S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

11/26/2015 - 06:39

నాగపూర్, నవంబర్ 25: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరో లోస్కోరింగ్ మ్యాచ్ తప్పదని స్పష్టమవుతున్నది. బుధవారం మూడో టెస్టు ఆరంభంకాగా, మొదటి రోజునే 12 వికెట్లు కూలాయి. భారత్ 215 పరుగులకు ఆలౌటైతే, ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి కేవలం పది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. పిచ్‌పై బంతి అనూహ్యంగా దిశను మార్చుకుంటుందని, ఫలితంగా బౌలర్లకు ఇది అనుకూలిస్తుందని అర్థమవుతోంది.

11/26/2015 - 06:37

న్యూఢిల్లీ, నవంబర్ 25: జాతీయ కోచ్ స్టీఫెన్ కాన్‌స్టాంటైన్‌ను వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగించాలని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్‌ఎఫ్) నిర్ణయించింది. 2018 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నప్పటికీ, అతనిపైనే సమాఖ్య నమ్మకం ఉంచడం విశేషం.

11/26/2015 - 06:36

కరాచీ, నవంబర్ 25: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్) క్రికెట్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు పాల్గొనడంపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా సూచన ప్రాయంగా ప్రకటన చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నుంచి అలాంటి ప్రతిపాదన ఏదైనా వస్తే ఆ అంశాన్ని ఆలోచిస్తామని చెప్పాడు. ఇప్పటి వరకూ అలాంటి ప్రతిపాదన ఏదీ తమకు రాలేదని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శుక్లా చెప్పాడు.

11/26/2015 - 06:35

కోల్‌కతా, నవంబర్ 25: లెజెండరీ టెన్నిస్ స్టార్ మార్టినా నవ్రతిలోవా, లియాండర్ పేస్ జోడీపై సానియా మీర్జా, మహేష్ భూపతి జోడీ 7-5, 7-5 తేడాతో విజయం సాధించింది. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్)ను ప్రమోట్ చేసేందుకు ఇక్కడ జరిగిన ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మ్యాచ్ ఆరంభించేందుకు వచ్చి, కొద్దిసేపు సరదాగా టెన్నిస్ ఆడింది.

11/26/2015 - 06:34

పారిస్, నవంబర్ 25: యూరోపియన్ ఫుట్‌బాల్ సమాఖ్య (యూఫా) ఆధ్వర్యంలో జరుగుతున్న చాంపియన్స్ లీగ్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ బార్సిలోనా ప్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో గ్రూప్ టాపర్‌గా ఉన్న బార్సిలోనా 6-1 తేడాతో రోమాను చిత్తుచేసి, ఎలాంటి ఇబ్బంది లేకుండా లాస్ట్-16లో చోటు దక్కించుకుంది.

11/26/2015 - 06:33

కొచ్చి, నవంబర్ 25: బాలురు, బాలికలకు వేరువేరు కేంద్రాల్లో విడివిడిగా పోటీలను నిర్వహించాలని భారత పాఠశాల క్రీడల సమాఖ్య (ఎస్‌జిఎఫ్‌ఐ) తీసుకున్న నిర్ణయంపై మాజీ అథ్లెట్ పిటి ఉష ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివక్ష ఎందుకని అధికారులను నిలదీసింది. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.

11/25/2015 - 06:13

టీమిండియా కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్య

11/25/2015 - 06:12

న్యూఢిల్లీ, నవంబర్ 24: భారత్‌తో స్వదేశంలోగానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోగానీ ద్వైపాక్షిక సిరీస్ జరిగే అవకాశం లేకపోయినప్పటికీ, తటస్థ వేదికగా శ్రీలంకను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఎంపిక చేసే అవకాశం ఉందన్న వార్త పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి ఊరటనిస్తోంది. సహజంగా వేదిక మారినప్పుడు ప్రసార హక్కులకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.

11/25/2015 - 06:11

ఢిల్లీపై చెనె్నయిన్ గెలుపు

11/25/2015 - 06:11

కోల్‌కతా, నవంబర్ 24: సుందర్ వాషింగ్టన్ ఆల్‌రౌండ్ ప్రతిభను కనబరచడంతో, అండర్-19 ముక్కోణపు వనే్డ సిరీస్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ని నాలుగు వికెట్ల తేడాతో గెల్చుకున్న భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఓపెనర్లు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ మొదటి వికెట్‌కు కేవలం 33 బంతుల్లోనే 67 పరుగులు జోడించి భారత్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు.

Pages