-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
రియో డి జెనీరో, ఆగస్టు 10: రియో ఒలింపిక్స్లో రోజుకో అపశృతి దొర్లుతోంది. నిరసన ప్రదర్శనలు, సౌకర్యాల లేమి వంటివి సాధారణమైతే, తాజాగా పాత్రికేయులు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు బులెట్ల వర్షం కురిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్లో భారత అథ్లెట్ల ఫ్లాప్ షో కొనసాగుతున్న నేపథ్యంలో, గురువారం నుంచి మొదలయ్యే బాడ్మింటన్పై అందరు దృష్టి కేంద్రీకరించారు. మహిళల సింగిల్స్లో పోటీపడుతున్న హైదరాబాదీ సైనా నెహ్వాల్పైనే అభిమానులు ఆశపెట్టుకున్నారు. తెలుగు తేజం పివి సింధు కూడా బరిలోకి దిగనుంది.
రియో డి జెనీరో: భారత బాక్సర్ వికాస్ క్రిషన్ రియో ఒలింపిక్స్ పురుషుల 75 కిలోల విభాగంలో ప్రీ క్వార్టర్స్ చేరాడు. ఒలింపిక్స్లో తొలిసారి అడుగుపెట్టిన అమెరికా బాక్సర్ చార్లెస్ కాన్వెల్ను సులభంగా ఓడించాడు. వికాస్ పంచ్ల నుంచి తప్పించుకోవడానికి తంటాలుపడిన కాన్వెల్ ఎదురుదాడికి దిగలేకపోయాడు. అతనిని పూర్తి ఆత్మరక్షణలోకి నెట్టిన వికాస్ 3-0 తేడాతో గెలిచి ముందంజ వేశాడు.
రియో డి జెనీరో, ఆగస్టు 10: భారత మహిళా ఆర్చర్ లైష్రామ్ బొంబాల్యా దేవి పతకాలపై ఆశలు పెంచింది. మహిళల ఇండివిజువల్ రికర్వ్ ఎలిమినేషన్స్లో చక్కటి ప్రతిభ కనబరచి ప్రీ క్వార్టర్స్లోకి అడుగుపెట్టింది.
రియో డి జెనిరో, ఆగస్టు 9: రియో ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత జట్టు పెద్ద గండం నుంచి గట్టెక్కి క్వార్టర్ ఫైనల్స్కు చేరుకునే అవకాశాలను మెరుగుపర్చుకుంది. మంగళవారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో భారత జట్టు 2-1 తేడాతో అర్జెంటీనా జట్టుపై విజయం సాధించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 9: గత ఏడాది వరస విజయాలతో మహిళా టెన్నిస్లో సంచనాలు సృష్టించిన సానియా మీర్జా- హింగిస్ జోడీ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి గత ఏడాది మొత్తం 9 టైటిళ్లను గెలుచుకుని నంబర్ వన్ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే గత అయిదు నెలలుగా ఈ జోడీ ఆశించిన రీతిలో రాణించలేక పోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సానియా సన్నిహిత వర్గాలు తెలిశాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 9: వచ్చే అక్టోబర్ 15 లోగా 15 సంస్కరణలను అమలు చేయాలని సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)ని సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోధా కమిటీ స్పష్టంగా ఆదేశించింది. రాజ్యాంగ సంస్కరణలు మొదలుకొని, వందలాది కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే టీవీ కాంట్రాక్ట్లు సహా వివిధ కాంట్రాక్ట్ ఇవ్వడానికి సంబందించిన సంస్కరణలు వీటిలో ఉన్నాయి.
రియో డి జెనిరో, ఆగస్టు 9: ఒలింపిక్స్లో వాల్ట్స్ ఫైనల్స్కు చేరిన తొలి భారత జిమ్నాస్టుగా చరిత్ర సృష్టించడంతో పాటు కోట్లాది మంది భారత క్రీడాభిమానుల్లో ఎన్నో ఆశలు రేకెత్తిస్తున్న దీపా కర్మాకర్ను అమె కోచ్ విశే్వశ్వర్ నంది ‘గృహ నిర్బంధం’లో ఉంచాడు.
గ్రాస్ ఐలెట్, ఆగస్టు 9: వెస్టిండీస్తో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన మూడో క్రికెట్ టెస్టు తొలి రోజున భారత్ లంచ్ విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. డారెల్ సమీ స్టేడియంలో బౌలర్లకు అనుకూలించే పిచ్పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణయం సరైనదేననిపింది.
సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా అండ్ బార్బుడా), ఆగస్టు 9: ప్రపంచ కప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్లో వెస్టిండీస్ జట్టు టైటిల్ను గెలుచుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన కార్లోస్ బ్రాత్వైట్ను అదృష్టం వరించింది. అమెరికాలో ఈ నెలాఖరున టీమిండియాతో రెండు మ్యాచ్ల ట్వంటీ-20 సిరీస్లో తలపడనున్న వెస్టిండీస్ జట్టుకు బ్రాత్వైట్ను కెప్టెన్గా నియమించారు.