-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, జూన్ 9: ఈ సీజన్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 16 వరకు 15 జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా 16 జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా కేంద్రం హెచ్చరించింది.
హైదరాబాద్, జూన్ 9: రాష్ట్రంలో ఇటీవల కాలంలో తరచుగా వెలుగుచూస్తున్న భూకుంభకోణాలను అరికట్టేందుకు ఒక వినూత్న ప్రతిపాదనను ఉన్నతాధికారులు సిఎం దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను విలీనం చేయడం వల్ల ప్రభుత్వ భూములను అక్రమంగా విక్రయం, రిజిస్ట్రేషన్లు చేయడాన్ని నిరోధించవచ్చనే అంశాన్ని ప్రభుత్వం కూడా యోచిస్తోంది. ఈ ప్రతిపాదనను ఆర్ధిక, రెవెన్యూ శాఖలు పరిశీలిస్తున్నాయి.
హైదరాబాద్, జూన్ 9: రికార్డు సమయంలో మిడ్మానేరు ప్రాజెక్టు పనులను పూర్తిచేశారు. మిడ్మానేరు ప్రాజెక్టు పనులు 2006లో ప్రారంభించారు. పదేళ్ల కాలంలో 50 శాతం పనులు పూర్తి చేస్తే, తెలంగాణ ఏర్పడిన తరువాత 10 నెలల కాలంలో మిగతా 50 శాతం పనులు పూర్తిచేశారు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి చేసినందుకు ఇంజనీరింగ్ సిబ్బందిని నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్రావు అభినందించారు.
హైదరాబాద్, జూన్ 9: నీలి విప్లవం, హరిత విప్లవాలకు దీటుగా తెలంగాణలో నలుపు విప్లవం పురుడు పోసుకుంటోంది. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయనున్న ఈ నల్ల విప్లవానికి ఈనెల 20న రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది.
విశాఖపట్నం, జూన్ 9: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం మధ్య ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాను ఆనుకుని అల్పపీడనం ఏర్పడినట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియచేశారు. ఇది స్థిరంగా, బలంగా ఉన్నట్టు చెప్పారు. దీని ప్రభావం వలన రానున్న రెండు రోజుల్లో రాష్టమ్రంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
విశాఖపట్నం, జూన్ 9: బహుళ ప్రయోజనాలు కలిగే విధంగా భారతీయ రైల్వే సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు నిర్వహించలేక, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించలేక చతికిలపడుతున్న రైల్వే, నష్టాలను కూడా ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి గట్టెక్కే క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
విజయవాడ, జూన్ 9: ప్రధాన సర్వర్ పనిచేయకపోవటంతో రెండోరోజు శుక్రవారం కూడా రాష్టవ్య్రాప్తంగా 291 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లతో పాటు అన్నిరకాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వరుసగా రెండ్రోజులు స్థిరాస్తి క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.
అనంతపురం, జూన్ 9: తొలకరికి స్వాగతం పలుకుతూ నేలతల్లికి పూజలు చేసి విత్తనాలు విత్తేందుకు రైతన్నలు సంప్రదాయంగా నిర్వహించే ఏరువాక పౌర్ణమిని వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర పండవలా ఘనంగా నిర్వహిస్తామని సిఎం చంద్రబాబు ప్రకటించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74-ఉడేగోళంలో శుక్రవారం నిర్వహించిన ఏరువాక పౌర్ణమిలో సిఎం పాల్గొన్నారు.
విజయవాడ, జూన్ 9: ఆంధ్రప్రదేశ్లో ఏరువాక దిగ్విజయంగా సాగుతోందని, వర్షాలు బాగా పడి రాష్ట్రం కళకళలాడాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం కలిసిన ఆయన, ఈ నెల 18న జరగనున్న తన కుమారుడి పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందచేశారు.
అమరావతి, జూన్ 9: ఏటా లక్షలు ధారపోసి పిల్లలను కార్పొరేట్ స్కూ ళ్లు, కాలేజీల హాస్టళ్లకు పంపితే అక్కడ జరిగే సంఘటనలకు యాజమాన్యాల బాధ్యత ఉండదట. ఆ మేరకు తలిదండ్రులు డిక్లరేషన్ ఇస్తేనే పిల్లలను హాస్టళ్లలో చేర్చుకుంటారట. పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలపై చర్య తీసుకోలేని దుస్థితి ప్రభుత్వాల్లో నెలకొంది.