-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
లీడ్స్, మే 18: ఇంగ్లీష్ కౌండీల్లో మిడిల్సెక్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ స్మిత్కు శ్రీలంకతో గురువారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్టులో ఆడే తుది 11 మంది జాబితాలో స్థానం దక్కింది. ఇప్పటి వరకూ ఒక్క టెస్టు కూడా ఆడని జేమ్ బాల్కు అవకాశం లభిస్తుందన్న వార్తలు వినిపించాయి. అయితే, చివరి క్షణాల్లో సెలక్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకొని, ఫిన్ను ఎంపిక చేశారని సమాచారం.
కతార్లోని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) గుర్తింపు పొందిన పరీక్షా కేంద్రంలో శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరెరాను డోపింగ్ దోషిగా పేర్కోవడం, ఆ తర్వాత పొరపాటు జరిగిందంటూ కేసును ఉపసంహరించుకోవడం క్రికెట్ రంగంలో దుమారం రేపుతోంది. డోపింగ్ కేంద్రం నిర్వాకం కారణంగా కుశాల్ అత్యంత కీలకమైన సమయాన్ని కోల్పోయాడని, అతని ప్రతిష్ఠ కూడా దెబ్బతిన్నదని శ్రీలంక బోర్డు అంటున్నది.
కన్హాన్ (చైనా), మే 17: ఉబెర్ కప్ మహిళల టీం చాంపియన్షిప్లో భారత్ క్వార్టర్ ఫైనల్స్ దిశగా మరో
అడుగు ముందుకే
సింది.
కరాచీ, మే 17: పాకిస్తాన్లో పిచ్ల తీరు అధ్వాన్నంగా ఉందని, ఈ పరిస్థితి కొనసాగితే అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లను అందించడం కష్టమని మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ అన్నాడు. పాకిస్తాన్ కప్ చాంపియన్షిప్ జరుగుతున్న తీరే పిచ్ల తీరుకు అద్దం పడుతుందని ఇటీవలే పాకిస్తాన్ చీఫ్ సెలక్టర్గా నియమితుడైన ఇంజీ పేర్కొన్నాడు.
బెంగళూరు, మే 17: రాయల్ చాలెంజర్స్ బెంగ ళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బుధవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో జరిగే మ్యాచ్లే ఆడేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కోల్కతా నైట్రైడర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఎడమ చేతికి బలమైన గాయం తగిలింది. చేతి బొటనవేలు, చూపుడు వేలుకు మధ్య ఉన్న భాగం చిట్లడంతో ఏడెనిమిది కుట్లు కూడా వేశారు.
మొహాలీ, మే 17: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ గ్లేన్ మాక్స్వెల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయమైన పంజాబ్ గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒకటి బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఆడుతుంది. 21న విశాఖపట్నంలో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్లో రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ను ఢీ కొంటుంది.
న్యూఢిల్లీ, మే 17: రెజ్లర్లు కోర్టులో కాదు.. శిక్షణా స్థలంలో ఉండాలని సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్లకు ఢిల్లీ హైకోర్టు హితవు పలికింది. రియో ఒలింపిక్స్కు ఎవరిని పంపాలనే విషయంలో అత్యవరసమైతేనే జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. పోటీదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ)ని ఆదేశించింది.
న్యూఢిల్లీ, మే 17: చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 18 మందితో కూడిన భారత హాకీ జట్టుకు గోల్కీపర్ శ్రీజేష్ నాయకత్వం వహించనున్నాడు. వచ్చేనెల 10 నుంచి 17 వరకు లండన్లో జరిగే ఈ టోర్నీ నుంచి రెగ్యులర్ కెప్టెన్ సర్దార్ సింగ్కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో జట్టు పగ్గాలను శ్రీజేష్కు అప్పగించారు.
కోల్కతా, మే 17: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పించ్ హిట్టర్ ఎబి డివిలియర్స్లో ఒకరు బ్యాట్మన్కాగా, మరొకరు సూపర్మన్ అని అదే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్ వ్యాఖ్యానించాడు. వీరిద్దరూ 12 మ్యాచ్ల్లో 1,349 పరుగులు జోడించారని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుర్తుచేశాడు. కోహ్లీ, డివిలియర్స్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నాడు.
అహ్మదాబాద్, మే 16: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్మన్గా రికార్డు నెలకొల్పిన దీపక్ శోధన్ అహ్మదాబాద్లోని తన స్వగృహంలో మృతి చెందాడు. భారత టెస్టు క్రికెటర్లలో జీవించి ఉన్న వారిలో ఎక్కువ వయసుగల ఆటగాడిగా గుర్తింపు పొందిన 87 శోధన్ కొంత కాలంగా కేన్సన్ వ్యాధితో బాధపడుతున్నాడు.