-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
లండన్, మే 11: ఇంగ్లాండ్ మహిళా జట్టు కెప్టెన్ చార్లొట్ ఎడ్వర్డ్స్ అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పింది. 1996 జూలైలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసిన ఆమె సుమారు 20 సంవత్సరాలు ఇంగ్లాండ్ జట్టులో కీలక క్రీడాకారిణిగా సేవలు అందించింది. కెరీర్లో 23 టెస్టులు ఆడిన ఆమె 43 ఇన్నింగ్స్లో 1,676 పరుగులు సాధించింది. అత్యధిక స్కోరు 117 పరుగులు.
విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 10: ఈసారి ఐపిఎల్లో అరంగేట్రం చేసిన రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ నాకౌట్ చేరే అవకాశాలకు తెరపడింది. మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన అత్యంత కీలక మ్యాచ్లో కేవలం నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైన మహేంద్ర సింగ్ ధోనీ సేనకు నిరాశే మిగిలింది. ఆడం జంపా ఆరు వికెట్లు పడగొట్టినా, జార్జి బెయిలీ (34), ధోనీ (30) చివరి వరకూ ప్రయత్నించినా పుణెను గటెక్కించలేకపోయారు.
ముంబయి, మే 10: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తన పదవికి రాజీనామా చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్గా కూడా సేవలు అందిస్తున్న అతను వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐసిసి చైర్మన్ పదవికి మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనుండగా ఆ పదవిని మరోసారి దక్కించుకోవడానికి వీలుగా శశాంక్ బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగాడు.
ముంబయి, మే 10: బిసిసిఐని ప్రక్షాళన చేయడానికి మనోహర్ పది సూత్రాల విధానాన్ని చేపట్టాడు. క్రీడాకారులు, బోర్డు అధికారులకు సంబంధించి పరస్పర ప్రయోజనాల అంశాన్ని అధ్యయనం చేయడానికి ఒక ఉన్నతాధికారి నియామకం వీటిలో మొదటిది. మైదానంలో చోటుచేసుకునే అవినీతిపై విచారణ జరిపించే అధికారం బోర్డుకు లేదు కాబట్టి ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపించాలన్నది అతను తీసుకున్న మరో నిర్ణయం.
కరాచీ, మే 10: ఆటగాళ్ల క్రమశిక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోచ్గా నియమితుడైన మికీ ఆర్థర్ స్పష్టం చేశాడు. మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ రాజీనామా చేసిన తర్వాత అతని స్థానంలో కోచ్గా బాధ్యతలు చేపట్టనున్న ఆర్థర్ ఒక చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్రమశిక్షణకు సంబంధించిన సమస్యలేవీ ఉండవని నమ్ముతున్నానని చెప్పాడు.
బెంగళూరు, మే 10: ఐపిఎల్లో హాట్ ఫేవరిట్గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఇప్పుడు ప్లే ఆఫ్లో స్థానం దక్కుతుందా లేదా అన్న అనుమానం వెంటాడుతున్నది. ఇప్పటి వరకూ తొమ్మిది మ్యాచ్లు ఆడిన ఈ జట్టు నాలుగు మ్యాచ్లను గెల్చుకుంది. ఐదు పరాజయాలను ఎదుర్కొంది. సోమవారం చివరి వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ను ఒక పరుగు తేడాతో ఓడించిన బెంగళూరు ఊపిరి పీల్చుకుంది.
ముంబయి, మే 10: రియో ఒలింపిక్స్లో మన దేశానికి గుడ్విల్ అంబాసిడర్గా ఉండాలని తనను ఎవరూ కోరలేదని, అసలు అలాంటి ప్రతిపాదనేదీ తన వద్దకు రాలేదని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎఆర్ రహ్మాన్ స్పష్టం చేశాడు. ఒలింపిక్స్ గుడ్విల్ అంబాసిడర్స్గా సల్మాన్ ఖాన్, సచిన్ తెండూల్కర్లను భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) నియమించిన విషయం తెలిసిందే.
లాస్ ఏంజిలిస్, మే 9: అత్యధిక ఒలింపిక్ పతకాలను సాధించి, తిరుగులేని స్విమ్మర్గా ఎదిగిన మైఖేల్ ఫెల్ప్స్కు తండ్రి హోదా లభించింది. అతని గర్ల్ఫ్రెండ్ నికోల్ జాన్సన్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ నెట్వర్క్లో ఉంచిన ఫెల్ప్స్ తన కుమారుడి పేరును బూమర్గా ఖరారు చేసినట్టు తెలిపాడు
మాడ్రిడ్, మే 9: మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ పురుషుల టైటిల్ను ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ గెల్చుకున్నాడు. ఫైనల్లో ఆండీ ముర్రేను 6-2, 3-6, 6-3 తేడాతో విజయం సాధించి, కెరీర్లో 29వ మాస్టర్స్ టైటిల్ను అందుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ముర్రే గట్టిపోటీనిచ్చాడు. వరుసగా 12వ మాస్టర్స్ విజయంపై కనే్నశాడు.
పారిస్, మే 9: అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (్ఫఫా) నుంచి ఇది వరకే సస్పెన్షన్కు గురైన మైఖేల్ ప్లాటినీ ఇప్పుడు యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ (యుఫా)కు కూడా దూరమయ్యాడు. తనను ఫిఫా నుంచి సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్)లో పిటిషన్ దాఖలు చేసిన ప్లాటినీకి అక్కడ కూడా చుక్కెదురైంది.