-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కోల్కతా, జనవరి 22: వనే్డ సిరీస్లో వైట్వాష్ వేయించుకునే ప్రమాదం నుంచి ఇంగ్లాండ్ బయటపడింది. భారత్తో ఆదివారం జరిగిన చివరి, మూడో వనే్డను ఐదు పరుగుల తేడాతో గెల్చుకొని, పరువు నిలబెట్టుకుంది. 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి చివరి వరకూ పోరాడినప్పటికీ, ఐదు పరుగుల తేడాతో మ్యాచ్ని కోల్పోయినప్పటికీ, టీమిండియా ఈ సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
మెల్బోర్న్: కెరీర్లో 17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన వెటరన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ క్వార్టర్స్ చేరాడు. జపాన్ స్టార్ కెయ్ నిషికోరితో జరిగిన మారథాన్ మ్యాచ్లో అతను 6-7, 6-4, 6-1, 4-6, 6-3 తేడాతో విజయం సాధించాడు.
సానియా జోడీ ఓటమి
సిడ్నీ, జనవరి 22: ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో చెలరేగడంతో, పాకిస్తాన్తో ఆదివారం జరిగిన నాలుగో వనే్డను 86 పరుగుల తేడాతో గెల్చుకున్న ఆస్ట్రేలియా, ఐదు మ్యాచ్ల సిరీస్ను 3-1 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. దీనితో చివరిదైన ఐదో వనే్డ ఫలితం నామమాత్రమవుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 353 పరుగుల భారీ స్కోరు సాధించింది.
మెల్బోర్న్, జనవరి 22: నిన్న ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ నిష్క్రమించగా, ఈసారి టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న నంబర్ ర్యాంకర్ ఆండీ ముర్రే కూడా ఓటమిపాలై వెనుదిరిగాడు. అన్సీడెడ్ ఆటగాడు మిచా జ్వెరెవ్ 7-5, 5-7, 6-2, 6-4 తేడాతో ముర్రేపై సంచలన విజయాన్ని నమోదు చేశాడు.
మెల్బోర్న్, జనవరి 22: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్లో ఆదివారం రెండు అసాధారణ ఫలితాలు ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురి చేశాయి. పురుషుల సింగిల్స్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు ఆండీ ముర్రే ఓటమితో ఆశ్చర్యానికి గురైన టెన్నిస్ అభిమానులు మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ ఏంజెలిక్ కెర్బర్ నిష్క్రమణతో దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ముంబయి, జనవరి 22: రెస్ట్ఫా ఇండియాతో జరుగుతున్న ఇరానీ ట్రోఫీ మ్యాచ్లో రంజీ ట్రోఫీ చాంపియన్ గుజరాత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు సాధించిన ఈ జట్టు, ఆతర్వాత ప్రత్యర్థిని మొదటి ఇన్నింగ్స్లో 226 పరుగులకు కట్టడి చేసి, 132 పరుగుల కీలక ఆధిక్యాన్ని అందుకుంది.
కోల్కతా, జనవరి 21: ఇంగ్లాండ్పై వనే్డ సిరీస్లో క్లీన్స్వీప్ సాధించడమే భారత్ లక్ష్యంగా ఎంచుకుంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 0-4 తేడాతో గెల్చుకొని, మూడు మ్యాచ్ల వనే్డ సిరీస్ను ఇప్పటికే 0-2 ఆధిక్యంతో సొంతం చేసుకున్న టీమిండియా ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే చివరి, మూడో మ్యాచ్ని కూడా తన ఖాతాలో వేసుకొని, ప్రత్యర్థికి వైట్వాష్ వేయడమే లక్ష్యంగా ఎంచుకుంది.
మెల్బోర్న్, జనవరి 21: ఎంతో మంది సీడెడ్ క్రీడాకారిణులు పలు టోర్నీల్లో ఓడించిన ‘సీడ్ కిల్లర్’ ఎకతరీన మకరోవా మరోసారి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో ఆమె ఆరోసీడ్ డొమినికా సిబుల్కోవాను 6-2, 6-7, 6-3 తేడాతో ఓడించి, ప్రీ క్వార్టర్స్లోకి అడుగుపెట్టింది.
కోల్కతా, జనవరి 21: పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ నుంచి వైదొలగిన మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ కెప్టెన్ అవతారం ఎత్తాడు. ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ బిజీబిజీగా గడిపాడు. ఇంగ్లాండ్తో ఆదివారం నాటి చివరి వనే్డకు సిద్ధమవుతున్న టీమిండియా శనివారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ఇది ఐచ్ఛికం కావడంతో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరుకాలేదు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 102.5 ఓవర్లలో 358 ఆలౌట్ (ప్రియాంక్ పాంచాల్ 30, ధ్రువ్ రావల్ 39, మన్ప్రీత్ జునేజా 47, చిరాగ్ గాంధీ 169, సిద్ధార్థ్ కౌల్ 5/86, పంకజ్ సింగ్ 4/104).
రెస్ట్ఫా ఇండియా తొలి ఇన్నింగ్స్: 72 ఓవర్లలో 9 వికెట్లకు 206 (అఖిల్ హెర్వాద్కర్ 48, చటేశ్వర్ పుజారా 86, కరుణ్ నాయర్ 28, చింతన్ గజా 4/46, హార్దిక్ పటేల్ 3/73, మోహిత్ థడానీ 2/48).