S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

08/14/2016 - 07:06

హైదరాబాద్, ఆగస్టు 13: దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత వ్యవసాయ రంగం ప్రాధాన్యత కోల్పోయిందని, సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాల గౌడ అన్నారు. శనివారం ఇక్కడ అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఎఐఎల్‌యు) రాజ్యాంగంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎఐఎల్‌యు వ్యవస్థాపకుడు ఎ.అనంతరెడ్డి స్మారకోపన్యాసాన్ని జస్టిస్ గౌడ ఇచ్చారు.

08/14/2016 - 05:35

హైదరాబాద్, ఆగస్టు 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన 2014 జూన్ 2వ తేదీ నుంచి 2017 జూన్ 2వ తేదీ మధ్య తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వెళ్లి స్ధిరపడిన కుటుంబాల పిల్లలను స్ధానికులుగా ప్రకటించి విద్యా సంస్ధల్లో రిజర్వేషన్ల సదుపాయాలను వర్తింప చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

08/14/2016 - 04:11

హైదరాబాద్, ఆగస్టు 13: దేశంలో రానున్న రోజుల్లో ప్రజలందరికీ విశిష్ట విద్యను అందించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి వచ్చిన జవదేకర్ శనివారం నాడు పాత్రికేయులతో మాట్లాడారు.

08/13/2016 - 12:41

హైదరాబాద్ : సికింద్రాబాద్ పాత బోయిన్‌పల్లిలో దారుణం జరిగింది. కాంగ్రెస్ నేత యాదగిరిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇంట్లో నుంచి యాదగిరి బయటకు రాగానే ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు.యాదగిరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలిలో బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

08/13/2016 - 05:16

కర్నూలు, ఆగస్టు 12 : ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో విరసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు లేకుండా సకాలంలో వర్షాలు కురిసి పచ్చని పంటలు పండాలని, ప్రమాదాలకు తావులేకుండా ప్రజలకు నిండు జీవితం ప్రసాదించాలని మూడున్నర కోట్ల దేవతలు, బృహస్పతితో కలిసి కృష్ణా నదీమ తల్లిలోకి వచ్చిన పుష్కరుడు ఆశీర్వదించాలని కృష్ణా పుష్కర ప్రారంభ పూజల్లో వేద పండితులు మహా సంకల్పం నిర్వహించారు.

08/13/2016 - 04:31

హైదరాబాద్, ఆగస్టు 12: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు బిజెపి నేతలు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆదిలాబాద్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగివచ్చి తెలంగాణ విద్యారంగ స్థితి గతులపై సమీక్షిస్తారు. సమావేశ అనంతరం తిరిగి ఆయన ఢిల్లీకి వెళ్తారు.

08/13/2016 - 04:24

హైదరాబాద్, ఆగస్టు 12: ఇంతకూ ఆంధ్రప్రదేశ్‌కు హోదా కావాలా? వద్దా? మీడియా ముందుకువచ్చి ఏం చెప్పాలి? ఈ విషయంలో పెదబాబు మాట వినాలా? చినబాబును అనుసరించాలా? ఇదీ తెలుగుదేశం పార్టీ నాయకుల సందేహం. ప్రత్యేక హోదాపై పోరాటాన్ని ఢిల్లీ వరకూ తీసుకువెళ్లి, దాని కొనసాగింపుపై స్పష్టత లేకపోవడాన్ని జగన్ సద్వినియోగం చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలు తెదేపా వర్గాల్లో వినిపిస్తున్నాయి.

08/13/2016 - 03:48

అమలాపురం, ఆగస్టు 12: తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి పంచాయతీ సూదాపాలెంలో కులవృత్తి చేసుకుంటున్న దళితులపై దాడిచేయడం అమానుషమని, బాధితులను చంద్రబాబు పరామర్శించకపోవడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అమలాపురంలో చికిత్స పొందుతున్న బాధితులను శుక్రవారం ఆయన పరామర్శించారు.

08/12/2016 - 04:39

అవుకు, ఆగస్టు 11 : చత్తీస్‌ఘడ్, జిల్లా పోలీసులు జా యింట్ ఆపరేషన్ చేపట్టి నలుగురు మావోయిస్టులను అరెస్టు చేయడంతో కర్నూలు జిల్లాలో సైతం మావోయిస్టుల కదలికలు వెలుగుచూశాయి. కర్నూలు జిల్లాలో గాలేరు-నగరి కాలువ పనుల్లో భాగంగా అవుకు మండలంలో భారీ సొరంగం(టనె్నల్) పనులు జరుగుతున్నాయి.

08/12/2016 - 02:58

కర్నూలు, ఆగస్టు 11 : కృష్ణా పుష్కరాల సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం 20 గంటల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఆలయం తెల్లవారుజామున 4 నుంచి అర్ధరాత్రి 12గంటల వరకూ దర్శనానికి అనుమతిస్తారు. ఇక పాతాళగంగ, లింగాలగట్టులో ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకూ భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు సమయం నిర్ణయించారు.

Pages