-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, జనవరి1: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్పి సింగ్ నియమితులయ్యారు. ప్రదీప్ చంద్ర పదవీ కాలం శనివారంతో ముగియడంత పంచాయితీరాజ్ స్పెషల్ సెక్రటరీగా ఉన్న ఎస్పి సింగ్ను నూతన ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1983 బ్యాచ్కు చెందిన ఎస్పి సింగ్ బీహార్కు చెందిన వారు. సీనియారిటీ ప్రకారం ఎస్పి సింగ్, ఎంజీ గోపాల్లలో ఒకరికి ప్రధాన కార్యదర్శి పదవి లభిస్తుందని భావించారు.
విజయవాడ, జనవరి 1: రాష్ట్రంలో జనవరి 2 నుంచి జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న ఈ కార్యమ్రాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జన్మభూమి కార్యక్రమాన్ని సిఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా కర్నూలు జిల్లాలో ప్రారంభించనున్నారు.
తిరుపతి, జనవరి 1: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి 7.05 గంటలకు తిరుపతికి రానున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. మంగళవారం నుంచి 7వ తేదీ వరకు ఎస్వీ యూనివర్శిటీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు జరగనుంది. ఈ సదస్సును ప్రారంభించడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 31: రాష్ట్ర పర్యటన ముగించుకుని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శనివారం తిరిగి న్యూఢిల్లీ వెళ్లారు. హకీంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లారు. విమానాశ్రయంలో రాష్టప్రతికి పలువురు ప్రముఖులు వీడ్కోలు పలికారు.
హైదరాబాద్, డిసెంబర్ 31: పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్కి రూ.484.38లక్షల రూపాయలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా జివో జారీ చేశారు. ఉద్యోగులు, జర్నలిస్టుల వైద్య సేవల కోసం ప్రభుత్వం ఇటీవల కార్పొరేట్ ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా వెల్నెస్ సెంటర్లను ప్రారంభించారు.
హైదరాబాద్, డిసెంబర్ 31: కరెన్సీతో కళకళలాడిన ఎటిఎంలు ఇప్పుడు దుమ్ముకొట్టుకు పోయి కళావిహీనంగా మారాయి. నవంబర్ 8న కరెన్సీ నోట్ల రద్దును ప్రధానమంత్రి ఏ ముహూర్తాన ప్రకటించారో కానీ అప్పటి నుంచి ఎటిఎంలకు గ్రహణం పట్టినట్టయింది. ఎటిఎంలు చాలా చోట్ల మూసే ఉన్నాయి. డబ్బులు లేకపోయినా పరవాలేదు. తాళం వేయకుండా తెరిచి ఉంచండి అని వౌఖిక ఆదేశాలు రావడంతో కొన్ని చోట్ల ఎటిఎంలు తెరిచి ఉంచారు.
హైదరాబాద్, డిసెంబర్ 31: కార్మికులకు వేతన, ఉద్యోగ భద్రత కల్పించడంలో కేంద్రప్రభుత్వం ఈ ఏడాది సఫలీకృతం అయ్యిందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్భారత్’ అనే నినాదాన్ని నిజం చేస్తూ ప్రపంచంలోనే భారత్ అగ్రగామి దేశంగా రూపొందేందుకు ప్రధాని నరేంద్రమోదీ అన్ని చర్యలూ తీసుకుంటున్నారని చెప్పారు.
హైదరాబాద్, డిసెంబర్ 31: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశపరీక్షల నిర్వహణకు సంబంధించి కసరత్తు పూర్తయింది, షెడ్యూలును ఒకటి రెండు రోజుల్లో ప్రకటించేందుకు ఉన్నత విద్యామండళ్లు ఏర్పాట్లు చేస్తున్నాయి. గత ఏడాది కంటె చాలా ముందే ఈసారి ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నారు. పలు కారణాలతో ఆంధ్రాలో 2016 ఎమ్సెట్ను ఏప్రిల్ 29న నిర్వహించగా, ఈసారి అంతకంటే ముందే నిర్వహించాలని చూస్తున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 30: సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో శుక్రవారం తేనీటి విందు కార్యక్రమం జరిగింది.
హైదరాబాద్, డిసెంబర్ 30: రాజమండ్రి ఒఎన్జిసిలో పనిచేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశించింది. వీరు 20 సంవత్సరాలుగా కాంట్రాక్టుపై పనిచేస్తున్నారని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు.