S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

01/14/2017 - 00:43

న్యూఢిల్లీ, జనవరి 13: భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) గుర్తింపును భారత ప్రభుత్వం పునరుద్ధరించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను జీవితకాల ఉపాధ్యక్షులుగా ఎన్నుకొన్నందుకు ఐఒఎ గుర్తింపును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడంతో, వివాదం సద్దుమణిగింది. ఐఒఎ గుర్తింపును ప్రభుత్వం పునరుద్ధరించింది.

01/14/2017 - 00:41

ఇండోర్, జనవరి 13: సుమారు ఆరున్నర దశాబ్దాల తర్వాత అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్న గుజరాత్ ముందు 312 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచిన ముంబయి విసిరిన సవాలు ఉత్కంఠ రేపుతున్నది. విజేతను నిర్ధారించే టైటిల్ పోరులో మరొక్క రోజు ఆట మాత్రమే మిగిలివున్న తరుణంలో, ఇరు జట్లు హోరాహోరీ పోరు సాగిస్తున్నాయి.

01/14/2017 - 00:40

సిడ్నీ, జనవరి 13: ఇక్కడ జరిగిన డబ్ల్యుటిఎ అపియా ఇంటర్నేషనల్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా స్ట్రయికోవాతో కలిసి బరిలోకి దిగిన సానియా మీర్జా ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. అనస్తాసియా పవ్లిచెన్కోవా, టిమియా బబోస్ జోడీని ఢీకొన్న సామియా, స్ట్రయికోవా జోడీ 4-6, 4-6 తేడాతో, వరుస సెట్లలో ఓటమిపాలైంది.

01/14/2017 - 00:40

సిడ్నీ, జనవరి 13: పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌లో ఆస్ట్రేలియా 92 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఆస్ట్రేలియాను ఓడించేందుకు 269 పరుగులు సాధించాల్సివుండగా, పాకిస్తాన్ 176 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్ చివరి బంతిలో సెంచరీని నమోదు చేయడం విశేషం.

01/14/2017 - 00:40

పుణే, జనవరి 13: క్రికెట్‌లో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ ఉండాలన్న సిద్ధాంతాన్ని తాను అంగీకరించనని, నాయకత్వ విభజనను ఎంతమాత్రం సమర్థించలేనని భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ స్పష్టం చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత తొలిసారి అతను శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడాడు.

01/14/2017 - 00:38

వెల్లింగ్టన్, జనవరి 13: షకీబ్ అల్ హసన్ డబుల్ సెంచరీతో కదంతొక్కగా, న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ ఏడు వికెట్లకు 542 పరుగుల భారీ స్కోరు సాధించింది.

01/13/2017 - 02:08

ముంబయి, జనవరి 12: తొలి వామప్ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ ఎలెవెన్ గురువారం నాటి రెండో వామప్ మ్యాచ్‌ని ఆరు వికెట్ల తేడాతో చేజార్చుకుంది. ఓపెనర్ ఆజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ ‘ఎ’ విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ తాను ధోనీకి సిసలైన వారసుడినని నిరూపించుకున్నాడు.

01/13/2017 - 02:03

భారత క్రికెట్ కొత్త రూపంలో దర్శనం ఇవ్వనుంది. పురుషులు, మహిళల జట్లకు ఒకే రకమైన కొత్త యూనిఫామ్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)
గురువారం ముంబయలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కొత్త జెర్సీలతో ఆకట్టుకున్న క్రికెటర్లు

01/13/2017 - 02:01

ముంబయి: వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని సమర్థంగా భర్తీ చేయగలడన్న ముద్ర వేయించుకున్న యువ ఆటగాడు రిషభ్ పంత్ తనపై సెలక్టర్లు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన రెండో వామప్ మ్యాచ్‌లో అతను కీపర్‌గా రాణించాడు. నాలుగు క్యాచ్‌లు పట్టి, కీపర్‌గా సత్తా చాటుకున్నాడు. ఆతర్వాత బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు.

01/13/2017 - 01:58

ఇండోర్, జనవరి 12: సుమారు ఆరున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరదించి, రంజీ ట్రోఫీని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న గుజరాత్ తన లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఒక అడుగు ముందుకేసింది. ముంబయితో జరుగుతున్న ఫైనల్‌లో కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. కాగా, రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబయి మూడో రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.

Pages