S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

02/19/2020 - 00:11

విశాఖపట్నం: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు సంబంధించి విశాఖ నగరంలో ఓ అనుమానిత కేసు నమోదైంది. విశాఖ నగరానికి చెందిన 18 ఏళ్ల మెడికల్ విద్యార్థిని చైనాలో చదువుతోంది.

02/18/2020 - 07:41

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలతో పాటు విద్యుదీకరణ రైళ్ల పరుగులకు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌గోయల్ ప్రారంభించనున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రిమోట్ వీడియో లింక్‌తో సంబంధిత కార్యక్రమాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి కిషణ్‌రెడ్డితో కలసి పీయూష్‌గోయల్ పాల్గొంటున్నారు.

02/18/2020 - 07:13

శ్రీకాళహస్తి: ముల్లోకాలను ఏలే ముక్కంటీశ్వరుడికి ధ్వజారోహణం శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం కన్నుల పండువగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు భక్తకన్నప్ప కోడి అయ్యాక స్వామివారి ధ్వజారోహణం నిర్వహిస్తుంటారు.

02/18/2020 - 00:34

తిరపతి, ఫిబ్రవరి 17: తిరుమలలో ప్లాస్టిక్ వాడకం నిషేధించడంలో భాగంగా ఇకపై తాగునీటిని గాజు సీసాలలో విక్రయించే విధానానికి టీటీడీ ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టనుంది. బుధవారం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. అయితే ఇప్పటివరకు తిరుమలలో భక్తులు రూ. 20లేదా 25 చెల్లిస్తే లీటరు నీటి బాటల్‌ను కొనుగోలు చేస్తే తన వెంట ఎక్కడికైనా తీసుకువెళ్లే అవకాశం ఉండేది.

02/17/2020 - 05:26

రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ముముక్షు గౌతమ్‌కుమార్ సన్యాస దీక్షాధారణ కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక త్యాగరాయ కళా క్షేత్రంలో జైన మునులు, మతగురువులు శాస్త్రోక్తంగా రాజమహేంద్రవరంలో తొలిసారి జైనమత సన్యాస దీక్షాధారణ క్రతువును నిర్వహించారు. ముముక్షు గౌతమ్‌కుమార్ సన్యాస దీక్ష స్వీకరించడంతో నూతన జైన మునిగా మార్పుచెందారు.

02/17/2020 - 05:22

రేణిగుంట/తిరుపతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, సీనియర్ రాజకీయ నేత అగరాల ఈశ్వర్‌రెడ్డి ఆదివారం గుండెపోటుతో తిరుపతిలో కన్నుమూశారు. తిరుపతి బాలాజీనగర్‌లో నివాసముంటున్న ఆయన గత మూడురోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతి స్విమ్స్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కాగా ఆదివారం మధ్యాహ్నం మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు.

02/17/2020 - 00:51

భైంసా రూరల్, ఫిబ్రవరి 16: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐదున్నర ఏళ్ల పాలనలో ఉగ్రవాద చర్యలకు పూర్తిగా అడ్డుకట్ట వేశామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గతనెల 12న జరిగిన విధ్వంస ఘటనలో సర్వం కోల్పోయిన బాధితులను ఆయన ఆదివారం పరామర్శించి వారితో మాట్లాడారు. మోదీ పాలనలో ఏ రాష్ట్రంలో కూడా బాంబు పేలుళ్లు, ఉగ్రవాద చర్యలు చోటుచేసుకోలేదని ఆయన అన్నారు.

02/17/2020 - 00:46

కర్నూలు, ఫిబ్రవరి 16:కోవిడ్-19 వైరస్ బారిన పడిన చైనాలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో అక్కడ చిక్కుకుపోయిన కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి చెందిన యువతి అనె్నం జ్యోతి పచ్చడి మెతుకులే పరమాన్నంగా తింటూ కాలం వెళ్లదీస్తోంది. గత 15 రోజులకు పైగా సరైన ఆహారం లేదంటూ తన తల్లి ప్రమీళమ్మకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

02/16/2020 - 05:20

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన రాష్టస్థ్రాయి సమావేశంలో పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చంచారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పనితీరుపై చర్చించారు. ఏపీలో వైసీపీ, తెలంగాణల తెరాస నేతలు టీడీపీపై చేస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

02/16/2020 - 04:32

రాజమహేంద్రవరం: జైనమత సన్యాస దీక్షాధారణ ప్రక్రియకు రాజమహేంద్రవరం వేదికైంది. ఉభయ రాష్ట్రాల్లోనూ మొట్ట మొదటి సారిగా జైనమత దీక్షా ధారణకు రాజమహేంద్రవరం వేదిక కావడం చారిత్రాత్మక విశేషత సంతరించుకుంది. ఇప్పటి వరకు రాజస్థాన్‌లోనే ఈ దీక్షా ధారణ జరిగింది. ఇపుడు రాజస్థాన్ నుంచి రాజమహేంద్రవరం వేదికైంది.

Pages