S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

05/01/2016 - 06:58

హైదరాబాద్, ఏప్రిల్ 30: హైదరాబాద్‌లో ఏ రోడ్డున వెళ్లినా అడుగడుగునా ట్రాఫిక్. నిత్యం నరకాన్ని ఎదుర్కొనే మహానగరవాసుల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రోరైలు కాస్త ఆలస్యంగా పరుగులు తీయనుంది. ప్రతిపాదనల స్థాయి నుంచే అనేక రకాల అడ్డంకులెదుర్కొంటున్న మెట్రోరైలు కనీసం స్వరాష్ట్రం, స్వపరిపాలనలోనైనా కాస్త ముందుగా అందుబాటులోకి వస్తుందని భావించిన జంటనగరవాసుల అంచనాలు తారుమారయ్యాయి.

05/01/2016 - 06:32

భీమవరం, ఏప్రిల్ 30: గోదావరి నదిపై పట్టిసం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయంగా పెనుగొండ మండలం సిద్ధాంతం సమీపంలోని దొంగరావిపాలెం వద్ద ప్రభుత్వం ఏర్పాటుచేసిన తాత్కాలిక ఎత్తిపోతల పథకం సత్ఫలితాన్నిచ్చింది. రూ.15 కోట్ల వ్యయంతో 14 భారీ పంపుల ద్వారా సుమారు 150 క్యూసెక్కుల నీటిని తోడి, ఈ దాళ్వాలో పశ్చిమ డెల్టాలోని 30 వేల ఎకరాలకు నీరందించగలిగారు.

05/01/2016 - 06:31

పీలేరు, ఏప్రిల్ 30: శేషాచల కొండల్లో మరోసారి ఎర్రచందనం కూలీలకు, టాస్క్ఫోర్సు సిబ్బందికి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కూలీల రాళ్ళదాడిలో ఓ కానిస్టేబుల్ గాయపడగా, కిందపడ్డ కూలీ సైతం గాయపడ్డారు. తిరుమల శేషాచల కొండల్లోని బోనుగుట్ట వద్ద శనివారం కూంబింగ్ చేస్తున్న టాస్క్ఫోర్సు సిబ్బందికి దాదాపు 30మంది కూలీలు తారసపడ్డారు.

05/01/2016 - 06:30

విశాఖపట్నం, ఏప్రిల్ 30: రాజకీయ స్పృహతోనే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పలువురు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తాను చేస్తున్న కృషికి మీ అందరి మద్దతు అవసరమన్నారు.

05/01/2016 - 04:23

హైదరాబాద్, ఏప్రిల్ 30: ఆంధ్రనోట మట్టికొట్టే తెలంగాణకు చెందిన పాలమూరు- రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మూడు రోజుల దీక్షకు ఉపక్రమిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మే 16నుంచి మూడు రోజులపాటు కర్నూలులో నిరసన దీక్ష చేపట్టనున్నట్టు వెల్లడించారు.

05/01/2016 - 03:51

హైదరాబాద్, ఏప్రిల్ 30: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి చెందిన 7.5 టన్నుల బంగారాన్ని పసిడి నగదీకరణ పథకం (గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్) ద్వారా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్నామని తితిదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ డి సాంబశివరావు తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

04/30/2016 - 08:08

హైదరాబాద్, ఏప్రిల్ 29: వైద్యం కోసం వెళ్లిన ఓ సినీ నిర్మాతపై ఔషధ ప్రయోగం జరిగింది. కోమాలోకి వెళ్లిన ఆ నిర్మాత మరుసటి రోజు తేరుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. ‘హార్మోన్స్’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఎస్‌ఎస్ నాయక్ ఇటీవల వైద్యం కోసం మంథన్ డయాబెటిస్ సెంటర్‌కు వెళ్లారు.

04/30/2016 - 08:06

హైదరాబాద్, ఏప్రిల్ 29: జూనియర్ సివిల్ జడ్జీల నియామకానికి 2014లో జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఎంపికైన అభ్యర్థుల నియామకానికి హైకోర్టు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీనియర్ న్యాయవాది ఎస్ సత్యంరెడ్డి మరో ఇద్దరు దాఖలు చేసిన మూడు వేర్వేరు పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి బోసలె, జస్టిస్ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.

04/30/2016 - 08:05

హైదరాబాద్, ఏప్రిల్ 29: వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సేవకుల వంశీ మొదటి ర్యాంకు సాధించారు. ఏప్రిల్ 6 నుండి 17వ తేదీ వరకూ భారతదేశంలో 118 నగరాలతో పాటు దుబై, కువైట్, మస్కట్‌లలో కూడా ఈ ప్రవేశపరీక్షను నిర్వహించారుస. విట్ ఫలితాలను గురువారం నాడు ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాధ్ ప్రకటించారు.

04/30/2016 - 07:56

హైదరాబాద్, ఏప్రిల్ 29: పలు ప్రభుత్వ శాఖల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో నిర్మాణ పనులు సాగుతుండడం వల్ల సిబ్బంది సమస్య తలెత్తింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తాత్కాలిక అవసరాలకు పెద్ద ఎత్తున కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ విషయం తెలిపారు.

Pages