-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
సరవాక్ (మలేసియా), జనవరి 19: ఇక్కడ జరుగుతున్న మలేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ సెమీస్ చేరింది. క్వార్టర్స్లో ఆమె ఫినేత్రిని 21-15, 21-14 తేడాతో ఓడించింది. కాగా, పురుషుల సింగిల్స్లో అజ య్ జయరామ్ 13-21, 8-21 తేడా తో ఆంథోనీ జింటింగ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.
ముంబయి, జనవరి 20: చిరాగ్ గాంధీ అజేయ శతకంతో రాణించడంతో, రెస్ట్ఫా ఇండియాతో శుక్రవారం మొదలైన ఐదు రోజుల ఇరాన్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి గుజరాత్ ఎనిమిది వికెట్లకు 300 పరుగులు చేసింది. ప్రియాంక్ పాంచాల్ (30), ధ్రువ్ రావల్ (39), మన్ప్రీత్ జునేజా (47) కూడా గుజరాత్కు తమ వంతు స్కోర్లు అందించారు. రెస్ట్ఫా ఇండియా బౌలర్ సిద్ధార్థ్ కౌల్ 73 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు.
విజయవాడ (స్పోర్ట్స్), జనవరి 20: రాష్ట్రంలో ప్రపంచ అంధుల క్రికెట్ టి20 మ్యాచ్ల నిర్వహణ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) వైస్చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బంగార్రాజు తెలిపారు.
కటక్, జనవరి 20: ఈసారి ఐపిఎల్ వేలానికి భారీ సంఖ్యలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని ఇయాన్ మోర్గాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. వనే్డ ఇంటర్నేషనల్స్ ఫార్మాట్లో ఇంగ్లాండ్కు నాయకత్వం వహిస్తున్న తాను కూడా ఈసారి వేలానికి సిద్ధంగా ఉన్నానని విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. ముందుగా ఖరారైన వివిధ టోర్నీలు, సిరీస్ల కారణంగా నిరుడు ఐపిఎల్కు ఎక్కువ మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు రాలేకపోయారని తెలిపాడు.
కటక్: భారత్తో జరిగిన రెండో వనే్డలో స్లో ఓవర్రేట్ కారణంగా ఇంగ్లాండ్పై ఐసిసి అధికారులు జరిమానా విధించారు. నిర్ణీత ఓవర్ల కంటే ఎక్కువ ఓవర్లను బౌల్ చేసినందుకు జట్టులోని ఆటగాళ్లకు వారివారి మ్యాచ్ ఫీజులో 10 శాతాన్ని జరిమానాగా చెల్లించాలని ఆదేశించారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తన మ్యాచ్ ఫీజులో 20 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
కటక్, జనవరి 19: భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ సెంచరీలతో చెలరేగిపోవడంతో, ఇంగ్లాండ్తో గురువారం ఇక్కడ జరిగిన రెండో వనే్డలో 15 పరుగుల తేడాతో విజయభేరి మోగించిన టీమిండియా మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకోగలిగింది. చివరిదైన మూడో వనే్డని నామమాత్రపు పోరుగా మార్చేసింది.
కటక్: చివరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచింది. భువనేశ్వర్ కుమార్ కీలకమైన ఆ ఓవర్ను వేయగా, కోహ్లీ బదులు ధోనీ ఫీల్డింగ్ను సెట్ చేయడం గమనార్హం. మొదటి బంతిలో డేవిడ్ విల్లే ఒక పరుగు చేయగా, రెండో బంతిలో లాథమ్ ప్లంకెట్ సింగిల్ తీశాడు. మూడో బంతిలో విల్లే రెండు పరుగులు చేశాడు. నాలుగో బంతిలో మరో సింగిల్ వచ్చింది. ఐదో బంతిని రక్షణాత్మకంగా ఆడిన ప్లంకెట్ చివరి బంతిలో ఒక పరుగు చేశాడు.
సెంచూరియన్, జనవరి 19: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో వైట్వాష్ వేయించకున్న శ్రీలంక శుక్రవారం నుంచి మొదలయ్యే టి-20 సిరీస్లో ఎదురుదాడి చేసేందుకు సిద్ధమైంది. మొదటి టెస్టును 206, రెండో టెస్టును 282 పరుగుల తేడాతో కోల్పోయిన లంక, చివరిదైన మూడో టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 118 పరుగుల తేడాతో చిత్తయింది.
ముంబయి, జనవరి 19: మొదటిసారి రంజీ ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకున్న గుజరాత్, రెస్ట్ఫా ఇండియా జట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలయ్యే ఐదు రోజుల ఇరానీ కప్ పోరు ఆ రెండు జట్ల కంటే, వికెట్కీపర్లు పార్థీవ్ పటేల్, వృద్ధిమాన్ సాహా మధ్య యుద్ధంగా మారనుంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో, టీమిండియాకు ఎవరు వికెట్కీపర్గా బాధ్యతలు తీసుకోవడానికి పార్థీవ్, సాహా సిద్ధంగా ఉన్నారు.
మెల్బోర్న్, జనవరి 19: ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. వైల్డ్కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన ఉజ్బెకిస్తాన్ ఆటగాడు డెనిస్ ఇస్టోమిన్ 7-6, 5-7, 2-6, 7-6, 6-4 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి, ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్లో మొదటి అనూహ్య ఫలితాన్ని సాధించాడు.