-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
పారిస్, జూన్ 4: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో స్పెయిన్ క్రీడాకారిణి గార్బిన్ ముగురుజా విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో నాలుగో సీడ్గా బరిలోకి దిగిన ముగురుజా శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ (అమెరికా)పై సంచలన విజయం సాధించి కెరీర్లో తొలిసారి గ్రాండ్ శ్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది.
ముంబయి, జూన్ 4: టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ రేసులోకి దిగాడు. కొంత కాలం నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవిని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించి కొద్ది రోజులు కూడా తిరక్కుండానే ఆయన ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ పాటిల్ శనివారం పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశాడు.
న్యూఢిల్లీ, జూన్ 4: వియత్నాంలోని హోచిమిన్ సిటీలో జరుగుతున్న ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్లో శనివారం రెండో రోజు భారత్ నాలుగు పసిడి పతకాలతో పాటు మరో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని సత్తా చాటుకుంది.
వాషింగ్టన్:ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ (74) కన్నుమూశారు. అమెరికాలోని అరిజోనాలో శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నెగ్గిన మహమ్మద్ అలీ తలకు తగిలిన గాయాలతో పార్సిన్సన్ వ్యాధికి గురయ్యారు. 32 ఏళ్లుగా ఆయన ఈ వ్యాధితో బాధపడుతున్నారు. చివరకు చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
పారిస్, జూన్ 3: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో అమెరికాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ (34) టైటిల్కు చేరువైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆమె అన్సీడెడ్ కికీ బెర్టెన్స్పై విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది.
పారిస్, జూన్ 3: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, అతని భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) టైటిల్ కైవసం చేసుకున్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్ మ్యాచ్లో వీరు 4-6, 6-4, 10-8 సెట్ల తేడాతో హైదరాబాద్ క్వీన్ సానియా మీర్జా, ఇవాన్ డోడిగ్ జోడీని మట్టికరిపించి విజేతలుగా నిలిచారు.
న్యూఢిల్లీ, జూన్ 3: ప్రపంచంలో అత్యున్నత క్రీడా ప్రాధికార సంస్థ అయిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యత్వానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ నామినేట్ అయ్యారు. ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకు జరిగే ఐఓసి సమావేశంలో నీతా అంబానీ సభ్యురాలిగా ఎన్నికైతే అందులో చోటు దక్కించుకున్న తొలి భారత మహిళగా ఆమె రికార్డులకు ఎక్కుతారు.
ఫీనిక్స్ (అమెరికా), జూన్ 3: దీర్ఘ కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అలనాటి బాక్సింగ్ వీరుడు, ప్రపంచ హెవీ వెయిట్ మాజీ చాంపియన్ మహ్మద్ అలీ (74) అమెరికాలోని ఫీనిక్స్ ప్రాంతంలో మరోసారి ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఆయన గతంలో కంటే మరింత తీవ్రస్థాయిలో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోందని అలీ పరిస్థితి గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు వెల్లడించారు.
జకార్తా, జూన్ 3: త్వరలో ఒలింపిక్ క్రీడలకు వెళ్లబోతున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్లో చుక్కెదురైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో ఆమె స్పెయిన్కు చెందిన ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ముంబయి, జూన్ 2: భారత క్రికెట్ జట్టుకు కోచ్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే, స్వదేశీ కోచ్నే నియమించాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇతరత్రా అర్హతలతోపాటు హిందీలో మాట్లాడడం వచ్చిన వ్యక్తినే కోచ్గా నియమిస్తామని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఒక చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.