S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/14/2017 - 02:44

విజయవాడ (క్రైం), మే 13: ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో జరిగిన సైబర్ దాడుల ప్రభావం ఏపిలో పోలీసుశాఖపై పడింది. అంతా సేఫ్ అని ఉన్నతాధికారులు చెబుతున్నా.. పోలీసు కంప్యూటర్ వ్యవస్థకు దాదాపు అంతరాయం ఏర్పడింది. హ్యాకింగ్‌కు గురైన పోలీసు కంప్యూటర్లు సుమారు 25 నుంచి 40శాతం వరకు వైరస్‌తో మొరాయించాయి. దీంతో నిపుణులు వీటిని డీకోడ్ చేసే పనిలో పడ్డారు.

05/14/2017 - 02:37

విశాఖపట్నం, మే 13:సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల హవాలా కుంభకోణంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కేసును సిఐడి లేదా సిబిఐకి అప్పగించే అవకాశం ఉందని విశాఖ డిసిపి నవీన్ గులాటీ చెప్పారు.

05/14/2017 - 02:35

విజయవాడ, మే 13: వాయువ్య గాలుల ప్రభావంతో వాతావరణంలో మరిన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అనూహ్యరీతిలో పెరగనున్న ఉష్ణోగ్రతలతో ఆదివారం నుంచి ఈనెల 18 తేదీ వరకు ఎండలు ముదిరి ‘మంటలు’ చెలరేగనున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను కర్నూలు, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ తెలిపింది.

05/14/2017 - 02:35

అమరావతి, మే 13: విశాఖపట్నంలో పోలీసులు రట్టు చేసిన హవాలా స్కాంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ‘హవాలా మార్గంలో రూ.1379కోట్లు దారి మళ్లిన వ్యవహారం ఇవాళ బయటపడింది. పెద్దనోట్ల రద్దు తరువాత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌తో ఒకసారి మాట్లాడుతూ, ఏపికి ఎక్కువ నోట్లు పంపాలని కోరాను. దానికి ఆయన స్పందిస్తూ నోట్లు వస్తున్నాయి కానీ ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదని అన్నారు.

05/14/2017 - 02:34

అమరావతి, మే 13: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన సందర్భంగా శనివారం సాయంత్రం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఒక సిఎం అప్‌డేట్ అయితే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

05/14/2017 - 04:22

ఖమ్మం, మే 13: రాష్ట్రంలో తమను ఎక్కడా మాట్లాడనీయకుండా చేస్తున్నారని, అసెంబ్లీకి రానివ్వకపోగా ప్రజల మధ్యలో కూడా ఉండనియ్యడం లేదని, అవసరమైతే అడవికి వెళ్ళైనా ప్రజలను సమీకరించి ఉద్యమబాట పడతామని టిడిఎల్‌పి నేత రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుపోరు దీక్ష పేరుతో శనివారం ఖమ్మంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై తాము ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే తట్టుకోలేక అడ్డుకుంటున్నారన్నారు.

05/14/2017 - 02:27

విశాఖపట్నం, మే 13:్భరీ హవాలా కుంభకోణంలో సూత్రధారి వడ్డి మహేష్ కథ అనుకోని పరిస్థితుల్లో అడ్డం తిరిగింది. డొల్ల కంపెనీలను ప్రారంభించి, కోట్ల రూపాయలను జమ చేసి, పెద్ద మొత్తంలో నగదును దేశం దాటించిన మహేష్ బండారాన్ని ఐటి అధికారులు బయటపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు పది బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మహేష్ హవాలా వ్యాపారానికి సహకరించారు.

05/14/2017 - 02:24

హైదరాబాద్, మే 13: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో డెడ్‌స్టోరేజీకి పైన 10 నుంచి 15 టిఎంసి నీరు మాత్రమే అందుబాటులో ఉండడంతో జూన్ 1వ తేదీ తర్వాత మంచినీటి అవసరాలు, ఖరీఫ్ పంటకు నీటి విడుదలపై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం శ్రీశైలంలో కేవలం 18.54 టిఎంసి నీరు ఉంది. నాగార్జునసాగర్‌లో డెడ్‌స్టోరేజీ వద్ద 123 టిఎంసి నీరు ఉన్నా, ఈ నీటిని వినియోగించుకోవడం కష్టం.

05/14/2017 - 02:22

హైదరాబాద్, మే 13: తెలంగాణలో రైతుకు స్వర్ణయుగం తెచ్చే మహోద్యమం రావాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో ప్రొఫెసర్ యూనస్‌ఖాన్ పొదుపు ఉద్యమం చేపట్టినట్టు, ఎస్‌కె డే మన దేశంలో పంచాయితీరాజ్ ఉద్యమాన్ని తీసుకొచ్చినట్టు, తెలంగాణలో రైతుకు స్వర్ణయుగం తెచ్చే మహోద్యమం రావాలన్నారు.

05/14/2017 - 02:18

హైదరాబాద్, మే 13: ప్రవాస భారతీయుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో పనిచేయనున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వికె సింగ్ తెలిపారు. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో పని కోసం వెళ్లిన వారు ఏజెంట్ల మోసాలవల్ల ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి విదేశీ వ్యవహారాలపై కేంద్రమే నిర్ణయం తీసుకునేది.

Pages