-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
రాజ్కోట్, ఏప్రిల్ 24: భారీ స్కోర్లకు ప్రయత్నించకుండా, ప్రతి ఒక్కరూ వ్యూహాత్మకంగా ఆడి తమ వంతు పాత్రను పోషిస్తే విజయం సాధించడం అసాధ్యం కాదని గుజరాత్ లయన్స్ నిరూపించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయ శతకంతో కదంతొక్కగా, వికెట్కీపర్-బ్యాట్స్మన్ లోకేష్ రాహుల్ 51 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
ముంబయి, ఏప్రిల్ 24: భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ఆదివారం తన 43వ జన్మదినోత్సవాన్ని పిల్లలతో కొంత సేపు ఆడి, సేవా కార్యక్రమాల్లో పాల్గొని బిజీ బిజీగా గడిపేశాడు. 2013లో వెస్టిండీస్తో జరిగిన టెస్టు మ్యాచ్ తర్వాత అన్ని ఫార్మెట్స్ నుంచి రిటైరైన సచిన్ తాను చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసిన ముంబయిలోని ఎంఐజి క్లబ్కు వెళ్లి అక్కడ పిల్లలతో కొంత సేపు క్రికెట్ ఆడాడు.
పుణె, ఏప్రిల్ 24: చివరి వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్లో గౌతం గంభీర్ నాయకత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ నిలబడితే, పరిమిత ఓవర్ల ఫార్మెట్స్లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 162 పరుగుల లక్ష్యాన్ని నైట్ రైడర్స్ మరో మూడు బంతులు ఉండగా చేదించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: రియో ఒలింపిక్స్కు భారత్లో గుడ్విల్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నియామకంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మాజీ అథ్లెట్ మిల్కా సింగ్, స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ తదితరులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) తీసుకున్న ఈ నిర్ణయం యావత్ క్రీడా ప్రపంచాన్ని కించ పరిచే విధంగా ఉందని లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ ధ్వజమెత్తాడు.
పుణె, ఏప్రిల్ 24: ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టార్ కెవిన్ పీటర్సన్ ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)కు దూరమయ్యాడు. కాలి కండరాలు బెణకడంతో అతను ఐపిఎల్లో మ్యాచ్లు ఆడే అవకాశం లేదని రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ మేనేజ్మెంట్ ప్రకటించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో కాలి కండరాలు బెణకడంతో కుప్పకూలిన పీటర్సన్ను మైదానం నుంచి ఎత్తుకొని తీసుకెళ్లాల్సి వచ్చింది.
మొహాలీ, ఏప్రిల్ 24: గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పరాజయాల బాటలో సాగుతున్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సోమవారం హోం గ్రౌండ్లో ముంబయి ఇండియన్స్ నుంచి కష్టతరమైన పరీక్షను ఎదుర్కోనుంది. ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచ్ల్లో కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేయగలిగిన పంజాబ్ నాలుగు పరాజయాలను చవిచూసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చివరి క్షణం వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఢిల్లీ డేర్డెవిల్స్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో విఫలమైన ముంబయి పది పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఓపెనర్గా వచ్చిన రోహిత్ చివరి ఓవర్ మూడో బంతికి అవుటయ్యే వరకూ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించాడు.
పుణె, ఏప్రిల్ 23: హోం గ్రౌండ్లో ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగే ఐపిఎల్ మ్యాచ్లో రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ జట్టు పరువు నిలబెట్టుకుంటుందా లేక మరో పరాజయాన్ని చవిచూస్తుందా అన్నది ఆసక్తి రేపుతోంది. పరిమిత ఓవర్ల ఫార్మెట్స్లో భారత్కు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీనే ఈ జట్టుకు కెప్టెన్ కావడం, ఐపిఎల్లో మొదటిసారి ఈ జట్టు అడుగుపెట్టడం ఉత్కంఠకు కారణాలు.
రాజ్కోట్, ఏప్రిల్ 23: భారత క్రికెట్ జట్టులో కీలకంగా ఉన్న ఇద్దరు క్రికెటర్లు సురేష్ రైనా, విరాట్ కోహ్లీ మధ్య ఆధిపత్యం పోరాటం ఆదివారం అభిమానులకు కనువిందు చేయనుంది. టీమిండియా టెస్టు జట్టుకు కోహ్లీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మెట్స్ నాయకత్వ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీని తప్పిస్తే, ఆ స్థానాన్ని అందుకోవడానికి కోహ్లీతోపాటు రైనా కూడా రేసులో ఉన్నాడు.
పుణె, ఏప్రిల్ 23: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీపై 12 లక్షల రూపాయల జరిమానా వేటు పడింది. రైజింగ్ పుణె సూపర్జెయింట్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో 13 పరుగుల తేడాతో గెలిచిన బెంగళూరు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. స్లో ఓవర్రేట్కు కోహ్లీని బాధ్యడ్ని చేస్తూ జరిమానా విధించామని ఐపిఎల్ కమిటీ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.