-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కౌలాలంపూర్, ఏప్రిల్ 7: సుల్తాన్ అజ్లన్ షా హాకీ టోర్నీలో భాగంగా గురువారం ఆస్ట్రేలియాను ఢీకొన్న భారత్ 1-5 తేడాతో చిత్తయింది. మొదటి మ్యాచ్లో తన స్థాయికి తగినట్టు ఆడలేకపోయినప్పటికీ, జపాన్ను 2-1 తేడాతో ఓడించిన సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు రెండో మ్యాచ్లో దారుణంగా ఓడింది. మ్యాచ్ ఐదో నిమిషంలోనే బ్లేక్ గోవర్స్ ద్వారా ఆసీస్కు తొలి గోల్ లభించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్గా బాధ్యతలు స్వీకరించే విషయంలో క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవడం అసాధ్యమని మాజీ కెప్టెన్, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఇప్పటి వరకూ కోచ్గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న టీమిండియా డైరెక్టర్ రవి శాస్ర్తీ కాంట్రాక్టు టి-20 వరల్డ్ కప్తో ముగిసింది.
లాహోర్, ఏప్రిల్ 5: పాకిస్తాన్ టి-20 జట్టుకు వికెట్కీపర్/ బ్యాట్స్మన్ సర్ఫ్రాజ్ అహ్మద్ నియమితుడయ్యాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్, టి-20 వరల్డ్ కప్ చాంపియన్షిప్ పోటీల్లో పాక్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. దీనితో కెప్టెన్ షహీద్ అఫ్రిదీపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. జట్టు కోచ్గా వ్యవహరించిన వకార్ యూనిస్ కూడా తన నివేదికలో అఫ్రిదీపై విమర్శలు గుప్పించాడు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: రియో ఒలిపింక్స్లో పాల్గొనాలన్న భారత బాడ్మింటన్ వీరుడు, తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ ఆశలకు దాదాపుగా తెరపడింది. గత కొంతకాలంగా వేధిస్తున్న ఫిట్నెస్ సమస్య అతని అవకాశాలకు గండికొట్టింద. ఈనెల మలేసియా, సింగపూర్ ఓపెన్ టోర్నీల్లో పాల్గొనాలని కశ్యప్ భావించాడు. కానీ, గాయం పూర్తిగా తగ్గకపోవడంతో అతను ఈరెండు టోర్నీల నుంచి వైదొలిగాడు.
ఇపో (మలేసియా), ఏప్రిల్ 5: రియో డి జెనీరోలో ఈఏడాది ఆగస్టులో జరిగే ఒలింపిక్స్కు సన్నాహాలు చేస్తున్నామని, అందులో భాగంగానే అజ్లన్ షా, చాంపియన్స్ ట్రోఫీ పోటీలకు సిద్ధమవుతున్నామని భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ అన్నాడు. ఈనెల 16వ తేదీ వరకు జరిగే సుల్తాన్ అజ్లన్ షా టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్ని బుధవారం జపాన్తో భారత్ ఆడుతుంది.
న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న బిసిసిఐకే స్పష్టత అంటూ లేదని సుప్రీం కోర్టు ఈఏడాది జనవరి నాలుగున వ్యాఖ్యానించింది. క్రికెట్ ప్రక్షాళనకు లోధా కమిటీ సూచించిన అంశాలను అమలు చేసినందువల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్, న్యాయమూర్తి ఇబ్రహీం కలిఫుల్లాతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ నిలదీసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: క్రికెట్ అభివృద్ధికి ఏమీ చేయలేదంటూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరస్పర ప్రయోజనాల కోసం ఒక వ్యవస్థను రూపొందించారేగానీ క్రికెట్కు మీరు చేసింది మృగ్యమని విమర్శించింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడం సాధ్యం కాదనడంలో అర్థం లేదని మండిపడింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ ఎవరు? ఈ ప్రశ్నకు ఒకటిరెండు రోజుల్లోనే సమాధానం లభిస్తుందని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వర్గాలు అంటున్నాయి. అండర్-19 జట్టుకు కోచ్గా వ్యవహరించిన మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్కు ఈ పదవి దక్కుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది వరకు కూడా ద్రవిడ్ పేరు తెరపైకి వచ్చింది.
మియామీ, ఏప్రిల్ 4: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకొవిచ్ కైవసం చేసుకున్నాడు. హాట్ ఫేవరిట్గా బరిలోకి దిగిన అతను ఫైనల్లో జపాన్ క్రీడాకారుడు కెయ్ నిషికొరిని 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేశాడు. జొకొవిచ్ విజృంభణకు నిషికొరి నుంచి సరైన సమాధానం లేకపోయింది. మియామీలో అతను విజేతగా నిలవడం ఇది ఆరోసారి. కెరీర్లో 28వ ఎటిపి మాస్టర్స్ టైటిల్.
కోల్కతా, ఏప్రిల్ 4: టి-20 ప్రపంచ కప్ చాంపియన్షిప్ను కైవసం చేసుకున్నప్పటికీ, సరైన ఆదరణ లభించకపోవడం తనను బాధిస్తున్నదని వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమీ అన్నాడు. గ్రెనడా నుంచి ప్రధాని కీత్ మిచెల్ స్వయంగా ఫోన్ చేసి తమను అభినందించాడని, కానీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) మాత్రం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.