-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్కలమ్ తన కెరీర్లో ఆఖరి పోరాటానికి సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ తర్వాత అతను కెరీర్కు గుడ్బై చెప్పనున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఇక్కడి బేసిన్ రిజర్వ్ మైదానంలో మొదలయ్యే మొదటి టెస్టు మెక్కలమ్కు కెరీర్లో వందోది. ఈ సిరీస్ను సాధించి, కెరీర్ను విజయంతో ముగించాలని మెక్కలమ్ పట్టుదలగా ఉన్నాడు.
న్యూఢిల్లీ: భారత్లో జరిగే టి-20 ప్రపంచ కప్ చాంపియన్షిప్లో ఆడాలా? వద్దా? అనే విషయంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ప్రకటించింది. పాక్తో ద్వైపాక్షిక సిరీస్లకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేయకపోవడంతో, చాలాకాలంగా ఇరు దేశాల మధ్య దూరం పెరుగుతూ వస్తున్నది.
ఢాకా-అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ పోటీల ఫైనల్లో భారత్తో వెస్టిండీస్ జట్టు తలపడనుంది. ఈనెల 14న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో తలపడిన వెస్టిండీస్ విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఢాకాలో గురువారం ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. 226 పరుగులకు ఆలౌట్కాగా వెస్టిండీస్ జట్టు 48.4 ఓవర్లలో ఏడువికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
గౌహతి: దక్షిణాసియా క్రీడోత్సవాలు(శాగ్)లో బుధవారం అయిదో రోజు కూడా భారత్ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. షూటర్లు, ఉషు క్రీడాకారులు, అథ్లెట్లు ఎదురులేని రీతిలో బంగారు పతకాలలో అత్యధిక భాగం దక్కించుకున్నారు. దీంతో 117 బంగారు, 61 రజతం, 16 కాంస్యం- మొత్తం 194 పతకాలతో భారత్ తిరుగులేని తీరులో అగ్రస్థానంలో నిలిచింది.
న్యూఢిల్లీ: భారత్లో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనే విషయమై ఏ దేశమూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఉద్ఘాటించారు.
సెంచూరియన్: ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల వనే్డ క్రికెట్ సిరీస్లో భాగంగా ఇంతకుముందు జరిగిన రెండు మ్యాచ్లలో వరుస ఓటములను ఎదుర్కొన్న దక్షిణాఫ్రికా జట్టు మూడో వనే్డ (డే/నైట్) మ్యాచ్లో సత్తా చాటుకుంది.
కరాచీ: కళంకిత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ను మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో కలగలిపేందుకు నానా తంటాలు పడుతున్న పాకిస్తాన్ సెలెక్టర్లు అతడికి త్వరలో జరుగనున్న ఆసియా కప్, ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్లలో తలపడే తమ జట్టులో చోటు కల్పించారు. అయితే అనుభవజ్ఞుడైన ఓపెనర్ అహ్మద్ షెహజాద్తో పాటు సీనియర్ బౌలర్ ఉమర్ గుల్కు ఈ జట్టులో స్థానమివ్వకుండా పాక్ సెలెక్టర్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
లక్నో: ఎనిమిదేళ్ల క్రితం షాంఘై (చైనా)లో జరిగిన ప్రత్యేక ఒలింపిక్ క్రీడల్లో భారత్కు విశేష ప్రశంసలు తీసుకురావడంతో పాటు ‘స్పెషల్ అథ్లెట్’గా ఖ్యాతి పొందిన హమీద్ ప్రస్తుతం కూలిపని చేస్తూ అత్యంత దైన్య స్థితిలో జీవన పోరాటాన్ని సాగిస్తున్నాడు.
గౌహతి: ఇక్కడ జరుగుతున్న దక్షిణాసియా క్రీడోత్సవాల్లో(శాగ్) వరసగా నాలుగో రోజు కూడా భారత్ క్రీడాకారులు బంగారు పంట పండించారు. మంగళవారం స్విమ్మింగ్, ఆర్చరీ, ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగాల్లో ప్రకటించిన బంగారు పతకాల్లో దాదాపుగా అన్ని పతకాలను భారత క్రీడాకారులే దక్కించుకొని పతకాల పట్టికలో తిరుగులేని ఆధిక్యతతో అగ్రస్థానంలో నిలిచారు. దీంతో భారత్కు లభించిన మొత్తం పతకాల సంఖ్య 119కి చేరుకుంది.
చండీగఢ్, ఫిబ్రవరి 9: ఈ ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదవ ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్లో తలపడే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ డేవిడ్ మిల్లర్ను సారథిగా నియమించినట్లు మంగళవారం ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఐపిఎల్ నాలుగో ఎడిషన్ నుంచి మిల్లర్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.