S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/18/2017 - 04:49

హైదరాబాద్, మే 17: దేశంలోనే గ్రేహౌండ్స్ రోల్‌మోడల్‌గా నిలిచారని, ఆక్టోపస్‌లో ఎక్కువశాతం టిఎస్‌ఎస్‌పి అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారని డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా మన శిక్షణ, విధి విధానాలను అడిగి తెలుసుకుంటున్నారని, అలాంటి వ్యవస్థలో పోలీసులు పనిచేయడం అదృష్టంగా భావించాలని డిజిపి అన్నారు.

05/17/2017 - 02:15

హైదరాబాద్, మే 16: రాష్ట్ర ఆదాయానికి గండికొట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సిఎం కెసిఆర్ హెచ్చరించారు. అవినీతిని అరికట్టే విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికీ అక్కడక్కడా ఇంకా అవినీతి చోటుచేసుకుంటున్నదంటే అది గత ప్రభుత్వాల అవలక్షణమేనని వ్యాఖ్యానించారు.

05/17/2017 - 02:12

హైదరాబాద్, మే 16: ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చి వరకు కొనసాగే ప్రస్తుత విధానానికి స్వస్తి పలకాలని సిఎం కె చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు. క్యాలండర్ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నట్టుగానే ఆర్థిక సంవత్సరం లెక్కించడంలోనూ అదే విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం భావిస్తుంది.

05/17/2017 - 02:10

హైదరాబాద్, మే 16: నాలుగువేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు యాదాద్రికి పర్యావరణ అనుమతులు లభించాయ. గత ఏడాదే ప్రాజెక్టు పనులు ప్రారంభం కావాల్సిఉండగా, పర్యావరణ అనుమతులు లభించక ముందుకు సాగలేదు. పర్యావరణ అనుమతులు లభించడంతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.

05/17/2017 - 02:07

హైదరాబాద్/అమరావతి, మే 16: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ఎండలు మండిపోయాయి. భానుడి ప్రతాపానికి జనం విలివిలలాడారు. బాపట్లలో 46.3 డిగ్రీల సెల్సియస్ నమోదై ఉభయరాష్ట్రాల్లో టాప్‌లో నిలిచింది. విజయవాడ 46.2 డిగ్రీలతో రెండోస్థానంలో నిలిచింది. విజయవాడలో ఇంత ఉష్ణోగ్రత నమోదు కావడం ఈ సీజన్‌లో ఇదే మొదటిసారి. ఎపి, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 44 నుండి 45 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

05/17/2017 - 02:03

పలమనేరు/కుప్పం, మే 16: చిత్తూరు జిల్లాలోని కుప్పం -పలమనేరు పరిసర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో పిడుగులు పడతాయని జాతీయ వివత్తు నిర్వహణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాగం అప్రమత్తమైంది. వివత్తు శాఖ ముందస్తు హెచ్చరికలతో నష్టం తీవ్రత గణనీయంగా తగ్గింది. పిడుగుకు సంబంధించి హెచ్చరికలు వచ్చిన అర్ధగంట వ్యవధిలో కుప్పం సమీపంలోని కాకిమడుగు, కొత్తపల్లి గ్రామాల సమీపంలోని పంట పొలాల్లో రెండు పిడుగులు పడ్డాయి.

05/17/2017 - 02:01

విజయవాడ (పాతబస్తీ), మే 16: మతిస్థిమితం లేని ఒక వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేటు ఎత్తివేయటంతో లక్షలాది గ్యాలన్ల నీరు వృథాగా దిగువకు ప్రవహించింది. గేట్లకు మరమ్మతులు చేస్తున్న ఇరిగేషన్ సిబ్బంది పరుగు పరుగున వచ్చి పరిస్థితి చక్కదిద్దారు. అప్పటికే కనీసం 15 రోజుల పాటు రెండు నగరాల ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు సరిపడా నీరు వృథా పోయింది.

05/17/2017 - 01:58

విజయవాడ, మే 16: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి మూజువాణి ఓటుతో ఆమోదించాయి. కేవలం 25నిమిషాలలో జీఎస్టీ బిల్లుపై చర్చ, ఆమోద ప్రక్రియ ముగిసింది. మంగళవారం జరిగిన ఉభయ సభల సమావేశాల్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బిల్లు ప్రవేశపెట్టారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఉదయం 9.45 నిమిషాలకు ప్రారంభమైంది.

05/17/2017 - 01:55

విజయవాడ, మే 16: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధును సబ్ కలెక్టర్‌గా నియమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో పివి సింధు ఎంతో ప్రతిభ చూపిందని, ఆమెకు ముందుగా ప్రకటించిన విధం గా గ్రూప్-1 ఉద్యోగంలో భాగంగా సబ్ కలెక్టర్‌గా నియమిస్తామని చెప్పారు.

05/17/2017 - 01:47

ఖమ్మం, మే 16: నక్సల్స్‌ను ఏరివేసేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన సమాధాన్ తొలి ఆపరేషన్ విజయం సాధించింది. బిజాపూర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది నక్సలైట్లు మృతిచెందినట్టు విశ్వసనీయ సమాచారం. రెడ్‌జోన్‌గా ఉన్న ఈ ప్రాంతం నుంచి నక్సల్స్‌ను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఇటీవల ప్రత్యేక పారా మిలటరీ దళాలను, కోబ్రా దళాలను మోహరించారు. గత వారంరోజులుగా విస్తృతంగా కూంబిగ్ జరుపుతున్న పోలీసులకు..

Pages