4: బంగ్లాదేశ్‌తో ఆదివారం నుంచి ప్రారంభమయ్యే రెండు రోజుల వామప్ మ్యాచ్‌లో గట్టిపోటీనిచ్చేందుకు అభినవ్ ముకుంద్ నాయకత్వంలో భారత్ ‘ఎ’ జట్టు సిద్ధంగా ఉంది. గాయాల కారణంగా విశ్రాంతి తీసుకొని, ముస్తాక్ అలీ టోర్నీలో హర్యానా తరఫున ఆడిన జాతీయ జట్టు ఆటగాడు జయంత్ యాదవ్ ఫిట్నెస్‌కు ఈ మ్యాచ్ పరీక్షగా మారనుంది.

02/05/2017 - 03:31

అహ్మదాబాద్, ఫిబ్రవరి 4: అంధుల టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్ విజయపరంపరలను కొనసాగిస్తున్నది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ని తొమ్మిది వికెట్ల తేడాతో కైవసం చేసుకొని, తన ఆధిపత్యాన్ని నిరూపించింది. ప్రకాష్ (99 నాటౌట్), కేతన్ పటేల్ (56 నాటౌట్) భారత్‌కు తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించిపెట్టారు.

02/05/2017 - 03:30

మెల్బోర్న్‌లో శనివారం జరిగిన నైట్రో అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొన్న ‘జమైకా చిరుత’, స్ప్రింట్ వీరుడు
ఉసేన్ బోల్ట్. 4న100 మీటర్ల రిలేలో అల్ స్టార్స్ తరఫున పోటీపడిన బోల్ట్ తన జట్టును గెలిపించిన తర్వాత తనదైన విక్టరీ పోజుతో అభిమానులను అలరించాడు

02/05/2017 - 03:29

దుబాయ్, ఫిబ్రవరి 4: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) విజయవంతం కావడంతో చాలా దేశాలు అదే బాటలో నడుస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ దేశాలు ప్రీమియర్ లీగ్ టోర్నీలను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరింది.

02/04/2017 - 00:50

ముంబయి, ఫిబ్రవరి 3: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలం ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ముందుగా చేసిన ప్రకటనను అనుసరించి ఈ వేలం శనివారం జరగాల్సి ఉంది. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే తమతమ పదవుల నుంచి వైదొలగడంతో ఐపిఎల్ వేలం ప్రక్రియ వాయిదా పడింది.

02/04/2017 - 00:49

ముంబయి, ఫిబ్రవరి 3: అండర్-19 క్రికెట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మూడో వనే్డలోనూ ఇంగ్లాండ్‌ను ఓడించిన భారత్ 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. మొదటి మ్యాచ్‌లో నెగ్గిన ఇంగ్లాండ్‌ను ఆతర్వాత కట్టడి చేసిన భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయడం విశేషం. ఓపెనర్ శుభమ్ గిల్ అజేయ శతకంతో రాణించి, ఇంగ్లాండ్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో గెలవడంలో ప్రధాన భూమిక పోషించాడు.

02/04/2017 - 00:47

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: పేపర్‌పై చూస్తే పటిష్టంగానే కనిపిస్తున్నప్పటికీ, మైదానంలో పరిస్థితులు ఎటువైపు మొగ్గు చూపుతాయో ఊహించడం కష్టమని, నిజానికి పోటీల్లో సులభమైన మ్యాచ్‌లు అంటూ ఏవీ ఉండవని భారత ఫుట్‌బాల్ జాతీయ కోచ్ స్టెఫెన్ కాన్‌స్టాంటిన్ ఆటగాళ్లకు స్పష్టం చేశాడు.

Pages