-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: శ్రీలంకతో జరిగే టి-20 సిరీస్లో పాల్గొనే 15 మందితో కూడిన జట్టును జాతీయ సెలక్టర్లు సోమవారం ప్రకటించారు. వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతిచ్చిన సెలక్టర్లు ఆల్రౌండర్ పవన్ నేగీకి జట్టులో అవకాశం కల్పించారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగి టి-20 సిరీస్లో కోహ్లీ అద్భుతమైన ఫామ్ను కొనసాగించిన విషయం తెలిసిందే. అతను మూడు మ్యాచ్ల్లో 199 పరుగులు చేశాడు.
మాడ్రిడ్, ఫిబ్రవరి 1: రియల్ మాడ్రిడ్ తరఫున ఆడుతున్న పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి తన సత్తా చాటాడు. స్పానిష్ సాకర్ చాంపియన్షిప్ లా లిగాలో భాగంగా ఎస్పానియల్తో జరిగిన మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించి, రియల్ మాడ్రిడ్ను విజయపథంలో నడిపించాడు. లా లిగా టోర్నీలో రొనాల్డోకు ఇది 29వ హ్యాట్రిక్. కాగా ఈ విజయంతో రియల్ మాడ్రిడ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది.
న్యూఢిల్లీ: దూకుడుగా వ్యవహరించడం తనకు వారసత్వంగా వచ్చిందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. తన మాదిరిగానే తన తండ్రిది కూడా సింహ రాశేనని, అందుకే ఆయనకు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుందని చెప్పాడు. అవే లక్షణాలు తనకు కూడా వచ్చాయని అన్నాడు.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
మెంటర్గా సెవాగ్
మెల్బోర్న్, ఫిబ్రవరి 1: టి-20 ప్రపంచ కప్ చాంపియన్షిప్ పోటీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, అది శుద్ధ దండగని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ ర్యాన్ హారిస్ అభిప్రాయపడ్డాడు. టి-20 ఫార్మెట్లో ఎక్కువగా మ్యాచ్లు ఆడని జట్లు పోటీపడుతున్న కారణంగా, ఈమెగా టోర్నీ వల్ల సమయం వృథా అవుతుందే తప్ప లాభమేమీ ఉండదని ఒక చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
మీర్పూర్, ఫిబ్రవరి 1: వికెట్కీపర్-బ్యాట్స్మన్ రిషభ్ పంత్ విజృంభించి 24 బంతుల్లోనే 78 పరుగులు సాధించడంతో, అండర్-19 వరల్డ్ కప్ చాంపియన్షిప్ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో నేపాల్ను చిత్తుచేసింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన భారత్ చివరి లీగ్ పోటీని వామప్ మ్యాచ్గా స్వీకరించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన నేపాల్ 48 ఓవర్లలో 169 పరుగులు సాధించింది.
సిడ్నీ, జనవరి 31: ఆస్ట్రేలియా చేతిలో వనే్డ సిరీస్ను 1-4 తేడాతో కోల్పోయిన భారత క్రికెట్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని ఈ జట్టు టి-20 సిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. చివరి క్షణం వరకూ విజయం కోసం ప్రయత్నించినప్పటికీ ఆస్ట్రేలియాకు వైట్వాష్ తప్పలేదు. చివరి బంతిని ఫోర్గా మలచిన సురేష్ రైనా విన్నింగ్ షాట్తో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.
మెల్బోర్న్, జనవరి 31: ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పరుషుల సింగిల్స్ ఫైనల్లో అతను బ్రిటిష్ ఆటగాడు, రెండో సీడ్ ఆండీ ముర్రేను 6-1, 7-5, 7-6 ఆధిక్యంతో ఓడించాడు. మొదటి సెట్ను సులభంగానే గెల్చుకున్న జొకోవిచ్కు తర్వాతి రెండు సెట్లలో ముర్రే నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది.
చిట్టగాంగ్, జనవరి 31: అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ 262 పరుగుల భారీ స్కోరుతో ఫిజీని చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 340 పరుగులు సాధించింది. షమెర్ స్ప్రింగర్ 106 పరుగులతో కదంతొక్కగా, గిడ్రాన్ పోప్ 76, జైదీ గులీ (66) అర్ధ శతకాలతో రాణించారు. ఫిజీ బౌలర్లలో కొకాక తికోస్వా 59 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.
లక్నో, జనవరి 31: మహిళల సింగిల్స్ టైటిల్ను రెండో సీడ్ సంగ్ జి హ్యున్ తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె ఐదో ర్యాంక్లో ఉన్న సయాకా సటోపై 12-21, 21-18, 21-18 ఆధిక్యంతో గెలుపొందింది. మొదటి సెట్ను కోల్పోయిన హ్యున్ ఆతర్వాత ఎదురుదాడికి దిగింది. సయాకా నుంచి తీవ్ర స్థాయిలో పోటీ ఎదురైనప్పటికీ సమర్థంగా ఎదురునిలిచి టైటిల్ను సొంతం చేసుకుంది.
లక్నో, జనవరి 31: ప్రతిష్ఠాత్మక సయ్యద్ మోదీ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్ను తెలుగు వీరుడు, టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. బాబూ బనారసీ దాస్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో అతను హుయాంగ్ యూజియాంగ్ను 21-13, 14-21, 21-14 తేడాతో ఓడించాడు. సుమారు గంట సేపు జరిగిన పోరులో మొదటి సెట్ను సులభంగానే గెల్చుకున్న శ్రీకాంత్కు రెండో సెట్లో ఎదురుదెబ్బ తగిలింది.