-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
వెల్లింగ్టన్, ఏప్రిల్ 2: అంతర్జాతీయ క్రికెట్లో ఆడాలన్న పట్టుదలతో దక్షిణాఫ్రికా నుంచి న్యూజిలాండ్కు తరలి వెళ్లిన గ్రాంట్ ఇలియట్ వనే్డ ఇంటర్నేషనల్స్కు గుడ్బై చెప్పాడు. అయితే, టి-20 ఫార్మెట్లో కొనసాగనున్నట్టు ఈ న్యూజిలాండ్ క్రికెటర్ ప్రకటించాడు. 37 ఏళ్ల ఇలియట్ భారత్లో జరుగుతున్న టి-20 వరల్డ్ కప్లోనూ పాల్గొన్నాడు. అయితే, కివీస్ సెమీ ఫైనల్లోనే పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: సిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతున్న ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. సెమీ ఫైనల్లో మూడో సీడ్ లీ జురుయ్తో తలపడిన రెండో ర్యాంక్ క్రీడాకారిణి సైనా 20-22, 21-17, 19-21 తేడాతో ఓటమిపాలైంది.
కరాచీ, ఏప్రిల్ 2: ఆసియా కప్, టి-20 ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో పాకిస్తాన్ జట్టు దారుణంగా విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే, తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని 82 ఏళ్ల షహర్యార్ స్పష్టం చేశాడు.
ముంబయి, ఏప్రిల్ 1: ప్రతి సారీ మీడియా వాళ్లు తన రిటైర్మెంట్ గురించి ప్రశ్నించడంతో విసిగిపోయిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురువారం రాత్రి మీడియా సమావేశంలో అ ప్రశ్నకు విచిత్ర రీతిలో తనదైన శైలిలో స్పందించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అయితే ధోనీ దాడికి బలయింది ఒక ఆస్ట్రేలియా జర్నలిస్టు కావడం కాకతాళీయం.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: మన దేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్ పోటీలు నిర్వహించేందుకు గల అవకాశాలపై స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో శుక్రవారం చర్చలు జరిపాడు. అంతేకాకుండా న్యూఢిల్లీలో జూన్ 11వ తేదీన జరిగే డబ్ల్యుబిఓ ఆసియా టైటిల్ ఫైట్లో తన పోరాటాన్ని వీక్షించేందుకు రావలసిందిగా కేజ్రీవాల్ను విజేందర్ సాదరంగా ఆహ్వానించాడు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ప్రపంచ టి-20 టోర్నమెంట్లో మహేంద్ర సింగ్ ఒక ఆటగాడిగా, ఒక కెప్టెన్గా రాణించిన తీరును గమనించినట్లయితే అతను భారత జట్టు కెప్టెన్గా తన కెరీర్ను మరి కొనే్నళ్లు కొనసాగించగలడనిపిస్తోందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయ పడ్డాడు. ‘టి-20లో అతను ఫామ్లో ఉన్నాడనే నేను అనుకుంటున్నాను. అంటే ఒక ఆటగాడిగా, ఒక కెప్టెన్గా అని అర్థం.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: టీమిండియా డైరెక్టర్గా రవిశాస్ర్తీ కాంట్రాక్టు ముగిసిందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ప్రకటించాడు. అయితే అతని కాంట్రాక్టును పొడిగించాలా? లేదా?
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ టోర్నమెంట్లో ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ శుక్రవారం ఇక్కడి సిరి ఫోర్ట్ స్టేడియంలో జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కొరియాకు చెందిన సంగ్ జీ హ్యున్పై అద్భుతంగా పోరాడి విజయం సాధించింది.
ముంబయి, మార్చి 31: బ్యాటింగ్కు అనుకూలించిన మొహాలీ పిచ్పై టీ మిండియా బొల్తా కొట్టింది. కోట్లాది మంది అభిమానులను నిరాశపరచిం ది. సునాయాసంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్లో బౌలర్ల వైఫల్యం భార త్ను నిలువునా ముంచేసింది. ఏమాత్రం ఆసక్తిని రేపకుండా చప్పగా సాగి న సెమీ ఫైనల్లో వెస్టిండీస్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించగా, టైటిల్ ఫేవరిట్ భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
క్వియాన్ (చైనా), మార్చి 31: రియో ఒలింపిక్స్లో పాల్గొనే అర్హతను శివ్ ధాపా సంపాదించగా, ఐదు పర్యాయాలు ప్రపంచ చాంపియన్గా నిలిచిన లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, టాప్ సీడ్ మేరీ కోమ్కు నిరాశ తప్పలేదు. రియోకు ఆమె క్వాలిఫై కాలేకపోయింది. పురుషుల 56 కిలోల విభాగంలో పోటీపడిన శివ సెమీ ఫైనల్లో కైరత్ యెరాలియెవ్ (కజకస్థాన్)పై విజయం సాధించి ఫైనల్ చేరుకున్నాడు.