S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/13/2017 - 01:07

ఖమ్మం, మే 12: రైతులకు బేడీలు వేసి న్యాయస్థానానికి తీసుకురావడంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. టిడిపి లీగల్‌సెల్‌కు చెందిన న్యాయవాది రజనీకాంత్‌రెడ్డి ఖమ్మం ఘటనపై హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించగా నాటి సంఘటనపై పూర్తి వివరాలతో వచ్చే నెల 5వ తేదీలోగా నివేదిక సమర్పించాలని నగర పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్‌ను ఆదేశించింది.

05/13/2017 - 01:02

నెల్లూరు, మే 12: నగరంలోని ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ను కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి సుమా రు రూ.3కోట్ల మేర మోసం చేసిన సంఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఏకె నగర్‌లో ఉన్న ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో తనఖా నిమిత్తం వచ్చే బం గారు ఆభరణాలను పరీక్షించి, విలువ లెక్కగట్టే అప్రయిజర్ మరికొందరు కలిసి ఒక బృందంగా ఏర్పడి బ్యాంక్‌ను మోసం చేయడం ప్రారంభించారు.

05/13/2017 - 01:00

ఆదోని,మే 12: రాష్ట్రంలో త్వరలో మరో 14 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మొత్తం 19 డయాలసిస్ సెంటర్లకు గాను ఇప్పటికే ఉద్దానంలో మూడు, మరోప్రాంతంలో రెండు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 14 కేంద్రాలు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.

05/12/2017 - 06:22

నెల్లూరు, మే 11: హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ్ అంత్యక్రియలు మంత్రి స్వస్థలమైన నెల్లూరు నగరంలో గురువారం నిర్వహించారు. నారాయణ మెడికల్ విద్యాసంస్థల ప్రాంగణంలోని ఆయన ఇంటి వద్ద నిషిత్ మృతదేహాన్ని సందర్శనార్ధం గురువారం ఉదయం 10 గంటల వరకు ఉంచారు.

05/12/2017 - 05:22

హైదరాబాద్, మే 11: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ బిల్లు-2016కు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపినట్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. కేంద్రం ఆమోదించిన బిల్లు చట్టం రూపంలో శుక్రవారం గెజిట్ విడుదల అవుతోంది.

05/12/2017 - 05:21

హైదరాబాద్, మే 11: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో ఐదుగురు పోలీసు అధికారులపై వేటు పడింది. వీరిని సస్పెండ్ చేస్తూ డిజిపి అనురాగ్ శర్మ గురువారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరో నలుగురిపై విచారణ జరపాలని, 16మందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

05/12/2017 - 05:18

హైదరాబాద్, మే 11:తెలంగాణలో శుక్రవారం జరిగే ఎమ్సెట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు. విద్యార్థులు మెటల్ బటన్లు ఉన్న చొక్కాలు ధరించకూడదని, కళ్లద్దాలు, రిస్టువాచీలు పెట్టుకోకూడదని చెప్పారు. అలాగే అమ్మాయిలు ఆభరణాలు ధరించకుండా రావాలన్నారు.

05/12/2017 - 05:11

ధర్మవరం, మే 11: ధర్మవరం పేరు వినగానే ఇక్కడ తయారయ్యే చేనేత పట్టుచీరలు గుర్తుకొస్తాయి. అందులోనూ ధర్మవరంలో తయారయ్యే చేనేత పట్టుచీరలకు ఓ ప్రత్యేకత ఉంది. మంచి పట్టుదారంతో నైపుణ్యంతో కార్మికులు చీరలు నేస్తుంటారు. దీంతో దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో ఉన్న మహిళలు సైతం ధర్మవరం పట్టుచీరలు కట్టుకుని మురిసిపోతుంటారు. ధర్మవరం పట్టుచీరలను ఇష్టపడని పడతులు ఉండరంటే అతిశయోక్తి కాదు.

05/12/2017 - 05:07

విజయవాడ, మే 11: ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద పీజీ మెడికల్ కోర్సుల ఫీజుల పెంపువ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పీజీ మెడికల్ డిప్లొమో కోర్సుల ఫీజులను ఇటీవల భారీగా పెంచడం తెలిసిందే.

05/12/2017 - 05:05

రాజమహేంద్రవరం, మే 11: రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి వచ్చే జూనియర్, డిగ్రీ, పిజి తదితర కళాశాలలకు ఇక సొంత భవనాలు తప్పనిసరి. సొంత భవనాల్లేకపోతే 2017-18 విద్యా సంవత్సరం ప్రవేశాలను రద్దుచేస్తామని ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో కలకలం రేగుతోంది. ప్రస్తుతం ప్రైవేటు కళాశాలలకు జీవో 29 ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం 1308 కళాశాలలున్నాయి.

Pages