-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
బెంగళూరు, ఆగస్టు 25: రియో ఒలింపిక్స్ మహిళల మారథాన్లో పాల్గొనే సమయంలో ప్రత్యేక పానీయాలుగానీ, తినుబండారాలుగానీ అవసరం లేదని రన్నర్ జైషే తనకు చెప్పిందని ఆమె కోచ్ నికోలయ్ స్నెసరెవ్ సంచలన ప్రకటన చేశాడు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఎఎఫ్ఐ) అధికారులు రేస్ జరుగుతున్న సమయంలో స్టాల్స్లో ఎక్కడా కనిపించలేదని, తనకు మంచినీళ్లు ఇచ్చే వారు కూడా కరవయ్యారని జైష ఆరోపించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ, ఆగస్టు 26: రియో ఒలింపిక్స్లో భారత షూటర్లు మూకుమ్మడిగా విఫలం కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, చైన్ సింగ్, హీనా సిద్ధు వంటి మేటి షూటర్లు ఏ దశలో తమపై ఉన్న అంచనాలకు తగినట్టు రాణించలేకపోవడంపై భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఎఐ) అధ్యక్షుడు రణీందర్ సింగ్ విచారం వ్యక్తం చేశాడు.
చండీగఢ్, ఆగస్టు 24: రియో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్కు బుధవారం ఇక్కడ ఘన స్వాగతం లభించింది. మహిళల 58 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్లో ఆమె మూడో స్థానాన్ని ఆక్రమించిన విషయం తెలిసిందే. కుస్తీలో భారత్కు పతకాన్ని అందించిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 24: గోపీ ఉత్తమ కోచ్ అనీ, మరో కోచ్ అవసరం తనకు లేదని రియో ఒలింపిక్స్లో బాడ్మింటన్ మహిళల సింగిల్స్లో రజత పతకాన్ని సాధించిన తెలుగు అమ్మాయి పివి సింధు స్పష్టం చేసింది. హైదరాబాద్లో సింధు సన్మాన సభ జరిగినప్పుడు, సింధుకు అత్యుత్తమ కోచ్తో శిక్షణ ఇప్పిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
దుబాయ్, ఆగస్టు 24: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్కి ఆతిథ్యమిచ్చిన క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానం నాసిరకంగా ఉందని మ్యాచ్ రిఫరీలు ఆండీ పైక్రాఫ్ట్, రంజన్ మదుగలే అభిప్రాయపడ్డారు.
టోక్యో, ఆగస్టు 24: రియో ఒలింపిక్స్కు తెరపడిందో లేదో టోక్యోలో సందడి మొదలైంది. 2020 ఒలింపిక్స్కు ఆతిథ్యమిస్తున్న ఈ నగరానికి బుధవారం ఒలింపిక్ పతాకం చేరుకోవడంతో హడావుడి ప్రారంభమైంది. నిర్వాహకులు ఇప్పటి నుంచి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కాగా, ఒలింపిక్ పతాకం టోక్యో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర గవర్నర్ యురికో కొయికే పాల్గొన్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 24: రియో ఒలింపిక్స్ మహిళల మారథాన్లో పోటీపడినప్పుడు భారత అధికారులు ఎవరూ స్టాళ్లలో కనిపించలేదని, తనకు మంచి నీరు ఇచ్చేవారు కూడా కరవయ్యారని ఒపి జైష చేసిన ఆరోపణలకు భిన్నంగా మరో మారథాన్ రన్నర్ కవిత రావత్ స్పందించింది. ఏ దశలోనూ మంచినీళ్లకు తాను ఇబ్బంది పడలేదని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.
కొలంబో, ఆగస్టు 24: ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన రెం డో వనే్డ ఇంటర్నేషనల్లో శ్రీలంక జట్టు 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు 48.5 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మేండిస్ 69 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, కెప్టెన్ ఏంజెలో మా థ్యూస్ (57), కుశాల్ పెరెరా (54) అర్ధ శతకాలను సాధించా రు.
దిల్లీ : రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ సాక్షిమాలిక్కు బుధవారం ఉదయం దిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. హరియాణా ఎంపీలు కవితా జైన్, నర్బీర్ సింగ్, మనీశ్ గ్రోవర్, విపుల్ గోయల్ తదితరులు సాక్షికి స్వాగతం పలికారు. రోహ్తక్లో సాక్షి సన్మానసభ ఏర్పాటుచేశారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టార్ ఆమెను ఘనంగా సత్కరించారు.
జమైకా, ఆగస్టు 23: స్ప్రింట్ యోధుడు, ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ తెలిసిందే. వరుసగా మూడు ఒలింపిక్స్లో 100, 200 మీటర్ల పరుగుతోపాటు 4న100 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాలను కైవసం చేసుకొని ‘ట్రిపుల్’ హ్యాట్రిక్ సాధించిన బోల్ట్ వేసుకున్న బూట్లు వేలానికి వస్తే ఊరుకుంటారా?