S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/01/2016 - 04:27

ముంబయి, మార్చి 31: మహిళల టి-20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఆరు పరుగుల తేడాతో ఓడించింది. విండీస్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన కివీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేయగలిగింది. బ్రిట్నీ కూపర్ 61 పరుగులు సాధించి, వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

03/31/2016 - 04:38

ముంబయి, మార్చి 30: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ రెండో సెమీ ఫైనల్‌లో భారత్, వెస్టిండీస్ జట్లు ఢీకొంటున్నప్పటికీ, పోరు మాత్రం ఇరు జట్ల స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ మధ్యే ఉంటుందనేది వాస్తవం. ఇద్దరూ ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించగల సమర్థులే. జట్లు తమపై ఆధారపడేలా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న వారే.

03/31/2016 - 04:37

ముంబయి, మార్చి 30: కాలి మడమ గాయంతో బాధపడుతున్న భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గురువారం వెస్టిండీస్‌తో జరిగే టి-20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఆడడం లేదు. మొహాలీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని కాలు బెణికింది. అతను పూర్తిగా కోలుకోలేదని, ఫిట్నెస్ లేనందున అతను ఈ టోర్నీలో కొనసాగడం అనుమానంగానే కనిపిస్తున్నది.

03/31/2016 - 04:36

న్యూఢిల్లీ, మార్చి 30: టి-20 వరల్డ్ కప్ పురుషుల విభాగంలో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ చేరడంలో విఫలమైనప్పటికీ, మహిళల జట్టు వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరి అభిమానులకు ఊరటనిచ్చింది. బుధవారం చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన సెమీ ఫైనల్‌లో ఈ జట్టు 5 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేయగలిగింది.

03/31/2016 - 04:35

న్యూఢిల్లీ, మార్చి 30: సిరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ మొదటి రౌండ్‌లో సహచర క్రీడాకారిణి తన్వీ లాడ్‌ను 21-7, 21-13 తేడాతో ఓడించిన భారత్ సూపర్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. అయితే, పురుషుల సింగిల్స్‌లో హైదరాబాదీ కిడాంబి శ్రీకాంత్ ఓటమిపాలై నిష్క్రమించాడు.

03/30/2016 - 05:27

గెన్ట్ (బ్లెజయం), మార్చి 29: గెంట్ వెవెల్గెమ్ క్లాసిక్ రేస్‌లో పోటీపడిన స్థానిక సైక్లిస్టు ఆంటోనీ డిమోటీ గుండె పోటుతో మృతి చెందాడు. పీటర్ సగాన్ విజయం సాధించిన ఈ రేసు జరుగుతున్నప్పుడు ఒకానొక దశలో కొంత మంది సైక్లిస్టులు ఒకరినొకరు ఢీకొన్నారు. ఈ సంఘటనలో డిమోటీసహా చాలా మంది కిందపడ్డారు. మిగతా వారు చిన్నపాటి గాయాలతో బయటపడగా, 25 ఏళ్ల డిమోటీ గుండె పోటుకు గురయ్యాడు.

03/30/2016 - 05:29

దుబాయ్, మార్చి 29: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన తాజా టి-20 ర్యాంకింగ్స్ బ్యాట్స్‌మెన్ విభాగంలో భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. అతను 871 పాయింట్లు సంపాదించగా, ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ (803 పాయింట్లు), మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్/ 762 పాయింట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు.

03/30/2016 - 05:25

మియామీ, మార్చి 29: మియామీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి సూపర్ స్టార్లు సెరెనా విలియమ్స్, ఆండీ ముర్రే అనూహ్యంగా నిష్క్రమించారు. మహిళల సింగిల్స్ నాలుగోరౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ సెరెనాపై స్వెత్లానా కుజ్నెత్సొవా 6-7, 6-1, 6-2 తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది. మొదటి సెట్‌లో తీవ్రంగా పోరాడి గెలిచిన సెరెనా మిగతా రెండు సెట్లలో అదే స్థాయిలో ఆడలేకపోయింది.

03/30/2016 - 05:24

న్యూఢిల్లీ, మార్చి 29: పురుషుల విభాగంలో జరిగే థామస్ కప్‌లో భారత బాడ్మింటన్ జట్టుకు సులభమైన డ్రా దక్కింది. అయితే, ఉబేర్ కప్ కోసం పోటీపడే మహిళల కోసం జటిలమైన డ్రా ఎదురు చూస్తున్నది. చైనాలోని జియాంగ్‌షూ ప్రావీన్స్ కున్‌షాన్‌లో మే 15 నుంచి 22వ తేదీ వరకు థామస్, ఉబేర్ కప్ పోటీలు జరగనున్నాయ. థామస్ కప్‌లో ఇండోనేషియా, థాయిలాండ్, హాంకాంగ్‌తో కలిసి భారత్ గ్రూప్ ‘బి’ నుంచి పోటీపడుతున్నది.

03/30/2016 - 05:23

న్యూఢిల్లీ, మార్చి 29: క్రికెట్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)ను మహిళల విభాగంలోనూ నిర్వహిం చాలన్న డిమాండ్ పెరుగుతున్నది. ఆస్ట్రేలియాలో పేరుప్రతిష్ఠలు సంపాదించిన బిగ్‌బాష్‌తోపాటు ఇంగ్లాండ్‌లో జరిగే సూపర్ లీగ్ పోటీల్లోనూ మ హిళలకు స్థానం దక్కింది.

Pages