-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
బర్మింగ్హామ్, మార్చి 10: గాయాల కారణంగా పలు టోర్నీలకు గైర్హాజరైన ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్షిప్ మొదటి రౌండ్లో మిచెలె లీని 21-17, 21-12 తేడాతో ఓడిం చింది. రెండో రౌండ్లో బుసానన్ ఆన్బుంరంగ్ను 21-16, 21-9 తేడాతో చిత్తుచేసి ముందంజ వేసింది.
సింధు అవుట్
కోల్కతా: వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న భారత క్రికెట్ జట్టు టి-20 వరల్డ్ కప్లో భాగంగా గురువారం వెస్టిండీస్తో జరిగే వామప్ మ్యాచ్కి సిద్ధమైంది. అన్ని విభాగాల్లోనూ పట్టిష్టంగా ఉన్న కారణంగా, బెంచ్ బలాన్ని బేరీజు వేసుకోవడానికి ఈ మ్యాచ్ని ఒక వేదికగా స్వీకరించాలని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే అతను కొన్ని ప్రయోగాలు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.
కోల్కతా: ఉత్కంఠ రేపుతున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఈనెల 19న ధర్మశాలలో జరగాల్సిన టి-20 ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్ కోల్కతాలోనీ ఈడెన్ గార్డెన్స్కు మారింది. ధర్మశాలలో మ్యాచ్ జరిగే భద్రత కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్భద్ర సింగ్ చేతులెత్తేయగా, అవసరమైతే పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్భద్ర సింగ్ వైఖరి వల్లే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో ఈనెల 19న జరగాల్సిన టి-20 ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్పై చివరి వరకూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తాడు. ప్రతిష్ఠాత్మకమైన ఈ టోర్నీ షెడ్యూల్ ఏడాది క్రితమే ఖరారైందని, ఆరు నెలల ముందు వేదికలను కూడా ప్రకటించామని విలేఖరులతో మాట్లాడిన అతను గుర్తుచేశాడు.
న్యూఢిల్లీ: ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ కోల్కతాకు మారడాన్ని పిసిబి స్వాగతించింది. ఈ మార్పుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అయతే, జట్టును భారత్కు పంపేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ జట్టు బుధవారానికే ఇక్కడికి చేరుకోవాలి. 17న ధర్మశాలకు బయలుదేరాలి.
ముంబయి: టి-20 వరల్డ్ కప్ను కైవసం చేసుకునే సత్తా భారత్కే ఎక్కువగా ఉందని ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ బెన్ స్టోక్స్, స్పిన్నర్ మొయిన్ అలీ జోస్యం చెప్పారు. బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీమిండియా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందని అన్నారు. స్వదేశంలో టోర్నీ జరగడం కూడా ఆ జట్టుకు లాభించే అంశమని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ని ధర్మశాల నుంచి కోల్కతాకు మార్చినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ స్పష్టం చేశాడు. బుధవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో అతను మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మ్యాచ్ని మరో వేదికకు మార్చేందుకు అంగీకరించామని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆటగాళ్లందరిపైనా నిఘా ఉంటుందన్నాడు.
న్యూఢిల్లీ: భారత టెస్టు జట్టు కెప్టెన్, యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీపై ‘ఆజ్ తక్ సలాం క్రికెట్’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. ఒకరు అతనిని జావేద్ మియందాద్, టెన్నిస్ మాజీ సూపర్ స్టార్ జాన్ మెకెన్రోతో పోలిస్తే మరొకరు టీమిండియాలో మిగతా ఆటగాళ్లు ఎవరికీ లేని ప్రత్యేక, గౌరవం, ప్రధాన్యం కోహ్లీకి మాత్రమే ఉన్నాయని అన్నాడు.
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ తనకు టెన్నిస్ మాజీ సూపర్ స్టార్ జాన్ మెకెన్రోను గుర్తుతెస్తున్నాడని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. మెకెన్రో తరచు ప్రత్యర్థి ఆటగాళ్లతో, అంపైర్లతో ఘర్షణకు దిగేవాడని అన్నాడు. ఈ విధంగా సవాళ్లు విసురుతూ, సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు దూసుకెళ్లడం వల్ల ఆట కొత్తపుంతలు తొక్కుతుందని అన్నాడు.