S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/21/2017 - 03:56

హైదరాబాద్, జనవరి 20: రాష్ట్రంలో కొత్తగా 2132 కిలో మీటర్ల మేరకు జాతీయ రహదారికి కేంద్రం ఆమోదం తెలిపినందున ఈ పనులు వేగంగా జరిగేట్టు చూడాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల పనులపై మంత్రి శుక్రవారం సమీక్ష జరిపారు.

01/21/2017 - 03:56

హైదరాబాద్, జనవరి 20: ఉపాధ్యాయ విద్యా కళాశాలల్లో బిఇడి కోర్సులో చేరేందుకు నిర్వహించాల్సిన ఎడ్‌సెట్-2017ను తాత్కాలికంగా సుప్తచేతనావస్థలో ఉంచినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. ఎడ్‌సెట్-2016 ప్రక్రియ పూర్తికాకుండానే ఎడ్‌సెట్-2017 నిర్వహించడంపై ఆంధ్రభూమి ప్రచురించిన వార్తాకథనానికి అధికారులు స్పందించారు.

01/21/2017 - 02:58

రాజమహేంద్రవరం, జనవరి 20: పుష్కర తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ సి వై సోమయాజులు ఏకసభ్య కమిషన్ విచారణ ఒక అడుగు ముందుకేస్తే. రెండు అడుగులు వెనక్కు వేసినట్టుగా మారింది. కమిషన్‌ను నియమించి దాదాపు ఏడాదిన్నర కాలం పూర్తి కావస్తోంది. ఆరు నెలల కాలంలో విచారణ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని నిర్ధేశించారు.

01/21/2017 - 02:46

హైదరాబాద్, జనవరి 20: నకిలీ కరెన్సీ కేసులో ముగ్గురు నిందితులకు హైదరాబాద్ ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టు విధించిన శిక్షనే ధ్రువీకరిస్తూ జస్టిస్ నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎంఎస్‌కె జైశ్వాల్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఎన్‌ఐఏ కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను సవాలు చేస్తూ నిందితులు మసూద్ అక్తర్, మహ్మద్ షఫీ, షేక్ ఆక్రం హైకోర్టులో అపీల్ చేశారు.

01/21/2017 - 03:17

హైదరాబాద్, జనవరి 20: పేద బ్రాహ్మణుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా సొసైటీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బ్రాహ్మణ సదన్ నిర్మాణానికి ఇప్పటికే స్థలం కేటాయించడంతో భవన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

01/21/2017 - 02:36

హైదరాబాద్, జనవరి 20: మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఈ ఏడాదీ రికార్డు నిలపడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌లోని ఆర్థిక లోటుతోపాటు నోట్ల రద్దుతో తగ్గిన ఆదాయాన్ని ఏవిధంగా పూడ్చుకోవాలని యోచిస్తుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ప్రణాళికేతర వ్యయంకంటే ప్రణాళికా వ్యయానే్న ఈసారీ ఎక్కువ చూపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

01/21/2017 - 02:29

న్యూఢిల్లీ, జనవరి 20: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ వివరాలు తెలిపారు. రాష్ట్రంలో మరో 19 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా కేంద్రాన్ని కోరినట్టు ఆయన చెప్పారు.

01/21/2017 - 02:26

హైదరాబాద్, డిసెంబర్ 20: దేశ విద్రోహ కార్యకలాపాలకు సంబంధించి గత కొనే్నళ్లుగా హైదరాబాద్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఉగ్రవాద అనుమానితుడు సయ్యద్ జకీర్ ఎట్టకేలకు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అరెస్టయ్యాడు. రియాద్ పోలీసులు సయ్యద్ జకీర్‌ను ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌కు విమానంలో శుక్రవారం పంపించారు. బిజెపి నేతలను హత్య చేయాలనే కుట్ర కేసులో సయ్యద్ జకీర్ నిందితుడు.

01/21/2017 - 02:25

విజయవాడ, జనవరి 20: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన డిజిటల్ ఇండియా పిలుపును అందుకుని ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో శుక్రవారం ‘ఇంటర్నెట్ ఫర్ ఆల్’ అంశంపై ప్రత్యేక చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న చంద్రబాబు తక్కువ వ్యయంతో ఇంటింటికీ ఇంటర్‌నెట్ ఎలా సాధ్యమో వివరించారు.

01/20/2017 - 03:06

హైదరాబాద్, జనవరి 19: చిత్తూరు జిల్లా గుర్రం కొండ గ్రామంలోని మసీదులో ముస్లింలలో ఆస్లేహెడెస్ తెగకు చెందిన మహిళలు ప్రార్థనలు చేసుకుంటారని, వారిని ఎవరూ భంగ పరచకుండా, ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. గుర్రంకొండ గ్రామానికి చెందిన ఎం సహీరా అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించి మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది.

Pages