S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

07/01/2016 - 04:46

హైదరాబాద్, జూన్ 30: స్విట్జర్లాండ్‌లో ఉన్న అంతర్జాతీయ విత్తన పరిశోధన సంస్థ (ఇస్తా)లో తెలంగాణకు చెందిన విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కె.కేశవులుకు అవకాశం లభించింది. ఇస్తోనియా (టాలిన్)లో ఇటీవల జరిగిన ఇస్తా అంతర్జాతీయ సదస్సు సందర్భంగా ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా కేశవులు కార్యనిర్వాహక కమిటీకి ఎన్నికయ్యారు.

07/01/2016 - 04:44

హైదరాబాద్, జూన్ 30: రాష్ట్రం విడిపోయినా ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్ పనితీరుపై తెలుగు రాష్ట్రాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం విడిపోయి, రెండుగా ఏర్పాటయిన తర్వాత కూడా, కీలకమైన అంశాలపై తరచూ తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించడంలో గవర్నర్ తన అధికారాలను వినియోగించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

07/01/2016 - 04:41

తిరుమల, జూన్ 30: తిరుమలలో స్థానికులు నివాసం ఉంటున్న వెస్ట్ బాలాజీ నగర్‌లో గురువారం మరో పులి అరగంట సేపు మాటు వేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తిరుమలలో ఇటీవల పులుల సంచారం పెరిగిన విషయం పాఠకులకు విదితమే. గురువారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో పులి గాండ్రింపులు వినపడటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు, మీడియాకు, విజిలెన్స్ సిబ్బందికి అందించారు.

07/01/2016 - 04:38

హైదరాబాద్, జూన్ 30: అభ్యున్నతికి, పురోగతికి తోడ్పడే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఐఎస్‌ఐఎస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు ఓ వరంలా మారింది. పాలకులు, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఆధునిక సౌకర్యం పెడదోవపడుతోంది. రోజురోజుకి అభివృద్ది చెందుతోన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఉగ్రవాదులు తమ భావాజాలాన్ని ప్రచారం చేసుకునేందుకు, యువతను ఆకర్షించేందుకు ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు.

07/01/2016 - 04:37

హైదరాబాద్, జూన్ 30: వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు బోసిపోయి ఉన్నాయి. ఎక్కడా నీటి జాడ కనపడడం లేదు. వచ్చే రెండు నెలలు కుండపోత వర్షం పడితేకాని ఒక మేరకు జలాశయాల్లో నీరు చేరే అవకాశాలు కనపడడంలేదు.

07/01/2016 - 04:37

విజయవాడ, జూన్ 30: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. గిజో-ఎపి ద్వైపాక్షిక పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశం గురువారం గుయాన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలో 5.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉందన్నారు. ఎపికి వైమానిక, ఉపరితల, నౌకా రవాణా కనెక్టివిటి ఉందన్నారు.

07/01/2016 - 03:07

హైదరాబాద్, జూన్ 30: పుష్కరాల ఏర్పాట్ల పేరిట విజయవాడలో అక్రమంగా దేవాలయాలను కూల్చివేస్తున్నారని హిందూ దేవాయయ ప్రతిష్ఠాన పీఠాధిపతి కమలానంద భారతీస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో కృష్ణానది తీరంతో పాటు, ఇతర ప్రాంతాలలో దాదాపు 45 దేవాలయాలను కూల్చివేశారని, చంద్రబాబు సర్కారుకు దైవ ఆగ్రహం అనుభవించక తప్పదని ధ్వజమెత్తారు.

07/01/2016 - 02:45

హైదరాబాద్, జూన్ 30: అదిగో ఇదిగో అంటూ నత్తనడకన సాగిన ఉద్యోగుల తరలింపు ప్రక్రియ విజయవంతం కావడంతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠ పెరిగినట్టయింది. హైదరాబాద్‌లో తిష్ఠవేసి, వెలగపూడికి వెళ్లకుండా మొరాయించిన ఉద్యోగులను అమరావతికి తీసుకురావడంతో పాటు, రెండు రోజులు ఆలస్యమయినప్పటికీ తాత్కాలిక సచివాలయం ప్రారంభం కావడంతో బాబు పరిపాలనపై ఇప్పటివరకూ ఉన్న విమర్శలు తగ్గినట్టయింది.

07/01/2016 - 02:27

హైదరాబాద్, జూన్ 30 : తెలంగాణలోని చిన్న ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలలో ఆరోగ్యశ్రీ సేవలు గురువారం నుండి నిలిచిపోయాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు ఈ పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నెల రోజుల క్రితం ఈ అంశంపై ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపారు.

07/01/2016 - 02:26

హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ న్యాయాధికారులు, కోర్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతున్నారనే అభియోగంపై హైకోర్టు గురువారం సస్పెన్షన్ల వేటును కొనసాగించింది. రంగారెడ్డి జిల్లా జ్యుడీషియల్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి బి లక్ష్మారెడ్డి, రాష్ట్ర సంఘం కార్యదర్శి జగన్నాథం, ప్రధాన కార్యదర్శి రాజశేఖర రెడ్డి సహా మొత్తం తొమ్మిది మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది.

Pages