-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, మే 16: రియో ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం కోసం నర్సింగ్ యాదవ్తో ట్రయల్ బౌట్ కోసం డిమాండ్ చేస్తున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ తనకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. పురుషుల రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో ఒకరిని రియో ఒలింపిక్స్కు పంపే అవకాశం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ)కి ఉంది.
మోహాలీ, మే 16: ఒకే ఓవర్లో మళ్లీ ఆరు సిక్సర్లు కొడతానని భారత బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. కేన్సన్ వ్యాధికి చికిత్స పొందుతున్న 17 మంది పిల్లలు పిసిఎ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడిన మ్యాచ్ని చూసేందుకు ప్రత్యేకంగా వచ్చారు. ఆ మ్యాచ్లో యువీ 24 బంతులు ఎదుర్కొని అజేయంగా 42 పరుగులు సాధించి సన్రైజర్స్కు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.
కోల్కతా, మే 16: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన ఐపిఎల్ గ్రూప్ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తయింది. బెంగళూరు ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన నైట్రైడర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 183 పరుగులు చేయగలిగింది. అయితే, బౌలింగ్లో దారుణంగా విఫలమైంది. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోగా, అతనికి మద్దతుగా డివిలియర్స్ నిలిచాడు.
లండన్, మే 16: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ధమ్మిక ప్రసాద్ గురువారం నుంచి హెడింగ్లేలో ఇంగ్లాండ్తో మొదలుకానున్న మొదటి టెస్టుకు దూరమయ్యాడు. భుజం గాయం కారణంగా అతను ఈ మ్యాచ్లో ఆడడం లేదని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సి) ఒక ప్రకటనలో పేర్కొంది. ఎసెక్స్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ప్రసాద్ భుజానికి గాయమైంది. అది పూర్తిగా తగ్గకపోవడంతో అతనికి విశ్రాంతినివ్వాలని నిర్ణయించినట్టు ఎస్ఎల్సి తెలిపింది.
రోమ్, మే 16: రోమ్ మాస్టర్స్ టెన్నిస్ చాంపియన్షిప్ను బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే గెల్చుకున్నాడు. ఫైనల్లో అతను ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ను 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి సంచలనం సృష్టించాడు. క్లే కోర్టుపై జొకోవిచ్పై ముర్రేకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఇలావుంటే, మహిళల విభాగంలో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ టైటిల్ సాధించింది.
విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 16: ఐపిఎల్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ను ఎదుర్కోవడానికి జహీర్ ఖాన్ నాయకత్వంలోని ఢిల్లీ డేర్డెవిల్స్ అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది.
కున్హాన్ (చైనా), మే 16: మహిళల బాడ్మింటన్ టీం చాంపియన్షిప్ ఉబెర్ కప్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. పురుషుల విభాగంలో థామస్ కప్ కోసం జరుగుతున్న పోరులో మొదటి రోజున థాయిలాండ్తో తలపడిన భారత్ 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కోగా, మహిళల జట్టు 5-0 తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుచేయడం విశేషం.
చండీగఢ్, మే 15: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపిఎల్ ప్లే ఆఫ్లో స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ అర్ధ శతకం, చివరిలో యువరాజ్ సింగ్ అద్భుత బ్యాటింగ్ నైపుణ్యం సన్రైజర్స్ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సంపాదించిపెట్టాయి. ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున షహీం ఆమ్లా చేసిన పోరాటం వృథాకాగా, ఆ జట్టు ఐపిఎల్ నుంచి నిష్క్రమించింది.
కోల్కతా, మే 15: వర్షం కురిసి ఆటకు అంతరాయం ఏర్పడినప్పుడు విజేతను నిర్ణయించడానికి లేదా లక్ష్యాన్ని నిర్ధారించడానికి అనుసరిస్తున్న డక్వర్త్ లూయిస్ విధానంపై రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టెఫెన్ ఫ్లెమింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిని మించిన పరమ చెత్త విధానం మరొకటి లేదని వ్యాఖ్యానించాడు.
బార్సిలోనా, మే 15: స్పానిష్ సాకర్ చాంపియన్షిప్ ‘లా లిగా’ టైటిల్ను బార్సిలోనా కైవసం చేసుకుంది. గ్రనడాతో జరిగిన మ్యాచ్ని 3-0 తేడాతో గెల్చుకొని, మొత్తం 91 పాయింట్లతో టాపర్గా నిలిచింది. లూయిస్ సౌరెజ్ హ్యాట్రిక్తో రాణించి బార్సిలోనాకు టైటిల్ను సాధించిపెట్టాడు. ఈ టోర్నీలో బార్సిలోనా విజేతగా నిలవడం ఇది 24వ సారి.