S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/30/2016 - 05:22

న్యూఢిల్లీ, మార్చి 29: లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయభేరి మోగించి, టాపర్‌గా నిలిచిన న్యూజిలాండ్ స్పిన్ విభాగంపైనే ఇంగ్లాండ్ దృష్టి పెట్టింది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో బుధవారం జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ స్పిన్ గెలుస్తుందా లేక ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆధిపత్యమే కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్‌కి అన్ని విధాలా సిద్ధమైనట్టు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు.

03/30/2016 - 05:21

కరాచీ, మార్చి 29: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో జట్టు వైఫల్యాలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) తీవ్ర అసంతృప్తితో ఉంది. కాగా, పిసిబి ఆదేశం ప్రకారం ఈమెగా టోర్నీలో జట్టు ప్రదర్శనపై వివరాలతో కూడిన నివేదికను కోచ్, మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ సమర్పించాడు. ఈ విషయాన్ని పిటిఐతో మాట్లాడిన పిసిబి అధికారులు ధ్రువీకరించారు. వకార్ నుంచి నివేదిక అందిందని తెలిపారు.

03/29/2016 - 05:32

న్యూఢిల్లీ, మార్చి 28: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన అత్యంత కీకలమైన టి-20 వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించిన విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. ఎక్కడ చూసినా అతని నామస్మరణే. ఫైనల్‌ను గెల్చుకొని, ట్రోఫీని అందుకున్న తీరులో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.

03/29/2016 - 05:32

మొహాలీ, మార్చి 28: దూకుడుగా ఆడడాన్ని మరచిపోవద్దని యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హితవు పలికాడు. ఇటీవల కాలంలో కోహ్లీ ప్రశాంతను అలవాటు చేసుకుంటున్నాడని ఒక ఇంటర్వ్యూలో ధోనీ అన్నాడు. ఉద్వేగానికి గురికాకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతామని చెప్పాడు.

03/29/2016 - 05:31

మొహాలీ, మార్చి 28: టి-20 వరల్డ్ కప్‌లో ఆదివారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ భారత్‌ను విజయపథంలో నడిపించిన తీరును ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కొనియాడాడు. కోహ్లీ ఒక అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని కితాబునిచ్చాడు. బ్యాటింగ్ చేసేందుకు చాలా కష్టంగా మారిన వికెట్‌పై కోహ్లీ విజృంభణను ఎవరూ ఊహించలేదని చెప్పాడు. ‘అసాధ్యంగా కనిపించిన విజయాన్ని కోహ్లీ సుసాధ్యం చేసి, మా జట్టును దెబ్బతీశాడు.

03/29/2016 - 05:31

న్యూఢిల్లీ, మార్చి 28: బాలీవుడ్ నటి అనుష్క శర్మను విమర్శించడం సిగ్గుచేటని భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతి విషయానికీ అనుష్క పేరును మధ్యలోకి తీసుకురావడం సోషల్ మీడియాలో ఫ్యాషన్‌గా మారిందని, ఇలాంటి వారంతా విద్యావంతులని చెప్పుకోవడానికి సిగ్గుపడాలని మండిపడ్డాడు. క్రికెట్‌తో ఏమాత్రం సంబంధం లేని ఆమెను తరచు విమర్శించడంలో అర్థం లేదన్నాడు.

03/29/2016 - 05:29

మొహాలీ, మార్చి 28: షేన్ వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం విరాట్ కోహ్లీ పరుగుల హోరులో కలిసిపోయింది. టి-20 వరల్డ్ కప్‌తోనే తన కెరీర్ ముగుస్తుందని వాట్నస్ ఇది వరకే ప్రకటించాడు. ఈటోర్నీలో ఆస్ట్రేలియా సెమీస్ చేరుకోలేకపోవడంతో, ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్ అతనికి కెరీర్‌లో చివరిది. భవిష్యత్తులో అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్), బిగ్‌బాష్ టోర్నీల్లో మాత్రమే కనిపిస్తాడు.

03/29/2016 - 05:29

న్యూఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నుంచి దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మభూషణ్ అవార్డును స్వీకరిస్తున్న భారత బాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ సైనా నెహ్వాల్. ఈ అవార్డును ఆమె గత ఏడాదే ఊహించింది. అయతే తన పేరు లేకపోవడంతో విమర్శలు గుప్పించింది. అవార్డుకు తాను అర్హురాలినికానా అని ప్రశ్నించింది.

03/29/2016 - 05:27

న్యూఢిల్లీ, మార్చి 28: ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ టైటిళ్ల పై భారత స్టార్లు కనే్నశారు. మంగళవారం నుంచి క్వాలిఫయర్స్‌తో ప్రారం భం కానున్న ఈ టోర్నీ పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ ఫేవరిట్స్‌గా బరిలోకి దిగనున్నారు. కాలి మడమ గాయం కారణంగా ఇటీవల కాలంలో కొన్ని టోర్నీల నుంచి వైదొలగిన సైనా పూర్తి ఫిట్నెస్‌తో ఉందా లేదా అన్నది ఇంకా తెలియడం లేదు.

03/29/2016 - 05:26

మియామీ, మార్చి 28: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకొవిచ్ ఇక్కడ జరుగుతున్న మియామీ ఓపెన్ టెన్నిస్‌లో ప్రీ క్వార్టర్స్ చేరాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో అతను 33వ ర్యాంక్ ఆటగాడు జవో సౌసాను 6-4, 6-1 తేడాతో చిత్తుచేశాడు. జొకొవిచ్ విజృంభణకు సౌసా నుంచి ఏ దశలోనూ ప్రతిఘటన ఎదురుకాలేదు.

Pages