-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
బసెల్: స్విస్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్ లో ప్రపంచ మాజీ నంబర్ వన్ లీ చాంగ్ వెయ్ని ఓడించిన జెయంట్ కిల్లర్ సాయ ప్రణీత్తోపాటు అజయ్ జయరామ్, స మీర్ వర్మ కూడా మొదటి రౌండ్ను పూర్తి చేశారు. ప్రణీత్ 21- 14, 13-21, 21-6 తేడాతో మథియాస్ బోనీని ఓడించాడు. జి యాన్ షియాన్పై జయరామ్, కొజొనెన్పై ప్రయణ్ గెలిచారు.
మహిళల టి-20 వరల్డ్
కోల్కతా: తనదైన రోజున ఎంతటి విధ్వంసాన్ని సృష్టింగలనన్న విషయాన్ని వెస్టిండీస్ సూపర్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ మరోసారి రుజువు చేశాడు. టి-20 వరల్డ్ కప్లో బుధవారం జరిగిన గ్రూప్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై విండీ స్కు మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లు చేజార్చుకొని 182 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరును సాధించింది.
నాగపూర్: ఒక మ్యాచ్లో ఓడినంత మాత్రాన అదే ఫలితాన్ని గురించి ఆలోచించడం వల్ల లాభం ఉండదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. టి-20 వరల్డ్ కప్ చాంపియన్షిప్లో హాట్ ఫేవరిట్గా బరిలోకి దిగిన భారత్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ను ఎదుర్కొని ఓడిన విషయం తెలిసిందే. కివీస్ను 127 పరుగులకే కట్టడి చేసినప్పటికీ, బ్యాట్స్మెన్ మూకుమ్మడిగా విఫలం కావడంతో భారత్ 79 పరుగుకే ఆలౌటైంది.
కోల్కత:టీ-20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా బుధవారం కోల్కతాలో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై పాకిస్తాన్ భారీ విజయంతో శుభారంభం చేసింది. టాస్నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ ధాటీగా ఆడి 201 పరుగులు చేసింది. 202 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆదిలోనే వికెట్లుకోల్పోయి కష్టాల్లో పడింది. మధ్యలో నిలకడగా ఆడినప్పటికి అనుభవలేమితో ఓటమిపాలైంది.
నాగపూర్: టి-20 ప్రపంచ కప్ చాంపియన్షిప్లో హాట్ ఫేవరిట్ ముద్ర వేయించుకున్న భారత్కు ‘అండర్ డాగ్’ న్యూజిలాండ్ షాకిచ్చింది. 47 పరుగుల తేడాతో చిత్తుచేసి, ఈ టోర్నీలో భారత్పై ఆధిపత్యాన్ని కొనసాగించింది. గతంలో నాలుగు పర్యాయాలు టి-20 వరల్డ్ కప్లో కివీస్ను ఢీకొన్న భారత్ అన్ని మ్యాచ్లనూ ఓడింది. తాజాగా మరో ఓటమిని మూటగట్టుకుంది.
ఇండియన్ వెల్స్ (అమెరికా): ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారుడు ఆండీ ముర్రేకు ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ పిఎన్బి పరిబాస్ టెన్నిస్ టోర్నమెంట్ మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. ఫెడెరికో డెల్బోసిస్ను ఢీకొన్న అతను 4-6, 6-4, 6-7 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీలో పాల్గొంటున్న డెల్బోసిస్ తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని సాధించి, ప్రీ క్వార్టర్స్లోకి అడుగుపెట్టాడు.
కోల్కతా: ఇటీవల ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో బంగ్లాదేశ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవడానికి తహతహలాడుతున్నది. టి-20 వరల్డ్ కప్లో బుధవారం జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించి, టోర్నీలో శుభారంభం చేయాలన్న పట్టుదలతో ఉంది. భారత్ను పొగిడినందుకు స్వదేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ షహీద్ అఫ్రిదీకి ఈ మ్యాచ్ కీలకం కానుంది.
బర్మింగ్హామ్, మార్చి 14: బాడ్మింటన్లో ‘వింబుల్డన్’గా పేర్కొనే ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్లో నొజోమీ ఒకుహరా విజేతగా నిలిచింది. మహిళల ఫైనల్లో హాట్ ఫేవరిట్ వాంగ్ షిజియాన్ (చైనా)పై జపాన్కు చెందిన ఒకుహరా 21-11, 16-21, 21-19 ఆధిక్యంతో విజయం సాధించి, కెరీర్లో తొలిసారి ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ను అందుకుంది.