S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/16/2017 - 01:44

హైదరాబాద్, జనవరి 15:తెలంగాణలో గొర్రెల పెంపకాన్ని భారీ పరిశ్రమగా అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో ఆదివారం గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఇతర దేశాలకు గొర్రె మాంసాన్ని ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ గొర్రెల పెంపకం పరిశ్రమ ఎదగాలని ముఖ్యమంత్రి అన్నారు.

01/16/2017 - 01:28

ఏలూరు/రాజమహేంద్రవరం, జనవరి 15: పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కోడి పుంజు మీసం మెలేసింది. సంక్రాంతి మూడురోజులు పందాలు ఎలా జరుగుతాయన్న సందేహాలను పటాపంచలు చేస్తూ ఇంతకుముందుతో పోలిస్తే మరింత విచ్చలవిడిగా సాగిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ మూడురోజుల్లోనూ పందెం బరుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది ప్రాథమిక అంచనా. కోడిపందాలతోపాటు జూదాల జాతర కూడా ఈసారి ఊపందుకుంది.

01/16/2017 - 01:24

విజయవాడ, జనవరి 15: ప్రభుత్వంలోని పదహారు విభాగాల్లో డ్రోన్ల సేవలు ఇక అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ అధీనంలోని వివిధ శాఖల్లో డ్రోన్ల వినియోగానికి కేంద్ర హోంశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలో ఆయాశాఖల్లో డ్రోన్ల ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దేశంలో డ్రోన్ల వినియోగంపై 2014లో కేంద్రం కొన్ని ఆంక్షలు విధించింది.

01/16/2017 - 01:23

విజయవాడ, జనవరి 15: పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి దావోస్‌కు బయలుదేరి వెళ్లారు. అమరావతి నిర్మాణం, మెట్రో రైలు ప్రాజెక్టులు, ప్రపంచస్థాయి విద్యాసంస్థల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటుతో యువతకు లక్షల ఉద్యోగావకాశాల సాధనకు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక 47వ వార్షిక సదస్సు-2017ను వేదికగా సిఎం చంద్రబాబు నాయుడు ఎంచుకున్నారు.

01/16/2017 - 01:23

చంద్రగిరి, జనవరి 15: నగదు రహిత లావాదేవీల్లో ఇప్పటికే రాష్ట్రం ముందంజలో ఉందని, మార్చి నాటికి పూర్తిస్థాయిలో ప్రజలంతా నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడేలా దృష్టి సారిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో తన సొంత ఊరు నారావారిపల్లెలో గడపడానికి ఈనెల 13వ తేదీన కుటుంబ సమేతంగా చంద్రబాబు విచ్చేశారు.

01/16/2017 - 01:14

నృత్య కళారంగాల్లో భారతదేశం సాంస్కృతిక వైభవం హైదరాబాద్ శిల్పకళావేదికపై అద్భుతంగా ఆవిష్కారమైంది. ఆదివారం సాయంత్రం జరిగిన తొలి అంతర్జాతీయ నాట్య పండుగ అపూర్వంగా సాగింది. ఒకే వేదికపై అనేక దేశాల కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించటం మరపురాని సన్నివేశం.

01/16/2017 - 01:09

అత్యున్నత న్యాయస్థానం నిషేధాజ్ఞలు విధించినా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టును యథావిధిగా నిర్వహించారు. తమిళనాడులో నిషేధాజ్ఞలు ఉన్న ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పొంగల్ పర్వదినాలున్నప్పటికీ పలు చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.

01/14/2017 - 04:01

సంక్రాంతి వెలుగులతో తెలుగు రాష్ట్రాలు కొంగొత్త అందాలు సంతరించుకున్నాయ. ముంగిట్లో గొబ్బెమ్మలు, హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కొమ్మదాసరుల అతిశయోక్తులతో పండుగవేళ ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయ..

సంక్రాంతి పండుగ సందర్భంగా పాఠకులు, ప్రకటనకర్తలు, ఏజెంట్లకు శుభాకాంక్షలు.
- ఎడిటర్

పండుగ సందర్భంగా శనివారం మా కార్యాలయానికి సెలవు. ఆదివారం సంచిక వెలువడదు.

01/14/2017 - 03:21

శ్రీశైలం, జనవరి 13: శ్రీశైలంలో జరుగుతున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆది దంపతులకు రావణ వాహన సేవ నిర్వహించారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను రావణ వాహనంపై ఆశీనులను చేశారు.

01/14/2017 - 02:40

హైదరాబాద్, జనవరి 13: కృష్ణా జలాలపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ కీచులాట ప్రారంభమైంది. పరస్పరం ఫిర్యాదు చేస్తూ కృష్ణా బోర్డుకు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖలు లేఖలు రాశాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఈ నెలాఖరులోగా సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది.

Pages