S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/12/2017 - 05:04

విజయవాడ, మే 11: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 54 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులను ఆ రాష్ట్రానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు వారికి అసెంబ్లీ ఆవరణలో సహచర ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. చాలాకాలంగా రాష్ట్ర అసెంబ్లీలో పనిచేస్తున్న తమను తెలంగాణకు పంపాల్సిందిగా ఆ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు కోరడం తెలిసిందే.

05/12/2017 - 04:59

ఖమ్మం, మే 11: సరిగ్గా 14రోజుల క్రితం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన ఘటనలో అరెస్టయిన 10మంది రైతులను గురువారం న్యాయస్థానానికి సంకెళ్ళు వేసి తీసుకువచ్చారు. రైతులపై మూడు కేసులు నమోదు చేయగా రెండు కేసుల్లో వాయిదాకు రైతులను తీసుకువస్తున్నారని తెలుసుకున్న వివిధ పార్టీల నాయకులు కోర్టువద్దకు భారీగా చేరుకున్నారు.

05/12/2017 - 04:54

హైదరాబాద్, మే 11:హైదరాబాద్ మాదాపూర్ ఐటి కంపెనీల నుంచి ఉద్వాసనకు గురైన నాలుగు వేలమంది ఐటి నిపుణులు, ఉద్యోగులు తొలిసారిగా కార్మిక సంక్షేమ భవన్ గుమ్మమెక్కారు. కాగ్నిజెంట్, విప్రో, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు వేటు వేయడంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు తెలంగాణ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా)ని ఆశ్రయించారు.

05/11/2017 - 03:56

హైదరాబాద్, మే 10: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వ్యవహారాల మంత్రి డాక్టర్ నారాయణ కుమారుడు నిషిత్ (23) బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంపై రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఎపి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిషిత్ ఆత్మకు శాంతి చేకూరాలని కె చంద్రశేఖరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

05/11/2017 - 03:48

నెల్లూరు రూరల్, మే 10: నిషిత్ నారాయణ పార్థివదేహాన్ని బుధవారం రాత్రి నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలోని ఆయన నివాసానికి అంబులెన్స్ ద్వారా తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసిన వెంటనే ఇంటి వద్ద ఉన్న బంధువులు, వివిధ కళాశాల సిబ్బంది ఆర్తనాదాలు మిన్నంటాయి. నారాయణ కుటుంబాన్ని బుధవారం రాత్రి ఐటి శాఖ నారా లోకేష్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

05/11/2017 - 02:51

విజయవాడ, మే 10: దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల విధానంలో సంస్కరణలు ఎంతో అవసరమని, ప్రధానంగా దామాషా ప్రాతిపదికన ప్రాతినిధ్యం అవసరమని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అలాగే రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలపై కూడా నియంత్రణ అవసరమని అన్నారు.

05/11/2017 - 02:26

హైదరాబాద్, మే 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల అర్చకుల అర్హతలు, వేతనాల నిర్ణయానికి సంబంధించి తుది నోటిఫికేషన్‌ను త్వరగా జారీ చేసేలా ప్రభుత్వానికి సూచించాలంటూ గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను ఎపి అర్చక సమాఖ్య కోరింది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఎపి అర్చక సమాఖ్య ప్రతినిధులు శ్రీకంఠం నందీశ్వర్, ఆత్రేయ బాబు, పెద్దింటి రాంబాబు, అనంతాచార్యులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

05/11/2017 - 02:25

హైదరాబాద్, మే 10: ఏపి అసెంబ్లీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన 54 మందిని ఆ ప్రభుత్వం రిలీవ్ చేసింది. సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు వీరిని అధికారులు స్వంత రాష్ట్రానికి పంపేందుకు అనుమతిచ్చారు. ఇంకా 28 మంది తెలంగాణకు చెందిన వారు ఎపి అసెంబ్లీలో పని చేస్తున్నారని, వారిని కూడి రెండోదశలో పంపించి వేస్తారని అధికార వర్గాల సమాచారం.

05/11/2017 - 01:49

విజయవాడ, మే 10: మూడేళ్లుగా ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య నలుగుతున్న అంతర్ రాష్ట్ర రవాణా ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, బుధవారం తెలుగు రాష్ట్రాల రవాణా మంత్రుల సమావేశంలో సానుకూల చర్చ సాగింది. సమస్యపై రెండు రాష్ట్రాల రవాణా శాఖల మంత్రులు భేటీ అయినప్పటికీ ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకున్నా, సింగిల్ పర్మిట్ల అంశంలో ఇద్దరు మంత్రులు, అధికారుల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కావడం గమనార్హం.

05/11/2017 - 01:43

హైదరాబాద్, మే 10: అతి విశ్వాసం, నిర్లక్ష్యం, వేగమే మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, చిన్ననాటి మిత్రుడు రవివర్మను పొట్టన పెట్టుకున్నాయి. ప్రమాద సమయంలోనూ ప్రాణాలకు ఎలాంటి ముప్పూ కలిగించని ఖరీదైన కారులో ప్రయాణిస్తున్నా, ఇద్దరూ ప్రాణాలు వదిలేశారంటే వేగం తీవ్రతను అంచనా వేయొచ్చని రోడ్డు సేఫ్టీ నిపుణులు అంటున్నారు.

Pages