S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/18/2017 - 05:20

శ్రీశైలం, జనవరి 17: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అలంకరణ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజల చేశారు. అనంతరం అశ్వవాహన సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో నారాయణ భరత్‌గుప్తా దంపతులు, అర్చక, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు.

01/18/2017 - 01:49

హైదరాబాద్, జనవరి 17: ‘విశ్వ నగరావిష్కరణ ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదు. సమష్టి ప్రయత్నంతోనే సాధ్యం. హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన బృహత్తర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం’ అని మున్సిపల్ మంత్రి కె తారక రామారావు అసెంబ్లీలో ప్రకటించారు. రాజధాని అభివృద్ధి ప్రణాళికలపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన లఘు చర్చలో వివిధ అంశాలను మంత్రి వివరించారు.

01/18/2017 - 02:11

హైదరాబాద్, జనవరి 17: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో మరోమారు ఉద్రిక్తతలు తలెత్తాయి. రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడి ఏడాది గడచిన సందర్భంలో జాయింట్ యాక్షన్ ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో విద్యార్ధులు నివాళి అర్పించేందుకు సిద్ధమైనపుడు పోలీసులు గేటు వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

01/18/2017 - 01:42

హైదరాబాద్, జనవరి 17: దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతోన్న మోస్ట్‌వాంటెడ్ సైబర్ నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోలార్ పవర్ కాంట్రాక్టులు ఇస్తానంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న మోసగాడు బోజ్ ఆగస్టిన్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టిన్‌ను సోమవారం రాత్రి చెన్నైలో అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

01/18/2017 - 01:55

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణలో మాజీ సైనికుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. మంగళవారం శాసనసభలో ఒక ప్రకటన చేస్తూ సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు అనేక వరాలు ప్రకటించారు. కుటుంబ క్షేమంకంటే దేశ క్షేమానే్న కాంక్షించి సైనికులు అహరహం పరిశ్రమిస్తున్నారని, అలాంటపుడు వారి క్షేమాన్ని సమాజం తన బాధ్యతగా స్వీకరించాల్సి ఉందన్నారు.

01/18/2017 - 01:27

విశాఖపట్నం, జనవరి 17: విశాఖను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ట్విన్ టవర్స్ నిర్మాణం చేపట్టనున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆధ్వర్యంలో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చే విధంగా రెండు టవర్ల నిర్మాణం చేపట్టేందుకు నిర్మాణ సంస్థను ఇప్పటికే గుర్తించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌టి టక్కర్ వెల్లడించారు.

01/18/2017 - 01:25

అమరావతి, జనవరి 17: వ్యవసాయంలో అధిక దిగుబడి రావాలంటే తగిన సమయంలో విత్తనం నాటాలి. ఇందుకు భూసారం, వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతుల్లో ఈమాత్రం అవగాహన తప్పనిసరి. ఈ మేరకు చిన్న రైతుల కోసం విత్తనాలు నాటుకునే అదను ఇదని చెప్పే ఓ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. దీనికి ఇక్రిశాట్, మైక్రోసాఫ్ట్ సంస్థలు చేయూతను అందించాయి.

01/18/2017 - 01:22

విజయవాడ, జనవరి 17: ఆరోగ్య పథకాల ధరల ప్యాకేజీ పెంపుపై జరుగుతున్న అంతులేని జాప్యానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ‘ఆషా’ పరిధిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ మంగళవారం తెల్లవారుజామునుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలను పూర్తిగా నిలిపివేశాయి. అయితే మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యం మార్చి మాసాంతం వరకు ఉన్నందున ఉద్యోగులకు ఆ పథకం కింద చికిత్స చేయడానికి సిద్ధమవుతున్నారు.

01/18/2017 - 01:18

అమరావతి, జనవరి 17: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రపంచ ఆర్ధిక సదస్సు వేదికగా మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల సహా పలువురు పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అయ్యారు. ఇ-గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో తమతో కలిసి పనిచేయాలని సత్య నాదెళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

01/17/2017 - 05:18

శ్రీశైలం, జనవరి 16: సంక్రాంతి బ్రహోత్మవాల్లో భాగంగా శ్రీశైలంలో సోమవారం పూర్ణాహుతి నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. యాగశాలలో చండీశ్వరునికి ప్రత్యేక పూజలు, నిత్యహోమాలు, రుద్రహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. దేవస్థానం ఇఓ నారాయణగుప్తా, వేద పండితులు పూజాద్రవ్యాలను అగ్నిగుండానికి సమర్పించారు.

Pages