S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/17/2016 - 01:45

హైదరాబాద్, ఆగస్టు 16: నవ్యాంధ్రలో శాసనసభ సమావేశాలు జరగాలని కోరుకుంటున్న వారికి మళ్లీ నిరాశ తప్పేలా లేదు. వచ్చే నెలలో జరగనున్న శీతాకాల సమావేశాలు అమరావతిలో నిర్వహించేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపించడం లేదు.

08/17/2016 - 01:52

హైదరాబాద్, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా రెండు దశల్లో నిర్వహించిన ‘నీట్’ ఫలితాలను సిబిఎస్‌ఇ మంగళవారం నాడు ప్రకటించింది. ఇందులో గుజరాత్‌కు చెందిన హెత్ షా జాతీయ టాపర్‌గా నిలిచాడు, రెండో స్థానంలో ఒరిస్సాకు చెందిన ఏకాంష్ గోయల్, మూడో స్థానంలో రాజస్థాన్‌కు చెందిన నిఖిల్ బాజియా నిలిచారు.

08/17/2016 - 01:40

ఆదిలాబాద్, ఆగస్టు 16: గ్యాంగ్‌స్టర్ నరుూంతో నల్గొండ జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ నేతలకు, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, నరుూం కేసుల దర్యాప్తుకు ప్రభుత్వం నియమించిన సిట్‌పై నమ్మకం లేదని, ఈ కేసును సిబిఐ ద్వారా విచారిస్తేనే వాస్తవాలు బయటపడతాయని కాంగ్రెస్ నేత, నల్లగొండ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

08/17/2016 - 01:38

హైదరాబాద్, ఆగస్టు 16: నరుూం కేసులో కీలక నిందితుడు శేషన్న కోసం సిట్ ఆధ్వర్యంలో పది బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. భువనగిరికి చెందిన శేషన్న గ్యాంగ్‌స్టర్ నరుూంకు కుడి భుజం. ఈ నిందితుడిని పట్టుకుంటే నయిమ్ పూర్తిసమాచారం వెల్లడవుతుంది. మరో వైపు నరుూం డైరీలో ప్రస్తావించిన పేర్లలో అన్ని కేటగిరీలకు చెందిన వారి పేర్లతో జాబితాను సిట్ సిద్ధం చేస్తోంది.

08/17/2016 - 01:37

హైదరాబాద్, ఆగస్టు 16: గ్యాంగ్ స్టర్ నయిమ్ బాధితులతోపాటు భూతగాదాలకు సంబంధించిన సమస్యలపై న్యాయం చేయాలని కోరుతూ పలువురు మంగళవారం సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేష్ భగవత్‌ను కలిసి పూర్తి వివరాలతో కూడిన వినతి పత్రాలను అందచేశారు. ఎల్‌బినగర్ క్యాంప్ కార్యాలయానికి ప్రతి మంగళవారం ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తున్న కమిషనర్‌ను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించారు.

08/17/2016 - 01:32

రాజేంద్రనగర్, ఆగస్టు 16: గ్యాంగ్‌స్టర్ నరుూం అనుచరులు ఫర్హానా, హర్షియాలను మరో ఆరు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ రాజేంద్రనగర్ 8వ మెట్రోపాలిటన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నార్సింగ్ పోలీసులు ఫర్హానా, హర్షియా నుంచి నరుూంకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టడానికి 12 రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి పిటిషన్‌ను పరిశీలించి ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించారు.

08/17/2016 - 01:29

హైదరాబాద్, ఆగస్టు 16: ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి శూన్యమని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి విమర్శించారు. మంగళవారం ప్రారంభమైన పార్టీ ప్లీనం సమావేశానికి ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రధాని మోదీ పాలనపై విరుచుకుపడ్డారు.

08/17/2016 - 01:27

హైదరాబాద్, ఆగస్టు 16: మల్లన్నసాగర్‌తో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారణ చేపడుతుందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథమ్ పేర్కొన్నారు. కాని రాజకీయ ప్రయోజనాలు, ఇతర దురుద్దేశ్యాలతో దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించమని ఆయన స్పష్టం చేశారు.

08/17/2016 - 01:26

హైదరాబాద్, ఆగస్టు 16: జిఎస్‌టి బిల్లును శాసనసభలోనూ ఆమోదించి పంపించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఏపి సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్‌టి బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించిన తర్వాత రాష్టప్రతి ఆమోదం పొందడానికి సగం రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సి ఉంటుందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

08/17/2016 - 01:25

విజయవాడ (క్రైం), ఆగస్టు 16: కృష్ణా పుష్కరాల్లో నేపాల్ దొంగలు ప్రవేశించారు. ఒంటికి తెలియకుండానే మెడలో ఉన్న బంగారాన్ని, చేతికున్న బ్రాస్‌లెట్‌ను రెండో కంటికి తెలియకుండా దోచుకెళ్లే గ్యాంగ్ ప్రత్యేకత. వీరి దృష్టి అంతా బంగారంపైనే ఉంటుంది. చేతికి దొరికితే డబ్బులు కూడా వదిలిపెట్టరు. ఇప్పటికే చాలామంది భక్తులను వీరు దోచుకున్నారు. బాధితుల్లో కొంతమంది మాత్రమే పోలీసులను ఆశ్రయించారు.

Pages