S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/20/2017 - 01:42

హైదరాబాద్, జనవరి 19: హైదరాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఓ ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హర్యానాకు చెందిన సచిన్ (25) హకీంపేటలోని సిఐఎస్‌ఎఫ్ కేంద్రంలో గత అక్టోబర్ నుంచి ఎస్‌ఐగా శిక్షణ పొందుతున్నాడు. అతను తన గదిలో ఉరేసుకున్నట్టు సహచరులు గమనించి, అధికారులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే ఎస్‌ఐ బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు.

01/20/2017 - 01:41

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా గడచిన రెండున్నరేళ్లలో ఆరు వేల పోస్టులను భర్తీ చేశామని, త్వరలో మరో 9వేల పోస్టులను భర్తీ చేస్తామని కమిషన్ చైర్మన్ డాక్టర్ ఘంటా చక్రపాణి చెప్పారు. 2011 గ్రూప్-1 ఫలితాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన కమిషన్ సభ్యులతోపాటు గవర్నర్ నరసింహన్‌ను కలిసి కమిషన్ పనితీరుపై నివేదికను సమర్పించారు.

01/20/2017 - 01:38

హైదరాబాద్, జనవరి 19:తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు నిర్వహించేందుకు ముందుకొచ్చే కొరియన్ సంస్థలకోసం హైదరాబాద్‌లో ఓ ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి కెటిఆర్ సియోల్‌లోని భారత ఛాంబర్ ఆఫ్ కామర్స్ దక్షిణ కొరియాకు హామీ ఇచ్చారు.

01/20/2017 - 02:09

హైదరాబాద్, జనవరి 19:అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కార్యాలయాల సముదాయాలను ఏడాదిలోగా నిర్మించేందుకు డిజైన్లు ఖరారు చేసి టెండర్లను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. వీటి నిర్మాణానికి ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామన్నారు.

01/20/2017 - 01:27

గుంటూరు, జనవరి 19: రాజధాని పేరుతో ప్రతిదీ ఓ కుంభకోణంగా మారుతోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు దేశాలు తిరుగుతూ మాస్టర్ ప్లాన్‌లు రూపొందిస్తున్నామంటూ జనాల్ని వంచిస్తున్నారు.. తన వారికి భూములు కట్టబెట్టి కమిషన్లు దండుకుంటున్నారు. అభివృద్ధికి, రాజధానికి మేం వ్యతిరేకంకాదు..దానివల్ల జరిగే మోసాలనే ప్రశ్నిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

01/20/2017 - 01:25

గుంటూరు, జనవరి 19: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కారుపై వైసిపి కార్యకర్తలు దాడికి దిగారు. గురువారం సాయంత్రం వెలగపూడి సచివాలయానికి అఖిలప్రియ వెళుతుండగా మందడం మలుపు వద్ద ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కాన్వాయి ఎదురయింది. దీంతో గన్‌మెన్ దిగి సమీపంలో ఉన్న సిఐని హెచ్చరించారు. వైసిపి కార్యకర్తలు కారు వద్దకు చేరుకుని జెండా కర్రలతో, రాళ్లతో దాడిచేసేందుకు ప్రయత్నించారు.

01/20/2017 - 01:19

అమరావతి, జనవరి 19: ఆంధ్రప్రదేశ్‌కు, అమరావతికి ఆర్థిక వనరులు పెట్టుబడులను సమకూర్చడంలో చైనాకు చెందిన ‘మెకెన్సీ గ్లోబల్’ ముఖ్య భూమిక పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. ఇందుకోసం సంస్థలోని మేధావులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేసి, తమ రాష్ట్రానికి పెట్టుబడులు సమకూర్చే బాధ్యతను ఆ బృందానికి అప్పగించాలని కోరారు.

01/19/2017 - 07:51

హైదరాబాద్, జనవరి 18: శాసనమండలి, శాసనసభ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. శాసనమండలి చైర్మన్ కె స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి బుధవారం సభలను నిరవధికంగా వాయిదా వేశారు. గత నెల 16న ఉభయ సభలూ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శీతాకాల సమావేశాలు సాధారణంగా వారం పది రోజులకు మించి జరగవు.

01/19/2017 - 07:42

హైదరాబాద్, జనవరి 18: ఆంధ్రాలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.859 కోట్ల విద్యుత్ చార్జీలను పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపి డిస్కంలు బుధవారం ఏపి విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ప్రతిపాదనలపై వచ్చే రెండు నెలల్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో మండలి బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. ఆ తరువాత మార్చి 31 లోపల పెంపుదలపై నిర్ణయం ప్రకటిస్తాయి.

01/19/2017 - 07:34

అమరావతి, జనవరి 18: తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన నివాళులర్పించారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారానికి తెచ్చి నూరేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను ఓడించిన మహానాయకుడని అన్నారు.

Pages