-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
క్రైస్ట్చర్చి, జనవరి 21: న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టు మొదటి రోజున 289 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ను ఏడు వికెట్లకు 260 పరుగులకు కట్టడి చేసింది. బ్యాటింగ్లో రాణించి 59 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్ బౌలింగ్లోనూ సత్తా చాటుతూ 32 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.
న్యూఢిల్లీ, జనవరి 20: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) లేదా దాని అనుబంధ సంఘాలకు చెందిన పాలక వర్గంలో ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు సభ్యుడిగా ఉండవచ్చు? గరిష్ఠ పరిమితి ఎంత? అన్న ప్రశ్నలకు సుప్రీం కోర్టు శుక్రవారం వివరణ ఇచ్చింది.
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన వివరణతో బిసిసిఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరీ, కోశాధికారి అనిరుద్థ్ చౌదరీ ఊరట చెందారు. వీరిద్దరూ బిసిసిఐలో తొమ్మిది సంవత్సరాలు పదవిలో లేని కారణంగా మళ్లీ తమతమ హోదాలను నిలబెట్టుకోనున్నారు. కాగా, ప్రస్తుతం బోర్డులో ఉన్న ఉపాధ్యక్షుల్లో ఎక్కువ సీనియారిటీ ఉన్న సికె ఖన్నాను అధ్యక్ష పదవి వరిస్తుంది.
న్యూఢిల్లీ: లోధా కమిటీ చేసిన సిఫార్సులన్నీ ఉన్నవి ఉన్నట్టు అమలు చేయడం అసాధ్యమని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టుకు స్పష్టం చేశాడు. యూనివర్శిటీస్, రైల్వేస్, సర్వీసెస్ క్రికెట్ సంఘాల తరఫున అతను వాదిస్తూ, భారత క్రికెట్కు ఎన్నో సేవలు అందిస్తున్న వీటికి సభ్య సంఘాల గుర్తింపు ఉండకూడదనడం సరికాదని వ్యాఖ్యానించాడు.
మెల్బోర్న్, జనవరి 20: డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ అనూహ్యంగా రెండో రౌండ్లోనే నిష్క్రమించగా, ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెల్చుకునే అవకాశాలను మెరుగుపరచుకున్న ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే తన లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేశాడు. మూడో రౌండ్లో అతను ‘జెయింట్ కిల్లర్’ శామ్ క్వెర్రీని 6-4, 6-2, 6-4 తేడాతో ఓడించి, ప్రీ క్వార్టర్స్లోకి అడుగుపెట్టాడు.
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్లో చెక్ రిపబ్లిక్కు చెందిన బార్బరా స్ట్రయికోస్తో కలిసి ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ముందంజ వేసింది. రెండో రౌండ్లో సానియా, బార్బరా జోడీ 6-1, 6-4 ఆధిక్యంతో సమంతా స్టొసుర్, షుయ్ జాంగ్ జోడీని ఓడించింది. వీరు తర్వాతి రౌండ్లో జపాన్ జోడీ ఎరీ హోజుమీ, మియూ కాటోను ఢీ కొంటారు. కాగా, పురుషుల డబుల్స్లో రోహన్ బొపన్నకు చుక్కెదురైంది.
న్యూఢిల్లీ, జనవరి 20: భారత్, ఇంగ్లాండ్ అండర్-19 జట్ల మధ్య జరిగే రెండు టెస్టులకు నాగపూర్ వేదిక కానుంది. వాస్తవానికి ఈ రెండు టెస్టులు చెన్నైలో జరగాలి. అయితే, లోధా కమిటీ సూచనలను అమలు చేసి తీరాల్సిందేనని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్సిఎ) పరోక్షంగా సహాయ నిరాకరణను ఆరంభించింది.
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్ ఆడుతున్న వీనస్ విలియమ్స్ను ఉద్దేశించి ‘గొరిల్లా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కామెంటేటర్ డౌగ్ ఆల్డర్పై వేటు పడింది. జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన అతనిని వెంటనే బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఇఎస్పిఎన్ ప్రకటించింది.
కటక్, జనవరి 20: భారత్ చేతిలో వనే్డ సిరీస్ను ఇప్పటికే 0-2 తేడాతో చేజార్చుకున్న ఇంగ్లాండ్ జట్టుకు చివరిదైన మూడో వనే్డకు ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలెక్స్ హాలెస్ చేతి వేలి గాయం కారణంగా స్వదేశానికి వెళ్లడం ఆ జట్టును సమస్యల్లోకి నెట్టింది. రెండో వనే్డ జరుగుతున్నప్పుడు హాలెస్ చేతి వేలికి గాయమైంది.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ను దారుణంగా దెబ్బతీసిన న్యూజిలాండ్ బౌలర్లు టిమ్ సౌథీ (5 వికెట్లు), ట్రెంట్ బౌల్ట్ (4 వికెట్లు). క్రైస్ట్చర్చిలో శుక్రవారం మొదలైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 8 వికెట్లకు 289 పరుగులు చేసింది