S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/05/2016 - 07:42

చిన్నగొట్టిగల్లు, జూలై 4: విద్యుదాఘాతానికి గురై ఓ ఏనుగు మరణించిన సంఘటన చిత్తూరు జిల్లా ఎర్రవారిపాళ్యం మండలం, చింతగుంట పంచాయతీలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని సుబ్బరామపురం వద్ద రైతు సిద్దయ్యకు చెందిన మామిడితోటలో 11 కెవి విద్యుత్ లైను మనిషి ఎత్తులో వేలాడుతుండడంతో ఆహారం కోసం వచ్చిన ఏనుగుల గుంపులో ఒకటి విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతంతో మరణించింది.

07/05/2016 - 05:46

హైదరాబాద్,జూలై 4: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మేనేజిమెంట్ స్టడీస్ ప్రొఫెసర్ వి.వెంకటరమణకు రాష్టప్రతి భవన్ నుండి పిలుపు వచ్చింది. రాష్టప్రతి భవన్‌ను స్మార్టు మోడల్ టౌన్‌షిప్ - ప్రెసిడెంట్ ఎస్టేట్‌గా మార్చేందుకు అవసరమైన చర్యలను సమీక్షించాలని వెంకటరమణకు ఆహ్వానం అందింది. దీనికంటే ముందు హర్యానాలోని ఐదు గ్రామాలను మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దే ప్రణాళికను రూపొందించిన బృందంలో రమణ కూడా ఉన్నారు.

07/05/2016 - 05:37

రాజమహేంద్రవరం, జూలై 4: ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు ఒక్క గోదావరి నదికి మాత్రమే ప్రత్యేకం..దేశంలో ఏ నదికీ ఆది, అంత్య పుష్కరాలు లేవు. గురుడు సింహరాశిలోకి ప్రవేశించడంతో ఏడాది పొడవునా గోదావరి పుష్కరాలు, గురుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో కృష్ణా పుష్కరాలు జరుగుతాయి. అయితే అంత్య పుష్కరాలు మాత్రం గోదావరి నదికి మాత్రమే ఉండటంతో జూలై 31 నుంచి గోదావరి నదికి అంత్య పుష్కరాలు ప్రతిష్ఠాత్మకంగా జరగనున్నాయి.

07/05/2016 - 05:27

హైదరాబాద్, జూలై 4: పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకున్నా సిసి కెమెరాలు, బయోమెట్రిక్ మెషిన్లు ఏర్పాటు చేయడం ఏమిటంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తెలంగాణ విద్యాసంస్థల్లో సిసి కెమరాల ఏర్పాటును దశల వారీ చేపట్టారు.

07/05/2016 - 05:23

హైదరాబాద్, జూలై 4: నిత్యం ట్రాఫిక్‌తో నరకయాతన అనుభవించే జంటనగరాల ప్రజలకు మెట్రోరైలు సేవలు అందుబాటులోకి రావాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే!

07/04/2016 - 07:10

ఇల్లెందు, జూలై 3: ప్రస్తుతం జనజీవన స్రవంతిలో బతుకుసాగిస్తున్న మాజీ మావోయస్టుల వద్ద ఆయుధాలు బయటపడ్డాయి. ఆయుధాలున్నాయన్న సమాచారం అందడంతో పోలీసులు నిఘా పెట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

07/04/2016 - 06:57

హైదరాబాద్, జూలై 3: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వద్దన్నవే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ముద్దు అవుతున్న వైచిత్రి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. తెలంగాణలో తెరాస, ఏపిలో తెదేపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినయితే వ్యతిరేకించాయో, ఇప్పుడు ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత అవే కంపెనీలు దర్జాగా రెండు రాష్ట్రాల్లోనూ వెలిగిపోతున్న వైనం రెండుపార్టీల నేతల్లోనూ విస్మయానికి గురిచేస్తోంది.

07/04/2016 - 06:12

హైదరాబాద్, జూలై 3: విజయవాడలో అత్యంత ప్రతిష్ఠాత్మక కనకదుర్గగుడి ఈవో నియామక వ్యవహారం ఎమ్మెల్యే బాలకృష్ణకు అవమానం మిగిల్చింది. ఆయన సూచించిన వారి కి కాకుండా, వేరే వారిని ఆ పదవిలో నియమించడం, తాను సిఫారసు చేసిన తర్వాత కూడా ఐఏఎస్‌ను నియమించే పద్ధతికి శ్రీకారం చుట్ట డం బాబు వియ్యంకుడికి మనస్తాపం కలిగించిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

07/04/2016 - 06:11

హైదరాబాద్, జూలై 3: హరిత హారం కార్యక్రమంలో భాగంగా పం చాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో తె లంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం లో 40వేల మొక్కలు నాటి, పెంచే విధంగా కార్యాచరణ రూపొందించినట్టు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హరిత హారంలో మొక్కల పెంపకం కోసం ఆ శాఖ అధికారులతో మంత్రి ఆదివారం టిసిపార్డ్‌లో జరిగిన సెర్ఫ్‌లో సమావేశం అయ్యా రు.

07/04/2016 - 06:08

తిరుమల, జూలై 3: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. ముందుగా పాత అన్నదాన భవనం వద్ద శ్రీ జయేంద్ర సరస్వతి స్వామికి ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ ఆలయ మర్యాదతో స్వాగతం పలికారు. అక్కడ నుంచి జయేంద్ర సరస్వతి తన శిష్యబృందంతో కాలినడకన బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు.

Pages