S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/24/2020 - 01:24

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న నలుగురు ఆర్మీ ఆఫీసర్లకు జాతీయస్థాయి అవార్డులు లభించాయి. ముంబాయిలో రెండురోజుల క్రితం ఏర్పాటు చేసిన సమావేశంలో అవార్డులను సదర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సీపీ మోహంతి అందచేశారు.

02/24/2020 - 01:02

వరంగల్, ఫిబ్రవరి 23: ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని, భాష, భావన వేర్వేరుగా చూడలేమని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం వరంగల్ నగరంలోని ఆంధ్ర విద్యాభివర్ధిని విద్యాసంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

02/24/2020 - 02:34

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యుత్ సంస్థల ఉద్యోగుల విభజన వివాదంపై జస్టిస్ ధర్మాధికారి ఆదివారం తన నిర్ణయాన్ని వెలువరించారు. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న మీదట దీనిపై ప్రాథమిక నివేదికను వారం రోజుల్లో ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇదే చివరి సమావేశం అంటూ ఏక సభ్య కమిటీ ధర్మాధికారి స్పష్టం చేయడంతో విద్యుత్ ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది.

02/23/2020 - 05:08

రాజేంద్రనగర్: రైతులు, పరిశోధకులు, శాస్తవ్రేత్తలు సంయుక్తంగా కృషి చేసి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కొత్త విధానాలు, ఇన్నోవేషన్స్ కనుగొనడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రొ.

02/23/2020 - 04:53

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 22: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అర్థరాత్రి నిర్వహించిన నందిసేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతేడాదికంటే ఈసారి భక్తులు భారీగా తరలివచ్చి నంది వాహనంపై కొలువుదీరిని పరమ శివుని దర్శించుకున్నారు. అర్థరాత్రి తరువాత నంది వాహనసేవ ఊరేగింపు ప్రారంభమైనా నాలుగు వీధుల్లోను ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. ఈ ఉత్సవాన్ని నగరి ఎమ్మెల్యే రోజా తిలకించారు.

02/23/2020 - 00:15

విజయవాడ, ఫిబ్రవరి 22: ఆర్టీసీ సిబ్బంది తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులమంటూ సంబరపడుతుంటే వారెవరూ ఊహించని రీతిలో అకస్మాత్తుగా వారిని ఉక్కిరిబిక్కిరి చేసేలా శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ప్రవర్తన నియమావళి తు.చ తప్పక శనివారం నుంచే అమల్లోకి వస్తుందంటూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఇక కార్మిక సంఘాలు మీడియా ముం దు మాట్లాడరాదు.

02/21/2020 - 02:17

శ్రీకాళహస్తి: ముల్లోకాలు ఏలే ముక్కంటీశ్వరుడు హంస, చిలుక వాహనాలపై దర్శనభాగ్యం కల్పించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నాలుగో తిరుణాళ్లు జరిగాయి. దీనే్న నాగరాత్రి అని కూడా అంటారు. ఉదయం బంగారునగలతో, ప్రత్యేక పూల అలంకరణలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను, పరివార దేవతలను అలంకార మండపంలో అత్యంత సుందరంగా అలంకరింపచేశారు.

02/21/2020 - 01:48

వేములవాడ, ఫిబ్రవరి 20: దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అనుగుణంగా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే భక్తుల పాలిట కొంగుబంగారమై రాజన్నను దర్శించుకుని, జాగరణ చేయడానికి ఇక్కడికి భక్తులు తరలివస్తున్నారు.

02/21/2020 - 01:33

హైదరాబాద్, ఫిబ్రవరి 20: త్వరలో జాతీయ జల విధానంపై చట్టం రూపొందించి అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రాలు జల విధానంపై అభిప్రాయాలు తెలియచేయాలని కేంద్రం కోరింది. జలాలు రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశమైనందు వల్ల అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించాలని కేంద్రం నిర్ణయించింది.

02/21/2020 - 01:00

శ్రీశైలం/శ్రీశైలం టౌన్, ఫిబ్రవరి 20: మహాశివరాత్రి రోజు మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు భక్తులు లక్షల సంఖ్యలో శ్రీగిరికి చేరుకుంటున్నారు. ఓం నమఃశివాయ నామస్మరణతో శ్రీశైలం మారుమోగుతోంది. సుమారు 4 లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నట్లు తెలుస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు.

Pages